ఇథియోపియన్ సామ్రాజ్యం
Ethiopian Empire | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| 1270–1974 1936–1941: Government-in-exile | |||||||||
నినాదం: ኢትዮጵያ ታበፅዕ እደዊሃ ኀበ እግዚአብሔር Ityopia tabetsih edewiha ḫabe Igziabiher (English: "Ethiopia Stretches Her Hands unto God") (Psalm 68:31) | |||||||||
| రాజధాని | None[note 1] (1270–1635) Gondar (1635–1855) Debre Tabor (1855–1881) Mekelle (1881–1889) Addis Ababa (1889–1974) | ||||||||
| సామాన్య భాషలు | Amharic (dynastic, official, court)[3][4] Ge'ez (liturgical language, literature) many others | ||||||||
| మతం |
| ||||||||
| పిలుచువిధం | Endonym: Ethiopian Exonym: Abyssinian | ||||||||
| ప్రభుత్వం | Absolute monarchy (1270–1931)[5]
Unitary parliamentary constitutional monarchy (1931–1974) | ||||||||
| Emperor | |||||||||
• 1270–1285 (first) | Yekuno Amlak[6] | ||||||||
• 1930–1974 (last) | Haile Selassie | ||||||||
| Prime Minister | |||||||||
• 1909–1927 (first) | Habte Giyorgis | ||||||||
• 1974 (last) | Mikael Imru | ||||||||
| శాసనవ్యవస్థ | None (rule by decree) (until 1931) Parliament (1931–1974)[7] | ||||||||
• ఎగువ సభ | Senate (1931–1974) | ||||||||
• దిగువ సభ | Chamber of Deputies (1931–1974) | ||||||||
| చారిత్రిక కాలం | Middle Ages to Cold War | ||||||||
• Ascension of Yekuno Amlak | 1270 | ||||||||
• Conquests of Amda Seyon I | 1314–1344 | ||||||||
| 1529–1543 | |||||||||
| 1557–1589 | |||||||||
| 1632–1769 | |||||||||
| 1769–1855 | |||||||||
| 1878–1904 | |||||||||
| 1895–1896 | |||||||||
| 16 July 1931 | |||||||||
• Second Italo-Ethiopian War (annexed into Italian East Africa) | 3 October 1935 | ||||||||
| 5 May 1941 | |||||||||
• Coup d'état by the Derg | 12 September 1974 | ||||||||
| 21 March 1975[8][9][10][11] | |||||||||
| విస్తీర్ణం | |||||||||
| 1954 | 1,221,900 km2 (471,800 sq mi) | ||||||||
| జనాభా | |||||||||
• 1973 | 30,166,785[12] | ||||||||
| ద్రవ్యం |
| ||||||||
| |||||||||
| Today part of | Eritrea Ethiopia | ||||||||
ఇథియోపియను సామ్రాజ్యం [a] చారిత్రాత్మకంగా అబిస్సినియా లేదా కేవలం ఇథియోపియా అని పిలువబడే ఇథియోపియను సామ్రాజ్యం.[b] ప్రస్తుత ఇథియోపియా, ఎరిట్రియా భూభాగాలను కలిగి ఉన్న ఒక సార్వభౌమ రాజ్యం. [17] ఇది సుమారు 1270లో యెకునో అమ్లాకు చేత సోలమొనికు రాజవంశం స్థాపించబడినప్పటి నుండి, చివరి చక్రవర్తి హైలే సెలాసీ పాలనను అంతం చేసిన 1974 డెర్గు తిరుగుబాటు వరకు ఉనికిలో ఉంది. 19వ శతాబ్దం చివరలో చక్రవర్తి 2వ మెనెలికు పాలనలో సామ్రాజ్యం దక్షిణ దిశగా గణనీయంగా విస్తరించింది. 1952లో ఎరిట్రియా సెలాసీ పాలనలో సమాఖ్యగా విలీనం చేయబడింది. తన చరిత్రలో చాలా కాలం పాటు శత్రు శక్తులచే చుట్టుముట్టబడినప్పటికీ ఈ సామ్రాజ్యం తన ప్రాచీన క్రైస్తవ వారసత్వాన్ని కేంద్రంగా చేసుకుని ఒక రాజ్యాన్ని కొనసాగించింది. [18]
చివరి అక్సుమైటు, చివరికి రాజు సోలమను, షెబా రాణి నుండి వచ్చినట్లు చెప్పుకునే యెకునో అమ్లాకు 1270లో స్థాపించారు ఇది అగావు స్థానంలో ఉంది. ప్రారంభంలో చాలా చిన్నది. రాజకీయంగా అస్థిరమైన సంస్థ అయినప్పటికీ అమ్డా సెయోను I (1314–1344) డేవిడు I (1382–1413) ల క్రూసేడుల సమయంలో సామ్రాజ్యం గణనీయంగా విస్తరించగలిగింది. తాత్కాలికంగా హార్ను ఆఫ్ ఆఫ్రికాలో ఆధిపత్య శక్తిగా మారింది [19] ఇథియోపియా సామ్రాజ్యం చక్రవర్తి జరా యాకోబు (1434–1468) సుదీర్ఘ పాలనలో శిఖరాగ్రానికి చేరుకుంది. ఆయన తన పూర్వీకుల విజయాలను ఏకీకృతం చేశాడు. అనేక చర్చిలు మఠాలను నిర్మించాడు, సాహిత్యం, కళలను ప్రోత్సహించాడు, ప్రాంతీయ యుద్ధ ప్రభువులను పరిపాలనా అధికారులతో భర్తీ చేయడం ద్వారా సామ్రాజ్య అధికారాన్ని కేంద్రీకరించాడు, ప్రక్కనే ఉన్న ఇస్లామికు భూభాగాల మీద తన ఆధిపత్యాన్ని గణనీయంగా విస్తరించాడు. [20][21][22]
పొరుగున ఉన్న ముస్లిం అడలు సుల్తానేటు సామ్రాజ్యం మీద పదేపదే దండయాత్రలకు ప్రయత్నిస్తూ దానిని బెదిరించడం ప్రారంభించింది. చివరకు ఇమాం మహఫుజు నాయకత్వంలో విజయం సాధించింది. [23] మహఫుజును చక్రవర్తి లెబ్నా డెంగెలు ఆకస్మిక దాడి చేసి ఓడించడం 16వ శతాబ్దం ప్రారంభంలో ఒట్టోమను మద్దతుగల అడలైటు ఇమాం అహ్మదు గ్రాన్ యుద్ధం జిహాదుకు దారితీసింది. ఆయన పోర్చుగీస్ వారి సహాయంతో 1543లో ఓడిపోయాడు.[24]తీవ్రంగా బలహీనపడటంతో ఒరోమో వలసలు కారణంగా సామ్రాజ్యం దక్షిణ భూభాగంలో ఎక్కువ భాగం, సామంతులు చేజారిపోయారు. ఉత్తరాన ఇప్పుడు ఎరిట్రియాగా ఉన్న ప్రాంతంలో ఇథియోపియా ఒట్టోమను దండయాత్ర ప్రయత్నాలను తిప్పికొట్టగలిగినప్పటికీ ఎర్ర సముద్రం మీద తన ప్రాప్యతను వారికి కోల్పోయింది. [25] ఈ సవాళ్లకు ప్రతిస్పందనగా 1630లలో చక్రవర్తి ఫాసిలిడెసు గోండారు అనే కొత్త రాజధానిని స్థాపించాడు. ఇది గోండరైను కాలంగా పిలువబడే ఒక కొత్త స్వర్ణయుగానికి నాంది పలికింది. ఈ కాలంలో సాపేక్ష శాంతి, ఒరోమోల విజయవంతమైన ఏకీకరణ, సంస్కృతి వికసించడం కనిపించింది. చక్రవర్తులు 2వ ఇయాసు (1755), 1వ ఇయోసు (1769) మరణాలతో, రాజ్యం చివరికి జెమెనె మెసాఫింటు అని పిలువబడే వికేంద్రీకరణ కాలంలోకి ప్రవేశించింది. ఇక్కడ ప్రాంతీయ యుద్ధ ప్రభువులు అధికారం కోసం పోరాడారు. చక్రవర్తి కేవలం ఒక కీలుబొమ్మగా మిగిలిపోయాడు. [26]
చక్రవర్తి 2వ టెవోడ్రోసు (ప. 1855–1868) జెమెనె మెసాఫింటుకు ముగింపు పలికి, సామ్రాజ్యాన్ని తిరిగి ఏకీకృతం చేసి, బ్రిటిషు అబిస్సినియా దండయాత్ర సమయంలో మరణించడానికి ముందు దానిని ఆధునిక యుగంలోకి నడిపించాడు. ఆయన వారసుడు 4వ యోహన్నెసు ప్రధానంగా యుద్ధాలలో నిమగ్నమై, ఈజిప్షియన్లుమ్ మహ్దిస్టులతో విజయవంతంగా పోరాడి 1889లో మహ్దిస్టులతో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఇప్పుడు అడిసు అబాబాలో నివసిస్తున్న చక్రవర్తి 2వ మెనెలికు, ప్రస్తుత పశ్చిమ, దక్షిణ తూర్పు ఇథియోపియాలోని కఫా, వెలయ్తా, హరరు ఇతర రాజ్యాల వంటి అనేక ప్రజలను, రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ విధంగా 1898 నాటికి ఇథియోపియా తన ఆధునిక ప్రాదేశిక సరిహద్దుల వరకు విస్తరించింది. ఉత్తర ప్రాంతంలో ఆయన ఇటలీ విస్తరణను ఎదుర్కొన్నాడు. 1896లో అడ్వా యుద్ధంలో ఆధునిక దిగుమతి చేసుకున్న ఆయుధాలను ఉపయోగించి ఇటాలియన్ల మీద సాధించిన అద్భుతమైన విజయం ద్వారా మెనెలికు ఇథియోపియా స్వాతంత్ర్యాన్ని సురక్షితం చేసి ఇటలీని ఎరిట్రియాకే పరిమితం చేశాడు.
