ఆర్. ముత్తయ్య
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
Sedapatti R. Muthaiah | |
---|---|
![]() | |
Union Minister for Surface Transport | |
In office 19 March 1998 – 8 April 1998 | |
అంతకు ముందు వారు | T. G. Venkatraman |
తరువాత వారు | M. Thambidurai |
Member of Parliament (Lok Sabha) for Periyakulam | |
In office 1998–1999 | |
అంతకు ముందు వారు | R. Gnanagurusamy |
తరువాత వారు | T. T. V. Dhinakaran |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Muthappanpatti, Madras Presidency, British India | 1945 అక్టోబరు 4
మరణం | 2022 సెప్టెంబరు 21 Madurai, Tamil Nadu, India | (వయసు: 76)
రాజకీయ పార్టీ | Dravida Munnetra Kazhagam |
ఇతర రాజకీయ పదవులు | All India Anna Dravida Munnetra Kazhagam (1972 - 2000) |
సెడాపట్టి ఆర్. ముత్తయ్య ( 1945 అక్టోబర్ 4-2022 సెప్టెంబర్ 21) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీకి చెందిన రాజకీయవేత్త. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే) పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ముత్తయ్య ఒకడు. ఆయన సెడపట్టియార్ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఆర్. ముత్తయ్య తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో కీలకమైన నాయకునిగా గుర్తింపు పొందాడు..
ప్రారంభ జీవితం నేపథ్యం
[మార్చు]ముత్తయ్య తమిళనాడు రాష్ట్రంలోని టి. కల్లుపట్టి జిల్లా కేంద్రం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముత్తప్పన్పట్టి అనే గ్రామంలో జన్మించాడు. ముత్తయ్య మదురైలోని త్యాగరాజర్ కళాశాల నుండి డిస్టింక్షన్తో గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎం. ఎస్. సి.) చేశారు. ముత్యయ్య తన పి. యు. సి పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు. కానీ ముత్తయ్యకు గ్రామీణ నేపథ్యం ఉండటంతో అంతేకాకుండా ఇంజనీరింగ్ విద్యపై అవగాహన ఉండకపోవడంతో ముత్తయ్యకు ఏ ఇంజనీరింగ్ కళాశాలలో షీటు దొరకలేదు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన విద్యారంగంలో ఉన్నారు.
ప్రారంభ రాజకీయ జీవితం
[మార్చు]ఆర్. ముత్తయ్య ద్రవిడ ఉద్యమ ప్రారంభ రోజుల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) పార్టీ లో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ముత్తయ్య హిందీ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నారు. ముత్తయ్య హిందీ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉద్యమాలలో ప్రసంగించి మంచి వక్త గా పేరు తెచ్చుకున్నాడు. ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని ప్రారంభించినప్పుడు ముత్తయ్య మద్దతుదారులు చాలా మంది డీఎంకేను వదిలి అన్నాడీఎంకే పార్టీలో చేరారు. మధురై ప్రాంతంలో ఎం. జి. ఆర్. కు పెద్ద మద్దతు ఉన్నందున ముత్తయ్య తన మద్దతుదారులతో కలిసి చేరారు.
రాష్ట్ర రాజకీయాలు
[మార్చు]1977 విద్యార్థి నాయకుడిగా ఉన్న ముత్తయ్యను ఎంజీఆర్ 1977 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సెడాపట్టి నియోజకవర్గం అన్నా డీఎంకే అభ్యర్థిగా ప్రకటించాడు . ముత్తయ్య తొలిసారి గెలిచి తమిళనాడు శాసనసభలోకి అడుగు పెట్టాడు. ముత్తయ్య సెడాపట్టి శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1991 నుండి 1996 వరకు తమిళనాడు శాసనసభ స్పీకర్ గా ముత్తయ్య పనిచేశాడు. సెడాపట్టి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోను గెలవడంతో ఆ నియోజకవర్గ ప్రజలు , ముత్తయ్యను ప్రేమగా "సెడప్పట్టియార్" అని పిలిచేవారు, తరువాత ఇది ఆయన ఇంటిపేరుగా పేరుగా మారింది. ముత్తయ్య జన్మించిన టి.కల్లుపట్టి గ్రామం 42 గ్రామాలతో కలిసి రెవెన్యూ గ్రామంగా ఏర్పడింది .

