ఆర్మూరు పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మునిసిపల్ చైర్‌పర్సన్, స్వాతి సింగ్ బబ్లూ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్‌కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఫైల్డ్ పబ్లిసిటీ నిర్వహించిన ర్యాలీని జెండాతో ప్రారంబించిన చిత్రదృశ్యం

ఆర్మూరు పురపాలక సంఘం, నిజామాబాదు జిల్లాకు చెందిన పురపాలక సంఘం. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆర్మూరు పాలక సంస్థను 2006లో పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేసారు.. ఈ పురపాలక సంఘం పరిధి 18.82 చ.కి.మీ. 2001లో 40836 జనాభా ఉండగా 2011 నాటికి అది 43902కు పెరిగింది.

చరిత్ర[మార్చు]

1956 నుంచి 1962 కాలంలో ఆర్మూరు పురపాలక సంఘంగా ఉండేది. ఆ కాలంలో కెవి నరసింహారెడ్డి చైర్మెన్‌గా పనిచేశారు. 1962లో దీనిని మేజర్ పంచాయతీగా మార్చారు. 2006లో మళ్ళీ హోదా పెంచి పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేశారు. 2008లో ఈ పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించగా ఒప్పందం ప్రకారం త్రివేణి గంగాధర్, కంచెట్టి గంగాధర్‌లు చెరో రెండున్నర సంవత్సరాలు చైర్మెన్ పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి 2014, మార్చి 30న రెండో సారి ఎన్నికలు జరిగాయి

ఆదాయ వనరులు[మార్చు]

పురపాలక సంఘానికి ముఖ్య ఆదాయం ఆస్తిపన్నులు. 2010-11లో మొత్తం పన్ను, పన్నేతర వసూళ్ళు 52.49 కోట్ల రూపాయలు కాగా ఇందులో ఆస్తిపన్ను వాటా 47.39 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ప్రకటనల వల్ల, దుకాణాల అద్దె ద్వారా, నీటి పన్నులు తదితర వసూళ్ళ ద్వారా ఆదాయం రాబట్టుకుంటుంది.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]