తరువాత రెండవ ఇటలో-ఇథియోపియను యుద్ధం తర్వాత బెనిటో ముస్సోలినీకి చెందిన ఇటాలియన్ సామ్రాజ్యం ఇథియోపియాను ఆక్రమించి, ఇటాలియన్ తూర్పు ఆఫ్రికాను స్థాపించింది, దానిని పొరుగున ఉన్న ఎరిట్రియా మరియు ఆగ్నేయంలోని ఇటాలియన్ సోమాలిలాండు కాలనీలతో విలీనం చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిషు సైన్యం సహాయంతో ఇటాలియన్లను ఇథియోపియా నుండి తరిమివేశారు. చక్రవర్తి ప్రవాసం నుండి తిరిగి వచ్చాడు. ఆ దేశం ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్యులలో ఒకటిగా అవతరించింది. అయినప్పటికీ 1973 వోల్లో కరువు దేశీయ అసంతృప్తి 1974లో సామ్రాజ్యం పతనానికి దారితీసింది. [27]
చరిత్ర
[మార్చు]నేపథ్యం
[మార్చు]సా.శ. 10వ శతాబ్దంలో అక్సుం రాజ్యం పతనం తరువాత ఇథియోపియను ఉన్నత ప్రాంతాలు జాగ్వే రాజవంశం పాలనలోకి వచ్చాయి. ఈ కొత్త పాలకులైన అగావులు లాస్టా ప్రాంతం నుండి వచ్చారు. తరువాత మత గ్రంథాలు ఈ రాజవంశానికి స్వచ్ఛమైన "సొలొమోనికు" వంశం లేదని ఆరోపించాయి. వారి విజయాలను అపహాస్యం చేశాయి. వారు తమ అధికార పరాకాష్టలో ఉన్నప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు వారిని సింహాసనాన్ని ఆక్రమించుకున్నవారిగా భావించారు. అయితే జాగ్వేల వాస్తుశిల్పం మునుపటి అక్సుమైటు సంప్రదాయాల ఛాయలను చూపిస్తుంది. వాటిని లాలిబెలలో చూడవచ్చు. రాతిని తొలిచి నిర్మించిన చర్చిల నిర్మాణం చివరి అక్సుమైటు యుగంలో మొదలై జాగ్వేల పాలనలో దాని శిఖరాన్ని చేరుకుంది.[28]
జాగ్వేలు సింహాసనం కోసం జరిగే కలహాలను ఆపలేకపోయారు. దీనివలన రాజవంశం అధికారాన్ని సుస్థిరం చేయడానికి ఉపయోగించాల్సిన మనుషులు, శక్తి, వనరులు వృధా అయ్యాయి. 13వ శతాబ్దం చివరి నాటికి బెటే అమ్హారాలో యెకునో అమ్లాకు అనే యువ అమ్హారా ప్రభువు అధికారంలోకి వచ్చాడు. ఆయన చర్చిని పాక్షిక స్వతంత్ర సంస్థగా చేస్తానని వాగ్దానం చేయడంతో ఆర్థడాక్సు చర్చి ఆయంకు గట్టి మద్దతు ఇచ్చింది. పొరుగున ఉన్న ముస్లిం మఖ్జూమి రాజవంశం నుండి కూడా ఆయన మద్దతు లభించింది. యెకునో అమ్లాకు అప్పుడు జాగ్వే రాజు మీద తిరుగుబాటు చేసి అన్సటా యుద్ధంలో ఆయనను ఓడించాడు. తద్దెస్సే తమ్మెరతు ఈ రాజు యెటుబారకు అని వాదించారు. కానీ ఒక స్థానిక రకమైన డామ్నాటియో మెమోరియే కారణంగా ఆయన పేరు అధికారిక రికార్డుల నుండి తొలగించబడింది.[29] వోల్లో చరిత్ర ఇటీవలి చరిత్రకారుడు, గెటట్చెవు మెకోన్నెను హాసెను, యెకునో ఆమ్లు చేత పదవీచ్యుతుడైన చివరి జాగ్వే రాజు నా'అకుయెటో లా'అబ్ అని పేర్కొన్నాడు. [30][31]
ప్రారంభ సోలమొనికు కాలం
[మార్చు]
యెకునో అమ్లాకు క్రీ.శ. 1270 నాటికి సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన అక్సుం రాజ్యం చివరి రాజు అయిన దిల్ నా'ఓడ్ వారసుడని తద్వారా అక్సుం రాజవంశానికి చెందినవాడని చెప్పబడింది. అక్సుం రాజవంశం ద్వారా, యెకునో అమ్లాకు బైబిలు రాజు సోలమను వారసుడని కూడా వాదించబడింది. ఈ వాదన ప్రామాణిక రూపం 14వ శతాబ్దపు గ్రంథమైన కెబ్రా నగస్టులో నమోదు చేయబడిన ఇతిహాసాలలో పొందుపరచబడింది. దీని ప్రకారం అక్సుం నుండి వచ్చినట్లు చెప్పబడే షెబా రాణి, జెరూసలేంను సందర్శించి అక్కడ రాజు సోలమనుతో ఒక కుమారుడిని కన్నది. తన స్వదేశమైన ఇథియోపియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఆ బిడ్డకు జన్మనిచ్చింది. ఆయన పేరు 1వ మెనెలికు. ఆయన, తన వారసులు (వారిలో అక్సుం రాజకుటుంబం కూడా ఉంది) జాగ్వే ఆక్రమణదారులచే పదవీచ్యుతులను చేసే వరకు ఇథియోపియాను పాలించారు. 1వ మెనెలికు ప్రత్యక్ష వారసుడిగా భావించబడిన యెకునో అమ్లాకు. ఆయన సోలమొనికు వంశాన్ని "పునరుద్ధరించాడని" వాదించబడింది.[32]
యెకునో అమ్లాకు తన పాలన అంతటా ముస్లింలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాడు. ఆయన పొరుగున ఉన్న మఖ్జూమి రాజవంశంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడమే కాకుండా యెమెనులోని రసూలిదులు ఈజిప్టులోని మమ్లూకు సుల్తానేటుతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడు. మమ్లూకు సుల్తాను బైబర్సుకు పంపిన ఒక లేఖలో ఆయన అరేబియా ముస్లింలకు స్నేహపూర్వక సహకారం అందించాలనే తన ఉద్దేశాన్ని పేర్కొన్నాడు. అబిస్సినియాలోని ముస్లింలందరికీ తాను రక్షకుడినని తనను తాను వర్ణించుకున్నాడు. ఒక తీవ్ర భక్తిగల క్రైస్తవుడైన ఆయన జెన్నెటా మరియం చర్చిని నిర్మించమని ఆదేశించాడు. తన పనిని స్మరించుకుంటూ ఒక శాసనాన్ని కూడా చెక్కించాడు. దాని మీద "దేవుని దయవలన నేను రాజు యెకునో అమ్లాకు దేవుని చిత్తం ప్రకారం సింహాసనం అధిష్టించిన తర్వాత ఈ చర్చిని నిర్మించాను" అని వ్రాసి ఉంది.
1285లో యెకునో అమ్లాకు తర్వాత ఆయన కుమారుడు యాగ్బేయు సెయోను సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన మామ్లూకు సుల్తాను కలావునుకు ఒక లేఖ రాశాడు. అందులో అలెగ్జాండ్రియా పాట్రియార్కు ఇథియోపియను ఆర్థోడాక్సు చర్చి కోసం ఒక 'అబునా' లేదా మెట్రోపాలిటనును పంపడానికి అనుమతించమని కోరాడు. అదే సమయంలో ఈజిప్టులోని తన క్రైస్తవ ప్రజల పట్ల సుల్తాను వ్యవహరిస్తున్న తీరును నిరసించాడు. ఇథియోపియాలో తాను తన ముస్లిం ప్రజలకు రక్షకుడిగా ఉన్నానని పేర్కొన్నాడు. తన పాలన చివరిలో యాగ్బేయు తన కుమారులలో ఒకరిని తన వారసుడిగా నియమించడానికి నిరాకరించాడు. బదులుగా వారిలో ప్రతి ఒక్కరూ ఒక సంవత్సరం పాటు పాలించాలని శాసించాడు. 1294లో ఆయన కుమారులు ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్టించారు. కానీ ఈ ఒప్పందం వెంటనే విఫలమైంది. 1299 నాటికి ఆయన కుమారులలో ఒకడైన వెడెం అరదు సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. వెడెం అరదు తూర్పు షెవాలో విస్తరించడానికి ప్రయత్నిస్తున్న పొరుగున ఉన్న ఇఫాటు సుల్తానేటుతో సంఘర్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.
అమ్దా సెయోను విజయాలు
[మార్చు]
వెడెం అరదు తర్వాత ఆయన కుమారుడు 1వ అమ్దా సెయోను సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన పాలనలో ముస్లిం శత్రువుల మీద రాజు చేసిన వివిధ సైనిక దండయాత్రల గురించి చాలా వివరంగా కచ్చితమైనదిగా అనిపించే ఒక వృత్తాంతం రచించబడింది. ఆధునిక కాలం వరకు ఇథియోపియను చక్రవర్తుల కోసం వ్రాయబడిన రాజవంశ చరిత్రల శ్రేణిలో ఇది మొదటిది. ఈ రాజవంశ చరిత్రలు ఆఫ్రికా కొమ్ము ప్రాంతంలోని మొత్తం మధ్యయుగ కాలానికి సంబంధించిన నిరంతర కాలక్రమ రికార్డును అందించాయి. ఆయన పాలనలో వెలువడిన మరో ముఖ్యమైన గ్రంథం ఫెథా నగాస్టు లేదా "రాజుల చట్టం" ఇది దేశానికి చట్ట నియమావళిగా పనిచేసింది. ఎక్కువగా బైబిలు సూత్రాల మీద ఆధారపడిన ఇది ఆ కాలపు చట్టపరమైన సామాజిక ఆలోచనలను క్రోడీకరించింది. 20వ శతాబ్దం ప్రారంభం వరకు వాడుకలో ఉంది.
