అబ్దుల్ హక్ షేక్

వికీపీడియా నుండి
(అబ్దుల్‌ హక్‌ షేక్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అబ్దుల్‌ హక్‌ షేక్‌, తెలుగు ఉపాద్యాయులు, కథానికల రచయిత. ఆధ్యాత్మిక వ్యాసాల రచయిత.

బాల్యము[మార్చు]

అబ్దుల్‌ హక్‌ షేక్‌ ప్రకాశం జిల్లా నేకునాంబాద్‌లో 1942 జూలై 1న జనించారు. వీరి తల్లి తండ్రులు: షేక్‌ ఫాతిమాబీ, షేక్‌ ఖాశిం సాహెబ్‌. చదువు: ఎం.ఏ., బి.ఇడి.

ఉద్యోగం[మార్చు]

అబ్దుల్‌ ఖాదార్‌ షేక్‌ తెలుగు అధ్యాపకులుగా ప్రభుత్వ నియర్‌ కళాశాల, పోరుమామిళ్ళ, కడప జిల్లాలో పనిచేసి ప్రస్తుతము విశ్రాంతి తీసుకుంటున్నారు.

రచనా వ్యాసంగము[మార్చు]

అబ్దుల్‌ ఖాదార్‌ షేక్‌ 1998 నుండి 'వార్త' దినపత్రికలో 'ఆధ్యాత్మికం' శీర్షికకు వ్యాసాలు రాయడంద్వారా రచనా వ్యాసాంగం ఆరంభం. ఆ తరువాత 2007 నుండి వార్తలో 'దివ్య' శీర్షిక క్రింద వారం వారం వ్యాసాలు ప్రచురిత మయ్యాయి. రాష్ట్రంలోని వివిధ పత్రికలలో వ్యాసాలు, కథానికలు ప్రచురితం ఐనాయి. 2009 నాటికి మొత్తం మీదా ఆరువందల వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.

అవార్డులు-పురస్కారాలు[మార్చు]

వీరిని వీరి సేవలకు గాను హైదరాబాదులో రంజాన్‌ పురస్కారంతో సత్కరించారు.

రచనలు[మార్చు]

వీరి రచనలు: 1. సన్మార్గ స్ధరభాలు, 2. సాఫల్య సోపానాలు, 3. సందేశ సుగంథాలు (వ్యాస సంపుాలు) 4. మహాప్రవక్త పవిత్ర చరిత్ర. 5. దైవప్రవక్తల చరిత్ర. మొదలగునవి ప్రచురిత మయ్యాయి.

లక్ష్యం[మార్చు]

ఆధ్యాత్మిక స్ధరభాలను అక్షర రూపంలో నలుదిశలకు వ్యాపింపచేయడం వీరి ప్రధాన లక్ష్యము.

మూలాలు[మార్చు]

అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త—ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట 32