జాతీయ రాజకీయాలు
[మార్చు]ముత్తయ్య తొమ్మిదవ లోక్ సభ, పన్నెండవ లోక్ సభ కు పెరియకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఎంపీగా ఎన్నికైన తర్వాత అటల్ బిహారీ వాజ్ పాయ్ మంత్రివర్గం లో కేంద్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు..[1] ముత్తయ్య కేంద్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్దికాలం మాత్రమే ఆ పదవిలో కొనసాగాడు చెన్నై కోర్టులో ముత్తయ్య మీద కేసు నమోదు కావడంతో కేంద్ర మంత్రి పదవికి ముత్తయ్య రాజీనామా చేయవలసి వచ్చింది. ముత్తయ్య రవాణా శాఖ మంత్రిగా ఉండగా ఆయన పై 42 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు వెనుక డీఎంకే హస్తం ఉందని ముత్తయ్య పలుసార్లు డిఎంకె పార్టీ ని విమర్శించాడు. . రాజీనామా చేసిన తర్వాత ముత్తయ్య పార్లమెంటులో అన్నా డీఎంకే పార్టీ తరఫున తమిళనాడు రాష్ట్రంలోని సమస్యలపై పార్లమెంటులో ప్రసంగించాడు.
రాజకీయ మలుపు
[మార్చు]పన్నెండవ లోక్సభ లో అన్న డీఎంకే పార్టీ అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో అటల్ బిహారీ వాజపేయి విశ్వాస పరీక్షకు పిలుపునిచ్చారు. చివరికి అటల్ బిహారీ వాజపేయి 1 ఓటు తేడాతో ఓడిపోయారు, విశ్వాస పరీక్షలో ప్రతిపక్షానికి 270 ఓట్లు, భారతీయ జనతా పార్టీకి 269 ఓట్లు వచ్చాయి. అన్నాడీఎంకే పార్టీ ఆదేశాల మేరకు ముత్తయ్య అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాడు. కానీ సాంకేతిక లోపం కారణంగా ముత్తయ్య ఓటు అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వానికి అనుకూలంగా పడింది. ఓటింగ్ యంత్రం లో సాంకేతిక వల్ల ముత్తయ్య ఓటు సరిగ్గా పడలేదు. ఈ సాంకేతిక సమస్యను పార్లమెంటు బృందం గుర్తించింది, కానీ ఆ సమయంలో వారు దాన్ని సరిదిద్దలేదు.[2] దీంతో తమ పార్టీలో ఉండి అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ముత్తయ్యను అన్నా డీఎంకే పార్టీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. సాంకేతిక లోపం వల్ల మృదుభాషి అయిన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడి పతనం ఎలా జరిగిందో రాజకీయ విమర్శకులు ఆశ్చర్యపోయారు. .[3]
తర్వాత రాజకీయ జీవితం
[మార్చు]
పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో ముత్తయ్య దిగ్బ్రాంతి కి గురయ్యాడు . ముత్తయ్య ను పార్టీ నుంచి బహిష్కరించడం పట్ల ముత్తయ్య అభిమానులు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పార్టీలో నుంచి తనను బహిష్కరించడం పై శశికళ స్పందించాలని ముత్తయ్య అన్నారు. 2001 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఆయన తన భార్య శ్రీమతి శకుంతలను నిలబెట్టారు. కానీ ఆ ఎన్నికలలో శకుంతల ఓడిపోయింది.[4] 2001 తర్వాత ముత్తయ్య రాజకీయాలకు దూరమయ్యాడు. 2006లో ముత్తయ్య రాజకీయాలలోకి తిరిగి ప్రవేశించాడు. 2006లో డిఎంకె పార్టీలో చేరడం ద్వారా మత్తయ్య తన రాజకీయ పునరాగమనని ప్రారంభించాడు. ముత్తయ్య సొంత గ్రామం టి. కల్లుపట్టి గ్రామ ప్రజలు ముత్తయ్య అనుచరలు పెద్ద సంఖ్యలో డిఎంకె పార్టీలోకి చేరారు. ఈ చేరికలు 2004 పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ఉపయోగపడ్డాయి. ముత్తయ్య డీఎంకే పార్టీ చేపట్టే అన్ని రాజకీయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి తో ముత్తయ్య సన్నిహితంగా ఉండేవాడు.