యుద్ధవీరుడైన చక్రవర్తి 1వ అమ్దా సెయోన గోజ్జాం, దామోటు, ఎరిట్రియాలలో అనేక దండయాత్రలు చేశాడు. కానీ ఆయన అత్యంత ముఖ్యమైన దండయాత్రలు తూర్పున ఉన్న ఆయన ముస్లిం శత్రువుల మీద జరిగాయి. ఇవి రాబోయే రెండు శతాబ్దాల పాటు అధికార సమతుల్యతను క్రైస్తవులకు అనుకూలంగా మార్చాయి. సుమారు 1320లో కైరో కేంద్రంగా ఉన్న మమ్లూకు సుల్తానేటుకు చెందిన సుల్తాను అన్-నాసిరు ముహమ్మదు కాప్టికులను హింసించడం, వారి చర్చిలను నాశనం చేయడం ప్రారంభించాడు. సుల్తాను తన హింసను ఆపకపోతే నైలు నది ప్రవాహాన్ని మళ్లిస్తానని అమ్దా సెయోను బెదిరించాడు. ఇఫాటు సుల్తాను అయిన 1వ హక్ అద్-దిన్, కైరో నుండి తిరిగి వస్తున్న ఒక ఇథియోపియను దూతను పట్టుకుని జైలులో పెట్టాడు. అమ్దా సెయోను ఇఫాతు సల్తనతు మీద దండెత్తి, సుల్తానును చంపి, రాజధానిని దోచుకుని, ముస్లిం భూభాగాలను నాశనం చేశాడు. ఆయన పశువులను తీసుకువెళ్లి, చాలా మంది నివాసులను చంపి, పట్టణాలను మసీదులను ధ్వంసం చేసి, బానిసలను పట్టుకున్నాడు. [33]
ఇఫాతు సుల్తాను తర్వాత సబ్ర 1వ అద్-దిన్ అధికారంలోకి వచ్చాడు. ఆయన ముస్లింలను సమీకరించి ఇథియోపియను ఆక్రమణకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. దీనికి ప్రతిస్పందనగా అమ్దా సెయోను తూర్పున ఉన్న తన ముస్లిం శత్రువుల మీద మరో సైనిక చర్యను ప్రారంభించి, సుల్తానును చంపి, ప్రస్తుత తూర్పు ఇథియోపియాలోని అడలు, దవారో, బాలి వరకు దండయాత్ర చేశాడు. అమ్దా సెయోను విజయాలు ఇథియోపియను సామ్రాజ్యం భూభాగాన్ని గణనీయంగా విస్తరించాయి. దాని పరిమాణాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా చేసి ఆ ప్రాంతం మీద పూర్తి ఆధిపత్యాన్ని స్థాపించాయి. ఈ కాలంలో హార్ను ప్రాంతంలోని ముస్లింలకు ఇథియోపియను సామ్రాజ్యానికి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు కనిపిస్తుంది. నాటి చరిత్రకారుడు తూర్పున, తీరప్రాంతంలో ఉన్న ముస్లింలను "అబద్ధాలకోరులు, హైనాలు, కుక్కలు, క్రీస్తు కుమారుడిని నిరాకరించే దుర్మార్గుల పిల్లలు" అని పేర్కొన్నాడు. [34][35]
సొలొమోనికు పాలన స్వర్ణయుగం
[మార్చు]
అమ్దా సెయోను తూర్పున చేసిన దండయాత్రల తరువాత హార్ను ప్రాంతంలోని చాలా మంది ముస్లింలు ఇథియోపియను సామ్రాజ్యానికి సామంతులుగా మారారు. వారిలో ఇఫాటు సుల్తానేటు కూడా ఒకటి. 1344లో అమ్దా సెయోను తర్వాత ఆయన కుమారుడు నెవాయా క్రెస్టోసు సింహాసనాన్ని అధిష్టించాడు. నెవాయా క్రెస్టోసు అడలు, మోరాలో జరిగిన అనేక ముస్లిం తిరుగుబాట్లను అణచివేశాడు. తన పాలన చివరిలో ఆయన ఈజిప్టు సుల్తాను అయిన అస్-సాలిహు సాలిహు చేత ఖైదు చేయబడిన అలెగ్జాండ్రియా పాట్రియార్కు 4వ మార్కుకు దూకుడుగా సహాయం చేశాడు. నెవాయా క్రెస్టోసు తీసుకున్న ఒక చర్య తన రాజ్యంలో ఉన్న ఈజిప్టు వ్యాపారులను ఖైదు చేసడు. దీనితో సుల్తాను వెనక్కి తగ్గవలసి వచ్చింది.[36]
1382లో నెవాయా క్రెస్టోసు కుమారుడైన నెవాయా మరియం తర్వాత 1వ దావితు ఇథియోపియా చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్టించాడు. సామంతు రాజ్యమైన ఇఫాటు సుల్తానేటు సుల్తాను 2వ సాద్ అద్-దిన్ నాయకత్వంలో ఇథియోపియను ఆధిపత్యాన్ని ప్రతిఘటించడం. తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడం ప్రారంభించింది. సుల్తాను సాద్ అస్-దిన్ అప్పుడు ఇథియోపియను సరిహద్దు ప్రావిన్సుల మీద దాడి చేసి పెద్ద మొత్తంలో దోపిడీ సొమ్మును, బానిసలను పట్టుకున్నాడు. దీని ఫలితంగా చక్రవర్తి 1వ దావితు చుట్టుపక్కల ప్రాంతంలోని ముస్లింలందరినీ "ప్రభువు శత్రువులు"గా ప్రకటించి. ఇఫాటు సుల్తానేటు మీద దండెత్తాడు. సాద్ అద్-దిన్, చక్రవర్తి మధ్య జరిగిన యుద్ధంలో, ఇఫాటు సైన్యం ఓడిపోయింది. "400 మందికి పైగా పెద్దలు, వారిలో ప్రతి ఒక్కరూ తమ పదవి చిహ్నంగా ఇనుప కడ్డీని ధరించినవారు" చంపబడ్డారు. సాద్ అద్-దిన్ తన మిగిలిన మద్దతుదారులతో పాటు సోమాలిలాండు తీరంలోని జైలా వరకు వెంబడించబడ్డాడు. అక్కడ ఇథియోపియను సైన్యం జైలా నగరాన్ని ముట్టడించి, చివరికి నగరాన్ని స్వాధీనం చేసుకుని సుల్తాను సాద్ అద్-దినును చంపింది. దీంతో ఇఫాతు సుల్తానేటు అంతమైంది. సాద్ అద్-దిన్ మరణం తర్వాత "ముస్లింల బలం క్షీణించింది" అని ఈజిప్షియను చరిత్రకారుడు అల్-మక్రిజీ పేర్కొన్నాడు. ఆ తర్వాత అమ్హారా ప్రజలు ముస్లిం భూభాగాలలో స్థిరపడి "ధ్వంసమైన మసీదుల నుండి చర్చిలను నిర్మించారు". ఇస్లాం అనుచరులు ఇరవై సంవత్సరాలకు పైగా వేధింపులకు గురయ్యారని చెప్పబడింది. ఈ విజయం తరువాత ఇథియోపియను శక్తి దాని పరాకాష్టకు చేరుకుంది. ఈ కాలం ఇథియోపియను సామ్రాజ్యానికి శాంతి, స్థిరత్వంతో కూడిన స్వర్ణయుగంగా పురాణ ప్రసిద్ధి చెందింది. [37]
అయితే మిగిలిన వలాష్మా వంశీయులు 1415లో తమ ప్రవాసం నుండి తిరిగి వచ్చి, హరారు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అడాలు సుల్తానేటును స్థాపించారు. అప్పుడు ముస్లింలు తూర్పున క్రైస్తవుల ఆధీనంలో ఉన్న భూభాగాలను వేధించడం ప్రారంభించారు. దీనితో చక్రవర్తి 1వ యెషాకు తన తూర్పు సరిహద్దు భూభాగాలను రక్షించడానికి తన సమయాన్ని ఎక్కువగా కేటాయించవలసి వచ్చింది. ఆయన తన సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి, వారికి గ్రీకు అగ్నిని ఎలా తయారు చేయాలో నేర్పడానికి అనేక మంది ఈజిప్షియను క్రైస్తవ సలహాదారులను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ముస్లింలను నిలువరించడానికి ఈ చర్యలు సరిపోలేదు. చక్రవర్తి యెషాకు 1429లో అడాలైటులతో పోరాడుతూ మరణించాడు. యెషాకు మరణం తరువాత అనేక సంవత్సరాల పాటు వంశపారంపర్య గందరగోళం నెలకొంది. ఈ సమయంలో 5 సంవత్సరాలలో ఐదుగురు చక్రవర్తులు ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చారు. [38] అయితే 1434లో ఇథియోపియాకు చెందిన జారా యాకోబు సింహాసనాన్ని అధిష్టించాడు. [39]
