Jump to content

అభిమన్యు ఈశ్వరన్

వికీపీడియా నుండి
అభిమన్యు ఈశ్వరన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అభిమన్యు రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్
పుట్టిన తేదీ (1995-09-06) 1995 సెప్టెంబరు 6 (వయసు: 30)
డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, భారతదేశం
బ్యాటింగురైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్
బౌలింగులెగ్ బ్రేక్ గూగ్లీ
పాత్రటాప్-ఆర్డర్ బ్యాటర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013–ప్రస్తుతంబెంగాల్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఎ ట్వంటీ20
మ్యాచ్‌లు 103 89 34
చేసిన పరుగులు 7,841 3,857 976
బ్యాటింగు సగటు 48.70 47.03 37.53
100s/50s 27/31 9/23 1/5
అత్యధిక స్కోరు 233 149 107*
వేసిన బంతులు 216 6 0
వికెట్లు 2 0 0
బౌలింగు సగటు 73.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/20
క్యాచ్‌లు/స్టంపింగులు 71/– 27/– 9/–
మూలం: [1]

అభిమన్యు ఈశ్వరన్ (తమిళం: [abimaɳjuː iːsʋaɾan]) బెంగాల్ తరపున ఆడే భారతీయ క్రికెటర్. ఆయన కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. అభిమన్యు ఈశ్వరన్ దులీప్ ట్రోఫీలో ఇండియా A, ఇండియా B జట్లకు, రంజీ జట్టులో బెంగాల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అభిమన్యు ఈశ్వరన్ 2013లో బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో అరంగేట్రం చేసి బంగాల్‌తో పాటు, ఇండియా అండర్-23, ఇండియా బ్లూ, ఇండియా-ఎ, ఇండియా-బి, రెస్ట్ ఆఫ్ ఇండియా, బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్, ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్, ఇండియా-రెడ్, ఈస్ట్ జోన్ తరఫున ఆడాడు.[1]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

అభిమన్యు ఈశ్వరన్ 1995 సెప్టెంబర్ 6న డెహ్రాడూన్‌లో జన్మించాడు. ఆయన కోల్‌కతాలోని ఉమేస్ చంద్ర కళాశాలలో చదువుకున్నాడు. ఆయన 10 సంవత్సరాల వయస్సులో తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగించడానికి కోల్‌కతాకు వెళ్లి తన కోచ్ నిర్మల్ సేన్‌గుప్తాతో కలిసి నివసించాడు.

కెరీర్

[మార్చు]

అభిమన్యు ఈశ్వరన్ 2016 - 17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో 2017 జనవరి 31న బెంగాల్ తరపున ట్వంటీ 20లో అరంగేట్రం చేశాడు. అక్టోబర్ 2018లో 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా ఏ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2018–19 రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి, ఆరు మ్యాచ్‌ల్లో 861 పరుగులు చేశాడు.

అభిమన్యు ఈశ్వరన్ ఆగస్టు 2019లో 2019–20 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా రెడ్ జట్టు జట్టులో చోటు దక్కించుకొని టోర్నమెంట్ ఫైనల్‌లో ఇండియా గ్రీన్‌పై 153 పరుగులు చేశాడు. అక్టోబర్ 2019లో 2019–20 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా ఏ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అభిమన్యు ఈశ్వరన్ జనవరి 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టులో ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. మే 2021లో 2019–2021 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో జరిగిన వారి విదేశీ సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టులో నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. అక్టోబర్ 2024లో ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో పాల్గొనడానికి అతను 18 మంది సభ్యుల భారత జట్టులో చేరాడు.

అభిమన్యు ఈశ్వరన్‌ను 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మకు బ్యాకప్‌గా భారత జట్టు చేరగా తుది జట్టులో స్థానం దక్కలేదు.[2] 2023లో దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ స్థానంలో జట్టులో చేరగా తుది జట్టులో స్థానం దక్కలేదు. అభిమన్యు ఈశ్వరన్‎కు 2025లో ఇంగ్లాండ్‎తో జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‎కు భారత జట్టులో చోటు దక్కింది. కానీ జూన్ 20న లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు ప్లేయింగ్ లెవన్‎లో స్థానం దక్కలేదు.[3]

మూలాలు

[మార్చు]
  1. "ఎవరీ అభిమన్యు ఈశ్వరన్‌ - దేశవాళీ రికార్డులేంటీ?". ABP Desam. 24 December 2023. Archived from the original on 4 August 2025. Retrieved 4 August 2025.
  2. "అభిమన్యు ఈశ్వరన్: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ స్థానంలో వచ్చిన ఈ ఓపెనర్ ఎవరు". BBC News తెలుగు. 21 December 2022. Archived from the original on 4 August 2025. Retrieved 4 August 2025.
  3. "IPL గెలిచింది.. డొమెస్టిక్ క్రికెట్ ఓడింది: అభిమన్యు ఈశ్వరన్‎కు జట్టులో చోటు దక్కకపోవడంతో BCCIపై విమర్శలు". V6 Velugu. 20 June 2025. Archived from the original on 4 August 2025. Retrieved 4 August 2025.