అల్లంరాజు రంగశాయి కవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లంరాజు రంగశాయి కవి
జననం1860
మరణం1936
వృత్తికవి
తల్లిదండ్రులు

అల్లంరాజు రంగశాయి కవి (1860 - 1936) ప్రముఖ తెలుగు కవి.

వీరు ఆరామ ద్రావిడ శాఖీయ బ్రాహ్మణులు, హరితసగోత్రులు, ఆపస్తంబసూత్రులు. వీరి తల్లి: చిన్నమాంబ, తండ్రి: అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి. జన్మస్థానము: పీఠికాపుర పరిసరమున నున్న చేబ్రోలు. జననము: 1860- రౌద్రి సంవత్సర నిజాశ్వయుజ శుక్ల తృతీయ సౌమ్యవాసరము. నిర్యాణము: 1936. యువ సంవత్సర చైత్ర బహుళ దశమి.

రచించిన గ్రంథాలు[మార్చు]

తెలుగు గ్రంథాలు[మార్చు]

  • 1. శ్రీమదాంధ్రచంపూభారతము (ఆంధ్రీకరణము. 1913 ముద్రి)
  • 2. రామాయణ చంపువు
  • 3. రఘురామ శతకము.
  • 4. పరమాత్మ శతకము
  • 5. సర్వేశ్వర శతకము.
  • 6. గోవింద శతకము.
  • 7. లక్ష్మీ శతకము.
  • 8. మాధవ శతకము.[1]
  • 9. కుక్కుటలింగ శతకము.
  • 10. గోపాలస్వామి శతకము.
  • 11. మల్లికార్జున శతకము.

సంస్కృత గ్రంథాలు[మార్చు]

  • 1. దైవస్తోత్రరత్నావళి.
  • 2. నారాయణానందలహరి.
  • 3. కవిమానసరంజని.

మూలాలు[మార్చు]

  1. ఆర్కీవులో మాధవ శతకము పుస్తక ప్రతి.
  • అల్లంరాజు రంగశాయి కవి, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 186-191.