సింహాసనం అధిష్టించిన తన తొలి సంవత్సరాలలో జారా యాకోబు చర్చిలో మిగిలి ఉన్న అన్యమత ఆరాధన, "క్రైస్తవేతర ఆచారాలకు" వ్యతిరేకంగా ఒక బలమైన పోరాటాన్ని ప్రారంభించాడు. ఆయన దేశ పరిపాలనను కేంద్రీకృతం చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాడు. ప్రాంతాలను సామ్రాజ్య నియంత్రణలోకి మరింత కఠినంగా తీసుకువచ్చాడు. ఈజిప్టులోని డెబ్రే మిత్మాకు మఠం కూల్చివేత గురించి విన్న తర్వాత ఆయన జాతీయ సంతాప దినాలను ప్రకటించి టెగులెటులోని టెర్మాబరులో అదే పేరుతో ఒక చర్చిని నిర్మించాడు. [40][41] ఆ తర్వాత ఆయన ఈజిప్టు సుల్తాను సైఫ్ అద్-దిన్ జాక్మాకు వద్దకు దూతలను పంపి ఈజిప్టు కాప్టుల హింసను తీవ్రంగా నిరసించాడు. నైలు నది ప్రవాహాన్ని మళ్లిస్తానని బెదిరించాడు. [42] అప్పుడు సుల్తాను చక్రవర్తి దృష్టిని మళ్లించడానికి అడలు సుల్తానేటును దవారో ప్రావిన్సు మీద దాడి చేయమని ప్రోత్సహించాడు. అయితే ఈ దాడిని చక్రవర్తి తిప్పికొట్టాడు ఆయన గోమిటు యుద్ధంలో అడలైటు సుల్తాను బాడ్లే ఇబ్ను సాద్ అద్-దినును ఓడించి చంపాడు. ఆ తర్వాత ఈజిప్టు సుల్తాను అలెగ్జాండ్రియా పాట్రియార్కును తీవ్రంగా కొట్టించి ఆయనను ఉరితీస్తానని బెదిరించాడు. చంపబడిన సుల్తాను కుమారుడైన కొత్త అడలైటు సుల్తాను ముహమ్మదు ఇబ్ను బాడ్లే, అదే సంవత్సరంలో చక్రవర్తి జారా యాకోబుకు వార్షిక కప్పం చెల్లించడానికి అంగీకరించాడు. యునైటెడు స్టేట్సు: జారా యాకోబు అన్యమత దేవతలను పూజిస్తున్నట్లు అంగీకరించిన వారిని హింసించాడు. వారిలో చాలా మందిని బహిరంగంగా శిరచ్ఛేదం చేశారు. ఆ తర్వాత జారా యాకోబు ఆకాశంలో ఒక అద్భుతమైన కాంతిని చూసి డెబ్రే బెర్హానును స్థాపించాడు. ఇది అన్యమతస్థులను హింసించడాన్ని దేవుడు ఆమోదిస్తున్నాడని సూచించే సంకేతమని నమ్మి, చక్రవర్తి ఆ ప్రదేశంలో ఒక చర్చిని నిర్మించమని ఆదేశించాడు. ఆ తర్వాత సమీపంలో ఒక విశాలమైన రాజభవనాన్ని, సెయింటు సిరియాకసుకు అంకితం చేయబడిన రెండవ చర్చిని నిర్మించాడు.[36][43]
జారా యాకోబు తర్వాత బేడా 1వ మరియం సింహాసనాన్ని అధిష్టించాడు. చక్రవర్తి బేడా మరియం తన తండ్రి భార్యలలో ఒకరైన ఇథియోపియాకు చెందిన ఎలెనికి రాణి తల్లి బిరుదును ఇచ్చాడు. ఆమె రాజకుటుంబంలో సమర్థవంతమైన సభ్యురాలిగా నిరూపించుకుంది; పాల్ బి. హెంజ్ ఆమె ఆయన పాలనలో "ఆచరణాత్మకంగా సహ-పాలకురాలిగా" ఉందని వ్యాఖ్యానించారు. 1478లో బేడా మరియం మరణానంతరం ఆయన 7 ఏళ్ల కుమారుడు ఎస్కెందరు సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయనకు ఎలెని సంరక్షకురాలిగా వ్యవహరించింది. ఆమె అడలు సుల్తాను ముహమ్మదు ఇబ్ను అజహరు అద్-దిన్తో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించింది. కానీ హరారు ఎమిరు అయిన మహఫూజు ఇథియోపియా భూభాగంలోకి దాడులు చేయకుండా నిరోధించలేకపోయింది. ఎస్కెందరు యుక్తవయస్సుకు వచ్చినప్పుడు ఆయన అడలు మీద దండెత్తి దాని రాజధాని డక్కరును దోచుకున్నాడు. కానీ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ఆకస్మిక దాడిలో ఓడిపోయాడు. అయినప్పటికీ ఆయన తప్పించుకోగలిగాడు. 1517లో మహఫూజు ఇథియోపియాలోని ఫటాగరు ప్రావిన్సు మీద దండెత్తాడు.[44] కానీ చక్రవర్తి 2వ దావితు (లెబ్నా డెంగెలు) సైనికుడి చేతిలో ఒక ద్వంద్వ యుద్ధంలో చంపబడ్డాడు. ఆయన చరిత్రలు ముస్లింల ముప్పు ముగిసిందని చక్రవర్తి ఒక వీరుడిగా ఉన్నత ప్రాంతాలకు తిరిగి వచ్చాడని పేర్కొన్నాయి. [45]
అహ్మదు గ్రాగ్ను దండయాత్ర
[మార్చు]
1527లో సంవత్సరాల అంతర్గత కలహాల తర్వాత అహ్మదు ఇబ్ను ఇబ్రహీం అల్-ఘాజీ అనే యువ ఇమాం అడలులో అధికారంలోకి వచ్చాడు. అడలు సుల్తానేటు అరేబియా, ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి దిగుమతి చేసుకున్న తుపాకులు, ఫిరంగులు, ఇతర అధునాతన ఆయుధాలను నిల్వ చేసి, 1529లో ఇథియోపియా మీద దండెత్తి, చక్రవర్తి 2వ దావితుకి తీవ్ర పరాజయాన్ని కలిగించాడు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన సామ్రాజ్యం మీద పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించడానికి తిరిగి వచ్చాడు. చర్చిలను తగులబెట్టాడు, క్రైస్తవులను బలవంతంగా మతమార్పిడి చేశాడు, నివాసులను ఊచకోత కోశాడు. చరిత్రకారుల ప్రకారం ఆయన వెళ్ళిన ప్రతిచోటా ఆయన సైనికులు "తమకు కనిపించిన ప్రతి వయోజన క్రైస్తవుడిని చంపి, యువకులను, యువతులను బందీలుగా పట్టుకుని బానిసలుగా అమ్మేవారు." 1530ల మధ్య నాటికి ఇథియోపియాలో ఎక్కువ భాగం అడలైటు ఆక్రమణలో ఉంది. లెబ్నా డెంగెలు ఒక పర్వత కోట నుండి మరొక పర్వత కోటకు పారిపోతూ చివరికి డెబ్రే డామోలో సహజ కారణాలతో మరణించాడు.[46][47]
చక్రవర్తి తర్వాత ఆయన 18 ఏళ్ల కుమారుడు గెలావ్డెవోసు సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ ముస్లిం దండయాత్రను ప్రతిఘటించడానికి తన సైనికులను, ప్రజలను సమీకరించాడు. 1540 నాటికి గెలావ్డెవోసు సుమారు 70 మందితో కూడిన ఒక చిన్న సైన్యానికి నాయకత్వం వహిస్తూ షెవా పర్వత ప్రాంతాలలో ప్రతిఘటిస్తున్నాడు. అయితే 1541లో నాలుగు వందల మంది సుశిక్షిత పోర్చుగీసు మస్కటీర్లు మస్సావాకు చేరుకున్నారు. అక్కడ వారికి ఇథియోపియను యోధుల చిన్న బృందాలు తోడయ్యాయి. ఈ చిన్న సైన్యం టిగ్రే ప్రావిన్సు గుండా ముందుకు సాగి అక్కడ అడలైటు సైనికుల చాలా పెద్ద దళాలను ఓడించింది. పోర్చుగీసు వారి విజయాలతో ఆందోళన చెందిన గ్రాన్, ఒట్టోమను సామ్రాజ్యానికి ఒక వినతిపత్రం పంపి తుపాకులతో సన్నద్ధమైన 2,900 మంది సైనికులను అదనపు బలగంగా పొందాడు. తన టర్కిషు మిత్రులతో కలిసి గ్రాన్ వోఫ్లా వద్ద ఉన్న పోర్చుగీసు శిబిరం మీద దాడి చేసి వారి కమాండరు క్రిస్టోవో డా గామాతో సహా 200 మంది సైనికులను చంపాడు.[48]
వోఫ్లా వద్ద జరిగిన విపత్తు తర్వాత ప్రాణాలతో బయటపడిన పోర్చుగీసు సైనికులు సెమియను పర్వతాలలో గెలావ్డెవోసు, ఆయన సైన్యాన్ని కలుసుకోగలిగారు. చక్రవర్తి దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించలేదు. వైనా డాగా యుద్ధంలో ఒక గొప్ప విజయాన్ని సాధించాడు. ఈ యుద్ధంలో ఇమాం మరణం, ఆయన సైన్యం పలాయనం చిత్తగించడంతో అబిస్సినియా భవిష్యత్తు నిర్ణయించబడింది. దండయాత్ర సైన్యం కుప్పకూలింది. ఆక్రమణదారులచే భయభ్రాంతులకు గురైన అబిస్సినియన్లందరూ తమ పూర్వ విధేయతకు తిరిగి వచ్చారు. క్రైస్తవ భూభాగాల పునరాక్రమణ ఎటువంటి సమర్థవంతమైన ప్రతిఘటనను ఎదుర్కోకుండానే కొనసాగింది.[49]1559లో గెలావుదేవోసు అడలు సుల్తానేటు ఫటాగరు యుద్ధం వద్ద దండయాత్ర చేసిన దళాలచే చంపబడ్డాడు. ఆయన తెగిపడిన తలను అడాలు రాజధాని హరరులో ఊరేగించారు. [50] అదలు సుల్తానేటు రాజధానిలో హమ్లామలు ఉల్లంఘించబడింది. హరరు అడాలైటు సుల్తాను బరాకతు ఇబ్ను ఉమరు దిన్ని చంపాడు. వాలాస్మా రాజవంశంలో చివరిగా తెలిసిన సభ్యుడు ఉరితీయబడ్డాడు. [51][52]