ఎన్నికల పనితీరు
[మార్చు]తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
[మార్చు]ఎన్నికలు | నియోజకవర్గ | పార్టీ | ఫలితం. | ఓట్ల శాతం | ప్రతిపక్షాల అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్షాల ఓట్ల శాతం |
---|---|---|---|---|---|---|---|
1977 తమిళనాడు శాసనసభ ఎన్నికలు | సెడాపట్టి | అన్నాడీఎంకే | గెలుపు | 43.52 | ఎ. ఆర్. పి. అళగర్సామి | ఐఎన్సి | 26.41 |
1980 తమిళనాడు శాసనసభ ఎన్నికలు | సెడాపట్టి | అన్నాడీఎంకే | గెలుపు | 59.87 | ఆర్. ఎస్. తంగరసన్ | డీఎంకే | 26.41 |
1984 తమిళనాడు శాసనసభ ఎన్నికలు | సెడాపట్టి | అన్నాడీఎంకే | గెలుపు | 47.29 | ఎన్. ఎస్. సెల్వరాజ్ | ఐఎన్సి | 41.20 |
1989 తమిళనాడు శాసనసభ ఎన్నికలు | సెడాపట్టి | అన్నాడీఎంకే | ఓటమి | 24.56 | ఎ. అథిఅమాన్ | డీఎంకే | 31.57 |
1991 తమిళనాడు శాసనసభ ఎన్నికలు | సెడాపట్టి | అన్నాడీఎంకే | గెలుపు | 58.85 | ఎ. అథిఅమాన్ | డీఎంకే | 31.49 |
1996 తమిళనాడు శాసనసభ ఎన్నికలు | సెడాపట్టి | అన్నాడీఎంకే | ఓటమి | 39.33 | జి. తలపతి | డీఎంకే | 49.69 |
లోక్ సభ ఎన్నికలు
[మార్చు]ఎన్నికలు | నియోజకవర్గ | పార్టీ | ఫలితం. | ఓట్ల శాతం | ప్రతిపక్షాల అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్షాల ఓట్ల శాతం |
---|---|---|---|---|---|---|---|
1989 భారత సాధారణ ఎన్నికలు | పెరియాకులం | అన్నాడీఎంకే | గెలుపు | 60.7 | A.K.Cumbum మహింద్రన్ | డీఎంకే | 27.3 |
1998 భారత సాధారణ ఎన్నికలు | పెరియాకులం | అన్నాడీఎంకే | గెలుపు | 51.8 | R.Gandhimathy | డీఎంకే | 40.4 |
వ్యక్తిగత జీవితం
[మార్చు]ముత్తయ్య చిన్న కుమారుడు ఎం. మణిమారన్ ప్రస్తుతం మధురై దక్షిణ జిల్లా, డిఎంకె పార్టీ కార్యదర్శిగా ఉన్నారు.. ముత్తయ్య 2016 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో తిరుప్పరన్కుంద్రం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.[5]
ముత్తయ్య 76 సంవత్సరాల వయసులో 2022 సెప్టెంబర్ 21న అనారోగ్యంతో బాధపడుతూ మదురైలో మరణించారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19980322/08150624.html This article or section is not displaying correctly in one or more Web browsers. (February 2022)
- ↑ "Indian Express: LS secretariat refuses to rectify Muthiah's error". Archived from the original on 10 October 2012. Retrieved 2010-11-27.
- ↑ "Sedapatti blames Sasikala of hijacking party". Archived from the original on 10 October 2012. Retrieved 2010-11-27.
- ↑ "State Elections 2001 Candidates Details for 136-Sedapatti constituency of TAMIL NADU". Archived from the original on 30 September 2012. Retrieved 8 January 2011.
- ↑ "Tamil Nadu Legislative Assembly: Details of terms of successive Legislative Assemblies constituted under the Constitution of India". Government of India. Archived from the original on 9 April 2009.
- ↑ "Former Speaker Sedapatti Muthiah passed away". Pipa News. Retrieved 21 September 2022.