ఆపద్బాంధవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆపద్భాందవుడు
దర్శకత్వంకె.విశ్వనాథ్
స్క్రీన్ ప్లేకె.విశ్వనాథ్
కథకె.విశ్వనాథ్
నిర్మాతఏడిద నాగేశ్వరరావు
తారాగణంచిరంజీవి,
మీనాక్షి శేషాద్రి,
జంధ్యాల
ఛాయాగ్రహణంఎ. విన్సెంట్, అజయన్ విన్సెంట్
కూర్పుజి. జి. కృష్ణారావు
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1992 అక్టోబరు 9 (1992-10-09)
భాషతెలుగు

ఆపద్బాంధవుడు, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

చిరంజీవి ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు నంది అవార్డు లభించింది.

చిత్ర కథ[మార్చు]

మాధవుడు (చిరంజీవి) ఒక పల్లెలో పశువుల కాపరి. ఒక ఉపాధ్యాయుడి (జంధ్యాల) ఇంటికి నమ్మకమైన తోడు. ఉపాధ్యాయుని కూతురు హేమ (మీనాక్షి శేషాద్రి)కి మాధవుడు మంచి దోస్తు. మాధవుడు పశువులను కాస్తుంటాడు. నాటకాలలో వేషాలు కూడా వేస్తుంటాడు. హేమ తండ్రి మంచి కవి, కానీ కవిత్వానికి ఆదరణ లేనందున ఆతని కవిత్వాన్ని ప్రచురించలేకపోతాడు.

హేమ అక్క ఒక జమీందారి కుటుంబానికి కోడలుగా వెళుతుంది. ఆ వివాహానికి మాధవుడు వారికి తెలియకుండా కొంత సహాయం చేస్తాడు. తరువాత తన పశువులన్నింటినీ అమ్మేసి, జంధ్యాల కవితలను ముద్రింపజేస్తాడు. అతని అభిమానానికి సంతోషించి ఆ కవి తన రచనలకు మాధవున్ని కృతిభర్తగా చేస్తాడు.

గర్భవతిగా ఉన్న అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలా నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు. పిచ్చి కుదిరిన హేమ తమ మధ్య అంతర్లీనంగా ఉన్న ప్రేమను గ్రహించి అతనిని పెళ్ళాడాలని కోరుకుంటుంది. తమ మధ్య ఉన్న అంతరాల కారణంగా మాధవుడు అది చాలా అనుచితమైనదని భావిస్తాడు. అయితే హేమను పెళ్ళి చేసుకోవాలనుకొన్న యువకుడు (శరత్ బాబు) వారి మధ్యనున్న ప్రేమను గ్రహించి వారిని ఒప్పిస్తాడు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • అతల వితల పాతాల, రచన: సిరివెన్నెల, గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ఔరా, అమ్మక చెల్లా! బాపురే బ్రహ్మకు చెల్లా!!రచన: సిరివెన్నెల, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి , రచన: సిరివెన్నెల, గానం. కె ఎస్ చిత్ర
  • చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి 2, రచన:సిరివెన్నెల, గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
  • పువ్వు నవ్వే గువ్వ నవ్వే , రచన: సి నారాయణ రెడ్డి ,గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
  • ఒడి ఒడి ఓడియప్పారచన: భువన చంద్ర , గానం.గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • పరమేశ్వరుని , రచన: సిరివెన్నెల, గానం.కె ఎస్ చిత్ర