ప్రారంభ ఆధునిక కాలం
[మార్చు]
ఒట్టోమన్ సామ్రాజ్యం 1557 నుండి ఇథియోపియాలోని కొన్ని భాగాలను ఆక్రమించింది. సామ్రాజ్యం ప్రధాన నౌకాశ్రయమైన మస్సావాను జయించడం ద్వారా హబేషు ఇయాలెటు, అబిస్సినియా ప్రావిన్సును స్థాపించింది. ఇప్పుడు సౌడానులో ఉన్న దాని నుండి సువాకినుని స్వాధీనం చేసుకుంది. 1573లో అదలు సుల్తానేటు మళ్లీ ఇథియోపియా మీద దండెత్తడానికి ప్రయత్నించాడు; అయితే, సర్సా డెంగెలు వెబి నది యుద్ధంలో ఇథియోపియా సరిహద్దును విజయవంతంగా రక్షించుకున్నాడు. అక్కడ ఆయన అడలైటు సుల్తాను ముహమ్మదు ఇబ్ను నాసిరును, అడలైటు ఉన్నత వర్గాల వారితో పాటు ఓడించి, బంధించి, ఉరితీశాడు.[53] ఇది ఒక సైనిక శక్తిగా అడలు పతనానికి నాంది పలికింది.[54]
1589లో చక్రవర్తి సర్సా డెంగెలు సాధించిన విజయం, అర్కికోను దోచుకోవడం ద్వారా ఒట్టోమన్లు అడ్డుకోబడ్డారు. తద్వారా వారు ఒక ఇరుకైన తీరప్రాంతానికి పరిమితమయ్యారు. అఫారు సుల్తానేటు ఎర్ర సముద్రం మీద మిగిలి ఉన్న ఇథియోపియా ఓడరేవును బేలులు వద్ద నిర్వహించింది.[55] అదే కాలంలో ఒరోమో వలసలు జరిగాయి. సామ్రాజ్యం ఆగ్నేయ ప్రావిన్సుల నుండి పెద్ద సంఖ్యలో పశుపోషణ చేసే జనాభా తరలివచ్చింది. గామో ప్రాంతానికి చెందిన సన్యాసి అబ్బా బహ్రే సమకాలీన వృత్తాంతాన్ని నమోదు చేశాడు. తదనంతరం సామ్రాజ్య వ్యవస్థ క్రమంగా మారింది. సుదూర ప్రావిన్సులు మరింత స్వాతంత్ర్యం పొందాయి. బేలు వంటి మారుమూల ప్రావిన్సు యాకోబు పాలనలో (1590-1607) సామ్రాజ్య సింహాసనానికి నివాళులు అర్పించినట్లు చివరిగా రికార్డు చేయబడింది. [56]
1636లో చక్రవర్తి ఫాసిలిడెసు గోందరైను శాశ్వత రాజధానిగా స్థాపించాడు. అది అత్యంత స్థిరమైన, సంపన్న వాణిజ్య కేంద్రంగా మారింది. ఈ కాలంలో ఇథియోపియను కళ, వాస్తుశిల్పంలో అద్భుతమైన విజయాలు సాధించబడ్డాయి, ఫాసిలు గెబ్బి అనే రాజ సముదాయం నిర్మాణం, అలాగే టానా సరస్సు చుట్టూ స్థాపించబడిన 44 చర్చిల వంటి ఆవిష్కరణలు జరిగాయి. కళల విషయానికొస్తే, గోందరైను కాలంలో ఎక్కువగా మతపరమైన ఇతివృత్తాలతో కూడిన డిప్టిచులు, ట్రిప్టిచులు, కుడ్యచిత్రాలు, ప్రకాశవంతమైన చేతివ్రాత ప్రతులు సృష్టించబడ్డాయి. ఇయాసు ది గ్రేటు (1682-1706) పాలన ఏకీకరణకు ఒక ప్రధాన కాలం. ఈ కాలంలోనే ఫ్రాన్సుకు చెందిన 14 లూయిసు డచు ఇండియాకు రాయబార కార్యాలయాలు పంపబడ్డాయి. తొలి ఆధునిక కాలం తీవ్రమైన సాంస్కృతిక, కళాత్మక సృష్టికి సంబంధించినది. ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ తత్వవేత్తలు జెరా యాకోబు, వాల్డా హెయ్వాటు. 1వ ఇయాసు మరణానంతరం సామ్రాజ్యం రాజకీయ గందరగోళంలోకి కూరుకుపోయింది. 1769 నుండి 1855 వరకు ఇథియోపియను సామ్రాజ్యం 'రాకుమారుల యుగం' (అమ్హారికులో: జెమెనె మెసాఫింటు) అని పిలువబడే కాలాన్ని గడిపింది. ఇది ఇథియోపియను చరిత్రలో ఒక కాలం. ఈ సమయంలో వివిధ రాసుల (ఇంగ్లీషు డ్యూకులకు సమానం), చక్రవర్తి మధ్య అనేక సంఘర్షణలు జరిగాయి. చక్రవర్తికి పరిమిత అధికారం మాత్రమే ఉండేది. సమకాలీన రాజధాని అయిన గోందరు చుట్టుపక్కల ప్రాంతం మీద మాత్రమే ఆధిపత్యం ఉండేది. ఈ కాలంలో సమాజం సంస్కృతి అభివృద్ధి స్తంభించిపోయింది. ఇథియోపియను ఆర్థోడాక్సు చర్చిలోపల, వారికి, ముస్లింలకు మధ్య జరిగిన మతపరమైన సంఘర్షణలు తరచుగా పరస్పర కలహాలకు ఒక సాకుగా ఉపయోగించబడ్డాయి. 2వ టెవోడ్రోసు చక్రవర్తి పాలనతో రాకుమారుల యుగం ముగిసింది.
ఆధునిక యుగం
[మార్చు]
1868లో పలువురు మిషనరీలను, బ్రిటిషు ప్రభుత్వ ప్రతినిధులను ఖైదు చేసిన తరువాత బ్రిటిషు వారు చక్రవర్తి టెవోడ్రోసుకు వ్యతిరేకంగా శిక్షాత్మకమైన అబిస్సినియా దండయాత్ర చేపట్టారు. ఇథియోపియాలోని చాలా మంది ప్రభువుల మద్దతుతో ఈ దండయాత్ర బ్రిటనుకు విజయవంతమైంది. ఇథియోపియను చక్రవర్తి లొంగిపోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. 1860వ దశకం నుండి 2వ మెనెలికు పాలనలో సామ్రాజ్య సైన్యాలు షెవా అనే కేంద్ర ప్రావిన్సు నుండి బయలుదేరి తమ రాజ్యానికి పశ్చిమం, తూర్పు, దక్షిణాన ఉన్న జనావాస ప్రాంతాలను జయించి తమలో కలుపుకున్నాయి.[57] విలీనం చేయబడిన భూభాగాలలో పశ్చిమ ఒరోమో (షోవా యేతర ఒరోమో), సిదామా, గురాగే, వోలాయ్తా ప్రాంతాలు ఉన్నాయి. [58] డిజి.[59] సామ్రాజ్య సైన్యాలలో రాసు గోబెనాకు చెందిన షెవాను ఒరోమో మిలీషియా కూడా ఉంది. వారు స్వాధీనం చేసుకున్న చాలా భూభాగాలు ఇంతకు ముందు ఎప్పుడూ సామ్రాజ్య పాలనలో లేవు. కొత్తగా విలీనం చేయబడిన ఈ భూభాగాల ఫలితంగానే ఆధునిక ఇథియోపియా సరిహద్దులు ఏర్పడ్డాయి. [60]
1874 నుండి 1876 వరకు సామ్రాజ్యం టెంబియను రాజు 4వ జాన్ 4వ ఆధ్వర్యంలో ఎరిట్రియాలోకి తిరిగి విస్తరించింది. ఆయన దళాలు రాసు అలులా నేతృత్వంలోని ఇథియోపియను-ఈజిప్షియను యుద్ధంలో గెలిచాయి. హమాసియనులోని గుండెటు యుద్ధంలో ఈజిప్షియను దళాలను నిర్ణయాత్మకంగా ఓడించాయి. 1887లో మెనెలికు. షేవా రాజు, చెలెంకో యుద్ధం [61] మెనెలికు 18' జనరలు గనా దచ్చే హదియా నాయకుడిని హస్సను ఎంజమో ఓడించి హదియా భూభాగాన్ని కూడా ఓడించారు. [62]
1880లు ఆఫ్రికాలో వలసవాద ఉనికిని కోరుతూ ఆఫ్రికా కోసం పెనుగులాట ద్వారా గుర్తించబడ్డాయి. బ్రిటను ఎరిట్రియాను ప్రదానం చేసింది. ఇది ఇటలో-ఇథియోపియను 1887–1889 యుద్ధానికి, టెంబియను రాజు 4వ యోహన్నెసు ఇటలీ మధ్య ఎరిట్రియా తీర ప్రాంతాల కోసం పోరాటానికి దారితీసింది. చక్రవర్తి 4వ జాన్ మరణం తరువాత ఇటలీ షెవా (సామ్రాజ్యంలో స్వయంప్రతిపత్తి రాజ్యం)తో వుచాలే ఒప్పందం మీద సంతకం చేసి అబిస్సినియా రక్షిత ప్రాంతాన్ని సృష్టించింది.
ఈ ఒప్పందం ఇటాలియను, అమ్హారికు అనువాదాల మధ్య గణనీయమైన తేడాలు ఉన్నందున ఇటలీ ఇథియోపియాను ఒక రక్షిత ప్రాంతంగా స్వీకరించిందని నమ్మింది. అయితే షెవాకు చెందిన 2వ మెనెలికు 1896లో అద్వా యుద్ధంలో రక్షిత ప్రాంతం హోదాను తిరస్కరించాడు. దీనిలో ఇటలీ సంఖ్యాపరంగా ఉన్నతమైన ఇథియోపియన్లచే నిర్ణయాత్మకంగా ఓడిపోయింది. ఫలితంగా అక్టోబరులో అడిసు అబాబా ఒప్పందం మీద సంతకం చేయబడింది. ఇది ఎరిట్రియా సరిహద్దులను ఖచ్చితంగా నిర్వచించింది. ఇటలీ ఇథియోపియా స్వాతంత్ర్యాన్ని గుర్తించవలసి వచ్చింది. యునైటెడు కింగ్డం ఫ్రాన్సు నుండి ప్రతినిధులు త్వరలో ఈ కొత్తగా నిరూపితమైన శక్తితో తమ స్వంత ఒప్పందాలను చర్చించడానికి ఇథియోపియా రాజధానికి చేరుకున్నారు.
