ఆంధ్ర లయోలా కళాశాల
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఆంధ్రా లయోల కళాశాల ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కలదు.
స్ధాపితం
[మార్చు]
- ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక కళాశాల. ఇది 1954 లో స్థాపించబడింది.
నిర్వాహణ
[మార్చు]- యేసు ప్రభువుకు చెందిన గురువులు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.
విద్యావిధానం
[మార్చు]- ఈ కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగి, సంవత్సరానికి రెండు సెమిస్టర్లు విధానంలో పాఠ్యాంశాల బోధన జరుగుతుంది.
విద్యార్ధులు
[మార్చు]- ఇక్కడ విద్యార్థినీ-విద్యార్థులు ఇరువురు విద్యను అభ్యసించటానికి అనుకూలమైన వాతావరణం లభిస్తుంది.
వసతులు
[మార్చు]- విద్యార్థినీ-విద్యార్థులకు వేరువేరుగా వసతి గృహాలు ఉన్నాయి.
- క్యాంటీన్ అందుబాటులో ఉంది.
- విశాలమైన ఆట స్థలం కలిగివుంది.
- ద్విచక్ర వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది.
గ్రంథాలయం
[మార్చు]ఈ కళాశాలలో లక్షకు పైగా పుస్తకాలతో రెండు అంతస్థులలో అతి పెద్ద గ్రంథాలయం ఉంది. ఇది ఒక క్రైస్తవ మిషనరీ కళాశాల అయినప్పటికీ, ఇందులో హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలు, ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో వేలాది పుస్తకాలు అందుబాటులో వున్నాయి. పుస్తకాలలో తెలుగులో భగవద్గీత, రామాయణం, భాగవతం, వేదాలు, బైబిల్, శతకాలు, కళలు, నాటకాలు, సంగీతం, చిత్రకళ, నిఘంటువులు, జీవిత చరిత్రలు, ట్రావెల్, మహాత్మ్యాలు, చరిత్ర, సంస్కృతి, హాస్యం, సూక్తులు, దేశభక్తి, నవలలు, సంకలనాలు, కాఫీటేబుల్ బుక్స్ గ్రంథాలయ సమాచారశాస్త్ర గ్రంథాలు, జర్నలిజం మొదలగునవి ఉన్నాయి. పరిశోధనా విద్యార్థులకోసం గ్రంథాలయంలో 20 కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి.
పూర్వ విద్యార్థులలో ప్రముఖులు
[మార్చు]- ముక్కామల అప్పారావు - అమెరికాలో వైద్య ప్రముఖులు
- పి.రమేష్ బాబు - ప్రముఖ హృద్రోగ నిపుణులు, రమేష్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు
- వై.యస్. రాజశేఖరరెడ్డి - ఏ.పి. మాజీ ముఖ్యమంత్రి
- లగడపాటి రాజగోపాల్, విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు
- కనుమూరి రఘురామ కృష్ణ రాజు ఉప సభాపతి ఆ. ప్ర. శాసన సభ
- యార్లగడ్డ హరిచంద్ర ప్రసాద్, మాలక్ష్మి గ్రూప్ అధినేత
- జయప్రకాష్ నారాయణ్, లోక్ సత్తా పార్టీ నాయకుడు
- ఇంద్రగంటి మోహన కృష్ణ, తెలుగు సినిమా దర్శకుడు
- బైర్రాజు రామలింగరాజు, సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్
- టి.ఆర్.ప్రసాద్ మాజీ క్యాబినెట్ సెక్రటరీ, ఆర్థిక సంఘం సభ్యుడు
ప్రత్యేకతలు
[మార్చు]- కళాశాల ప్రాంగణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.
- ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు, కొండపల్లి బొమ్మలు, ఈ కళాశాల విజువల్ కమ్యూనికేషన్ విద్యార్థుల చిత్రకళా ప్రదర్శన, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