ఇథియోపియా 20వ శతాబ్దంలోకి ప్రవేశించినప్పుడు, సామ్రాజ్య ప్రభువులు ఒంటరితనాన్ని స్వీకరించారు. ఏ విధమైన ఆధునికీకరణను ప్రతిఘటించారు. వారిలో హెర్బర్టు వివియను కూడా ఉన్నారు. 1899లో ఆయన సామ్రాజ్యాన్ని సింహాలు, ఏనుగులు, మొసళ్ళు వంటి అడవి జంతువులకు నిలయంగా, కారవాను ట్రాకుల కంటే కొంచెం ఎక్కువగా ఉన్న రోడ్లుగా అభివర్ణించారు. "అబిస్సినియా నాగరిక దేశం అయినప్పటికీ బాధించే నిబంధనలు" ఉన్నాయి. [63]వైద్యులు మాత్రమే విదేశీయులలో అంగీకరించబడ్డారు . [64]
మహారాణి జెవ్డిటు పాలనలో రాస్ తఫారి నాయకత్వంలోని సామ్రాజ్య ఉన్నత వర్గంలోని ఆధునికీకరణ వర్గం, సంప్రదాయవాద వర్గాన్ని సవాలు చేయడం ప్రారంభించింది. గుగ్సా వాలే తిరుగుబాటు తర్వాత, సంప్రదాయవాద వర్గం ఓడిపోయింది. 1930 నవంబరు 2న హైలే సెలాసీ ఇథియోపియా చక్రవర్తిగా పట్టాభిషేకం చేయబడ్డారు. ఒక సంవత్సరం తర్వాత 1931 జూలై 16న సెలాసీ ఇథియోపియా మొదటి లిఖిత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. [65] ఇది ద్విసభ శాసనసభకు వీలు కల్పించింది. [66] ఈ రాజ్యాంగం అధికారాన్ని ఉన్నత వర్గాల చేతిలోనే ఉంచింది. కానీ అది ఉన్నత వర్గాలలో ప్రజాస్వామ్య ప్రమాణాలను నెలకొల్పింది. ప్రజాస్వామ్య పాలనకు పరివర్తనను ఊహించింది: "ప్రజలు తమను తాము ఎన్నుకోగలిగే స్థితికి వచ్చే వరకు" ఇది అమలులో ఉంటుంది.[66]
ఇటాలియను దండయాత్ర - రెండవ ప్రపంచ యుద్ధం
[మార్చు]
1935లో మార్షలు ఎమిలియో డి బోనో ఆధ్వర్యంలోని ఇటాలియను సైనికులు రెండవ ఇటలో-ఇథియోపియను యుద్ధంగా పిలువబడే యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ సంఘర్షణ సమయంలో ఇథియోపియను, ఇటాలియను దళాలు రెండూ యుద్ధ నేరాలకు పాల్పడ్డాయి. ఇథియోపియను దళాలు హేగు కన్వెన్షనులను ఉల్లంఘిస్తూ డమ్-డమ్ బుల్లెట్లను ఉపయోగించాయని పట్టుబడిన సైనికులను వికృతంగా హింసించాయని (తరచుగా వంధ్యత్వం కలిగించడం ద్వారా) తెలిసింది. [67] ఇటాలియను దళాలు ఏడు సంవత్సరాల ముందు తాము సంతకం చేసిన జెనీవా ప్రోటోకాలును విస్మరించి, రసాయన యుద్ధంలో సల్ఫరు మస్టర్డును ఉపయోగించాయి. ఇటాలియను సైన్యం బాంబుల ద్వారా మస్టర్డు గ్యాసును జారవిడిచింది. విమానాల నుండి పిచికారీ చేసింది. పొడి రూపంలో నేల మీద చల్లింది. ఎక్కువగా మస్టర్డు గ్యాసు వల్ల 150,000 మంది రసాయన దాడి బాధితులు అయినట్లు నివేదించబడింది.
1936 మే 1న హైలే సెలాసీ రైలులో జిబౌటికి వెళ్లి, ఆ తర్వాత ఒక బ్రిటిషు నౌకలో జెరూసలేంకు బయలుదేరారు.[68] ఆ నగరంలో తన సమయాన్ని ఎక్కువగా ఇథియోపియను సన్యాసులతో గడుపుతూ చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చరులో వారితో కలిసి ప్రార్థనలు చేశారు. [69][70] ఆ తర్వాత ఆయన బాత్లోని ఫెయిరుఫీల్డు హౌసుకు పారిపోయాడు. అక్కడ బ్రిటిషు అధికారులు ఆయనకు ఆశ్రయం కల్పించారు. ఆయన లండనులో ఉండటం "రాజకీయంగా ఇబ్బందికరంగా" భావించబడటంతో వారు ఆయనను అక్కడ ఉండనివ్వలేదు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన ఒక హోటలులో బస చేసి కొద్దికాలానికే ఫెయిరుఫీల్డు హౌసును కొనుగోలు చేసి తన మిగిలిన కాలాన్ని అక్కడే గడిపాడు. [71] ఆయనతో పాటు ఆయన పిల్లలు, మనవళ్లు, సేవకులు, ఇతరులు ఉన్నారు. బాత్లో ఆర్థికంగా పరిమితులు ఉండటంతో హైలే సెలాసీ "సేవకుల సైన్యం" లేకుండా ఒకే ఇంట్లో నివసించడానికి అలవాటు పడ్డాడు. ఆయన ఒకటి రెండు సందర్భాలలో ఆభరణాలను అమ్ముకుంటూ కనిపించాడు. ఇంగ్లాండు విడిచి వెళ్ళేటప్పుడు ఆయన ఆ ఇంటిని వృద్ధుల కోసం వదిలిపెట్టాడు. 1954 వరకు మళ్ళీ దానిని సందర్శించలేదు.
ఈ యుద్ధం ఏడు నెలల పాటు కొనసాగింది. ఈ సమయంలో 1936 మే 5న అడిసు అబాబా ఆక్రమించబడింది. ఆ తర్వాత 1936 మే 9న ఇటలీ విజయం ప్రకటించబడింది. ఇటలీ తూర్పు ఆఫ్రికాలో ఇటాలియన్ సామ్రాజ్యం స్థాపనను ప్రకటించింది. విక్టరు 3వ ఇమ్మాన్యుయేలు ఇథియోపియా చక్రవర్తిగా నియమితులయ్యారు. ఇథియోపియాను తూర్పు ఆఫ్రికాలోని ఇతర ఇటాలియను కాలనీలతో కలిపి జూన్ 1న కొత్త ఇటాలియను తూర్పు ఆఫ్రికా కాలనీగా ఏర్పాటు చేశారు. ఈ దండయాత్రను నానాజాతి సమితి ఖండించింది. అయినప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి పెద్దగా ఏమీ చేయలేదు.
1936 జూన్ 30న ఇథియోపియాను ఇటాలియను సామ్రాజ్యంలో భాగంగా అధికారికంగా గుర్తించవద్దని నానాజాతి సమితిని వేడుకోవడానికి సెలాసీ మరోసారి జెనీవాకు ప్రయాణించారు. ఇటలీతో పోరాడుతున్న ఇథియోపియను సైన్యం గురించిన వార్తలను నివేదించడానికి ఇథియోపియాకు ప్రయాణించిన యూరోపియను మిత్రులు కూడా ఆయనకు ఉన్నారు. ఇది ఇథియోపియాలో బ్రిటను తర్వాతి ప్రవేశానికి సహాయపడింది.[72][73][74]
1940 జూన్ 10 న ఇటలీ యునైటెడు కింగ్డం ఫ్రాన్సు మీద యుద్ధం ప్రకటించింది. ఎందుకంటే ఆ సమయంలో ఫ్రాన్సు జర్మనీ దళాలచే ఆక్రమించబడుతోంది. బెనిటో ముస్సోలినీ ఇటలీ వలస భూభాగాలను విస్తరించాలని కోరుకున్నాడు. 1940 ఆగస్టులో బ్రిటిషు సోమాలిలాండు మీద ఇటలీ ఆక్రమణ విజయవంతమైంది. కానీ ఆ తర్వాత యుద్ధం ఇటలీకి వ్యతిరేకంగా మారింది. బ్రిటీషు వారు హైలే సెలాసీతో పాటు సూడానుకు వెళ్లి, ఏడు నెలలలోపు తన సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించడంలో ఆయనకు సహాయపడ్డారు.[75] చివరకు 1941 జనవరిలో ఒక సైనిక పోరాటాన్ని ప్రారంభించారు. ఇది అదే సంవత్సరం మే 5వ తేదీన ఆయనను తిరిగి సింహాసనం మీదకు చేర్చింది.[72][76][77]
యుద్ధానంతర ఇథియోపియా
[మార్చు]
1942 ఆగస్టు 27న హైలే సెలాసీ సామ్రాజ్యం అంతటా బానిసత్వానికి చట్టపరమైన ఆధారాన్ని రద్దు చేశారు. బానిస వ్యాపారానికి మరణశిక్షతో సహా కఠినమైన శిక్షలను విధించారు.[78] రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఇథియోపియా ఐక్యరాజ్యసమితిలో వ్యవస్థాపక సభ్య దేశంగా మారింది. 1948లో సోమాలియాతో వివాదాస్పదంగా ఉన్న ఒగాడెను ప్రాంతాన్ని ఇథియోపియాకు అప్పగించారు.[79] 1950 డిసెంబరు 2న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీర్మానం 390 (V)ని ఆమోదించి ఎరిట్రియా (గతంలో ఇటాలియనూ కాలనీ)ను ఇథియోపియాలో విలీనం చేసి సమాఖ్యగా ఏర్పాటు చేసింది.[80] ఎరిట్రియాకు దాని స్వంత రాజ్యాంగం ఉండాలి. అది జాతి, భాషా, సాంస్కృతిక సమతుల్యతను అందిస్తుంది. అయితే ఇథియోపియా దాని ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాలను నిర్వహించాలి.[80]
రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు తాను చేసిన కేంద్రీకరణ విధానాలు ఉన్నప్పటికీ హైలే సెలాసీ తాను కోరుకున్న అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. 1942లో ఆయన ఒక ప్రగతిశీల పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఉన్నత వర్గాల వ్యతిరేకత కారణంగా ఇది విఫలమైంది. కేవలం ఒకే విధమైన పన్ను మాత్రమే ఆమోదించబడింది; 1951లో ఆయన దీనిని కూడా తగ్గించడానికి అంగీకరించాడు.[81] ఇథియోపియా అప్పటికీ "పాక్షిక-భూస్వామ్య" దేశంగానే ఉంది.[82] దాని పన్నుల విధానాలను సంస్కరించడం ద్వారా దాని సామాజిక, ఆర్థిక స్వరూపాన్ని మార్చడానికి చక్రవర్తి చేసిన ప్రయత్నాలకు, యుద్ధానంతర కాలంలో తమ విశేషాధికారాలను తిరిగి పొందాలని ఆత్రుతగా ఉన్న ఉన్నత వర్గం, మతాధికారుల నుండి ప్రతిఘటన ఎదురైంది.[81] హైలే సెలాసీ కొత్త భూ పన్నులను అమలు చేయడంలో ఎక్కడైతే నిజంగా విజయం సాధించాడో అక్కడ ఆ భారాన్ని భూ యజమానులు తరచుగా రైతులపైకి బదిలీ చేశారు.[81] ఆయన కోరికలకు విరుద్ధంగా, పన్ను భారం ప్రధానంగా రైతులపైనే మిగిలిపోయింది.
1941, 1959 మధ్య, హైలే సెలాసీ ఇథియోపియను ఆర్థోడాక్సు చర్చి స్వయంప్రతిపత్తిని స్థాపించడానికి కృషి చేశాడు.[83] ఇథియోపియను ఆర్థోడాక్సు చర్చికి ఈజిప్టులోని పాట్రియార్కేటుకు జవాబుదారీగా ఉండే ఒక బిషపు అయిన అబునా అధిపతిగా ఉండేవారు. ఇథియోపియను బిషపుల స్వాతంత్ర్యాన్ని స్థాపించడానికి హైలే సెలాసీ 1942, 1945లో ఈజిప్టు పవిత్ర సైనాడుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన విజ్ఞప్తులు తిరస్కరించబడినప్పుడు ఆయన సెయింటు మార్కు పీఠంతో సంబంధాలను తెంచుకుంటానని బెదిరించాడు.[83] చివరగా 1959లో పోపు సిరిలు అబునాను పాట్రియార్కు-కాథోలికోసుగా ఉన్నత స్థాయికి పెంచారు.[83] ఇథియోపియను చర్చి అలెగ్జాండ్రియా చర్చికి అనుబంధంగానే ఉంది.[81] ఈ ప్రయత్నాలతో పాటు, హైలే సెలాసీ చర్చి భూముల మీద పన్ను విధించడం ద్వారా గతంలో పౌర నేరాలకు తమ సొంత కోర్టులలో విచారించబడిన మతాధికారుల చట్టపరమైన విశేషాధికారాలను పరిమితం చేయడం ద్వారా ఇథియోపియను చర్చి-రాజ్య సంబంధాన్ని మార్చాడు.[81][84]
1955 నవంబరులో తన రజతోత్సవ వేడుకల సందర్భంగా హైలే సెలాసీ ఒక సవరించిన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. [85]దీని ద్వారా ఆయన సమర్థవంతమైన అధికారాన్ని తన వద్దే ఉంచుకుంటూ పార్లమెంటు దిగువ సభను ఎన్నికైన సంస్థగా మార్చడం ద్వారా ప్రజలకు రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించారు. పార్టీ రాజకీయాలకు ఇందులో చోటు కల్పించలేదు. ఆధునిక విద్యా పద్ధతులు సామ్రాజ్యం అంతటా మరింత విస్తృతంగా వ్యాపించాయి. దేశం ఇథియోపియను సంప్రదాయాలకు అనుగుణంగా, పురాతన రాచరిక ప్రభుత్వ వ్యవస్థ చట్రంలోనే అభివృద్ధి పథకం, ఆధునీకరణ ప్రణాళికలను చేపట్టింది. హైలే సెలాసీ ఆచరణాత్మకంగా ఉన్నప్పుడు ఉన్నత వర్గాలలో, చర్చిలోని సంప్రదాయవాదులతో రాజీపడ్డారు. ఆయన ప్రభుత్వం, జాతి సమూహాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి కూడా ప్రయత్నించారు. నియంత్రించడం కష్టంగా ఉన్న అఫారు భూభాగాలకు స్వయంప్రతిపత్తిని మంజూరు చేశారు. అయినప్పటికీ భూస్వామ్య వ్యవస్థను అంతం చేయడానికి ఆయన చేసిన సంస్కరణలు నెమ్మదిగా సాగాయి. పాతుకుపోయిన ఉన్నత వర్గాలతో ఆయన చేసుకున్న రాజీల వల్ల బలహీనపడ్డాయి. 1955 నాటి సవరించిన రాజ్యాంగం "చక్రవర్తి తిరుగులేని అధికారాన్ని" పునరుద్ఘాటించిందని, రైతుల సాపేక్ష నిస్సహాయతను కొనసాగించిందని విమర్శించబడింది. [86]
1960 డిసెంబరు 13న హైలే సెలాసీ బ్రెజిలులో అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఇంపీరియలు గార్డు దళాలు ఒక విఫలమైన తిరుగుబాటుకు పాల్పడి, హైలే సెలాసీ పెద్ద కుమారుడు అస్ఫా వోస్సెనును కొద్దిసేపు చక్రవర్తిగా ప్రకటించాయి. ఈ తిరుగుబాటును సాధారణ సైన్యం, పోలీసు బలగాలు అణచివేశాయి. ఈ తిరుగుబాటు ప్రయత్నానికి విస్తృత ప్రజా మద్దతు లభించలేదు. దీనిని ఇథియోపియను ఆర్థోడాక్సు చర్చి ఖండించింది. ఇది సైన్యం, వైమానిక దళం, పోలీసులలో కూడా ప్రజాదరణ పొందలేదు. అయినప్పటికీ చక్రవర్తిని పదవీచ్యుతుడిని చేసే ఈ ప్రయత్నానికి విద్యార్థులు, విద్యావంతుల వర్గాలలో మద్దతు లభించింది. [87] ఈ తిరుగుబాటు ప్రయత్నం ఇథియోపియా చరిత్రలో ఒక కీలక ఘట్టంగా వర్ణించబడింది. ఈ సమయంలోనే ఇథియోపియన్లు "మొదటిసారిగా ప్రజల సమ్మతి లేకుండా పరిపాలించే రాజు అధికారాన్ని ప్రశ్నించారు". [88]విద్యార్థి వర్గాలు రైతులు, పేదల పట్ల సానుభూతి చూపడం ప్రారంభించాయి. వారి తరపున వాదించడం మొదలుపెట్టాయి.[88] ఈ తిరుగుబాటు హైలే సెలాసీని సంస్కరణలను వేగవంతం చేయడానికి పురికొల్పింది. ఇది సైనిక, పోలీసు అధికారులకు భూమి మంజూరు రూపంలో వ్యక్తమైంది.
ఆఫ్రికాలో చాలా భాగం ఇంకా యూరోపియను వలస పాలనలో ఉన్నప్పటికీ, చక్రవర్తి పశ్చిమ దేశాలకు గట్టి మిత్రుడిగా కొనసాగుతూనే ఆఫ్రికాలో వలసవాద నిర్మూలనకు సంబంధించి ఒక దృఢమైన విధానాన్ని అనుసరించారు. ఐక్యరాజ్యసమితి ఎరిట్రియా హోదాకు సంబంధించి సుదీర్ఘ విచారణ జరిపింది. అగ్రరాజ్యాలు ప్రతి ఒక్కటి ఆ రాజ్య భవిష్యత్తులో తమ వాటా కోసం పోటీపడ్డాయి. ఆ సమయంలో నిర్వాహకురాలిగా ఉన్న బ్రిటను, క్రైస్తవులను, ముస్లింలను వేరుచేస్తూ ఎరిట్రియాను సుడాను, ఇథియోపియా మధ్య విభజించాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి ప్రజాభిప్రాయ సేకరణలో ఎరిట్రియాను ఇథియోపియాతో సమాఖ్యగా కలపడానికి 46కి 10 ఓట్ల తేడాతో నిర్ణయం తీసుకున్నారు. ఇది తరువాత 1950 డిసెంబరు 2న తీర్మానం 390 (V)లో నిర్దేశించబడింది. ఎరిట్రియాకు దాని స్వంత పార్లమెంటు, పరిపాలన ఉంటుంది. అది గతంలో ఇథియోపియను పార్లమెంటుగా ఉండి ఆ తర్వాత సమాఖ్య పార్లమెంటుగా మారిన దానిలో ప్రాతినిధ్యం వహిస్తుంది.[89] అయితే ఎరిట్రియాను పరిపాలించడానికి ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించడానికి యూరోపియన్లు చేసిన ప్రయత్నాలను హైలే సెలాసీ అంగీకరించలేదు. తన సొంత 1955 రాజ్యాంగం ఇథియోపియా, ఎరిట్రియా రెండింటిలోనూ వర్తించాలని కోరుకున్నారు. 1961లో స్వాతంత్ర్య భావాలు గల ఎరిట్రియన్లకు, ఇథియోపియను దళాలకు మధ్య ఉద్రిక్తతలు ఎరిట్రియను స్వాతంత్ర్య యుద్ధంకు దారితీశాయి. 1962లో చక్రవర్తి ఎరిట్రియాను ఇథియోపియా పద్నాలుగో ప్రావిన్సుగా ప్రకటించారు.[90]
1963లో హైలే సెలాసీ ఖండవ్యాప్త ఆఫ్రికను యూనియను (AU)కి పూర్వగామి అయిన ఆఫ్రికను యూనిటీ ఆర్గనైజేషను (OAU) ఏర్పాటుకు అధ్యక్షత వహించారు. ఈ కొత్త సంస్థ తన ప్రధాన కార్యాలయాన్ని అడిసు అబాబాలో స్థాపించింది. అదే సంవత్సరం మే నెలలో, హైలే సెలాసీ ఒఎయు మొదటి అధికారిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది ఒక రొటేటింగు పదవి. మాలికి చెందిన మోడిబో కీటాతో కలిసి. ఈ ఇథియోపియను నాయకుడు మొరాకో, అల్జీరియా మధ్య సరిహద్దు వివాదాన్ని ముగించిన బమాకో ఒప్పందాల మీద విజయవంతంగా చర్చలు జరపడంలో సహాయపడ్డారు. 1964లో హైలే సెలాసీ యునైటెడు స్టేట్సు ఆఫ్ ఆఫ్రికా అనే భావనను ప్రారంభించారు. ఈ ప్రతిపాదనను తరువాత ముఅమ్మరు గడ్డాఫీ స్వీకరించారు.
1960లు 1970లలో విద్యార్థుల ఆందోళనలు ఇథియోపియను జీవితంలో ఒక సాధారణ భాగంగా మారాయి. ఇథియోపియను మేధావి వర్గంలో పెద్ద భాగంలో మార్క్సిజం పాతుకుపోయింది. ప్రత్యేకించి విదేశాలలో చదువుకున్న వారిలో వారు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ప్రాచుర్యం పొందుతున్న తీవ్రవాద, వామపక్ష భావజాలాలకు ప్రభావితమయ్యారు. సామ్రాజ్య సభ, పార్లమెంటులోని సంప్రదాయవాద వర్గాల నుండి, ఇథియోపియను ఆర్థోడాక్సు చర్చి నుండి వచ్చిన ప్రతిఘటన, హైలే సెలాసీ భూ సంస్కరణల ప్రతిపాదనలను అమలు చేయడం కష్టతరం చేసింది. ఇది ప్రభుత్వం ప్రతిష్టను కూడా దెబ్బతీసింది. ఒకప్పుడు హైలే సెలాసీ అనుభవించిన సద్భావనలో చాలా వరకు కోల్పోయేలా చేసింది. ఇది రైతాంగంలో అసంతృప్తిని పెంచింది. యూనియన్లను బలహీనపరిచే ప్రయత్నాలు కూడా ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ సమస్యలు పేరుకుపోవడం ప్రారంభమవడంతో, హైలే సెలాసీ దేశీయ పరిపాలనలో ఎక్కువ భాగాన్ని తన ప్రధానమంత్రి అక్లిలు హబ్తే వోల్డుకు అప్పగించి విదేశీ వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు.
రాచరిక పతనం
[మార్చు]
1973 వోల్లో కరువుకు ప్రభుత్వం సరిగ్గా స్పందించడంలో విఫలమవడం, పట్టణ వర్గాలలో పెరుగుతున్న అసంతృప్తి, 1973 చమురు సంక్షోభం కారణంగా అధిక ఇంధన ధరలు 1974 ఫిబ్రవరిలో సైన్యం, పౌర జనాభా తిరుగుబాటుకు దారితీశాయి. జూన్లో విస్తృతమైన తిరుగుబాటు తర్వాత పౌర ప్రభుత్వం శక్తిహీనంగా మారడంతో శాంతిభద్రతలను కాపాడటానికి సైనిక అధికారులు ఒక బృందంగా ఏర్పడి సాయుధ దళాలు, పోలీసు ప్రాదేశిక సైన్యం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిని డెర్గు అని కూడా పిలుస్తారు.
జూలైలో చక్రవర్తి హైలే సెలాసీ డెర్గుకు అన్ని స్థాయిలలో సైనిక, ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయడానికి కీలకమైన అధికారాలను ఇచ్చారు. త్వరలోనే మాజీ ప్రధానమంత్రులు త్సెహాఫీ తాయెజాజు అక్లిలు హబ్తే-వోల్డు ఎండెల్కాచెవు మకోన్నెను వారి మంత్రివర్గాలలో ఎక్కువ మంది చాలా మంది ప్రాంతీయ గవర్నర్లు, అనేక మంది సీనియరు సైనిక అధికారులు, సామ్రాజ్య ఆస్థాన అధికారులు జైలులో పెట్టబడ్డారు. ఆగస్టులో రాజ్యాంగ రాచరికాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదిత రాజ్యాంగాన్ని చక్రవర్తికి సమర్పించిన తర్వాత ఆ దిశగా మరిన్ని పరిణామాలు జరగకుండా నిరోధించడానికి డెర్గు సామ్రాజ్య ప్రభుత్వాన్ని రద్దు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. డెర్గు 1974 సెప్టెంబరు 12 న చక్రవర్తిని పదవీచ్యుతుడిని చేసి జైలులో పెట్టింది. ఒక ప్రముఖ సైనిక నాయకుడు, శాండుహర్టుసు గ్రాడ్యుయేటు అయిన లెఫ్టినెంటు జనరలు అమాను ఆండంను తాత్కాలిక దేశాధినేతగా ఎన్నుకుంది. ఇది యువరాజు అస్ఫావు వోస్సెను ఐరోపాలో వైద్య చికిత్స నుండి తిరిగి వచ్చే వరకు తాత్కాలిక ఏర్పాటు, ఆ తర్వాత ఆయన రాజ్యాంగ రాచరికంగా సింహాసనాన్ని అధిష్టించాల్సి ఉంది. అయితే జనరలు అమను అండోం ఎరిట్రియాలో కొత్త సైనిక దాడి జరపడం అనే విషయం మీద సెలాసీ మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులను ఉరితీయాలనే వారి ప్రతిపాదన మీద డెర్గులోని తీవ్రవాద వర్గాలతో విభేదించారు. ఆయనకు విధేయులైన ఇంజనీర్లు, ఇంపీరియలు బాడీగార్డు వైమానిక దళం వంటి యూనిట్లను తొలగించిన తర్వాత డెర్గు జనరలు అమనును అధికారం నుండి తొలగించి 1974 నవంబరు 23న ఆయన మద్దతుదారులతో పాటు గత సామ్రాజ్య ప్రభుత్వానికి చెందిన 60 మంది అధికారులను ఉరితీసింది.[91]
బ్రిగేడియరు జనరలు తఫారి బెంటి డెర్గు కొత్త చైర్మనుగా దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. 1975 మార్చిలో రాచరికం అధికారికంగా రద్దు చేయబడింది. మార్క్సిజం-లెనినిజం రాజ్యం కొత్త సిద్ధాంతంగా ప్రకటించబడింది. చక్రవర్తి హైలే సెలాసీ తన వ్యక్తిగత వైద్యుడు లేని సమయంలో 1975 ఆగస్టు 27న రహస్య పరిస్థితులలో మరణించారు. మెంగిస్టు హైలే, ఆయనను చంపించాడని లేదా స్వయంగా చంపాడని సాధారణంగా నమ్ముతారు. అయితే మొదటిదే ఎక్కువగా జరిగి ఉండవచ్చని భావిస్తారు.[92]
సమాజం
[మార్చు]బహ్రే అభిప్రాయం ప్రకారం [93]ఆయన కాలంలోని అంటే 16వ శతాబ్దం చివరి నాటి ఫ్యూడలు ఇథియోపియాలో పది సామాజిక వర్గాలు ఉండేవి. ఈ సామాజిక వర్గాలలో సన్యాసులు; డెబ్టెరా; లౌకిక అధికారులు (న్యాయమూర్తులతో సహా); ఉన్నతాధికారుల భార్యలకు, యువరాణులకు వ్యక్తిగత రక్షణ కల్పించే సాయుధులు; షిమాగ్లే, వీరు ప్రభువులు, వంశపారంపర్య భూస్వాములు; వారి వ్యవసాయ కార్మికులు లేదా బానిసలు; వ్యాపారులు; చేతివృత్తులవారు; సంచార గాయకులు, సైనికులు, వీరిని చెవా అని పిలిచేవారు. ఆధునిక ఆలోచన ప్రకారం ఈ వర్గాలలో కొన్ని నిజమైన తరగతులు కావు. కానీ కనీసం షిమాగ్లే, బానిసలు, చెవా, చేతివృత్తులవారు, వ్యాపారులను నిర్దిష్ట తరగతులుగా ఏర్పర్పిచారు. అధికారం చక్రవర్తికి, ఆయన అధికారాన్ని అమలు చేయడానికి ఆయన నియమించిన ఉన్నత వర్గీయులకు అప్పగించబడింది. అధికారాన్ని అమలు చేసే సాధనం చెవా అనే సైనికుల వర్గాన్ని కలిగి ఉండేది. [94]
1899లో ఆంగ్ల యాత్రికుడు హెర్బర్టు వివియను ఇథియోపియాను ఐదు విభిన్న జాతులతో కూడిన విభిన్న సామ్రాజ్యంగా వర్ణించాడు. ప్రధాన జాతి అమ్హారికు మాట్లాడేవారు (అమ్హారాలు). వారిని ఆయన "నిజమైన అబిస్సినియన్లు"గా భావిస్తాడు. వివియను వారిని ప్రధానంగా షార్పుషూటర్లు, మిలీషియా సైనికులుగా వర్ణించాడు. వారి అస్తవ్యస్తమైన పర్వత యుద్ధ పద్ధతే దేశ స్వాతంత్ర్యానికి ప్రధాన కారణం. ఆయన వారి మహిళలను "అసాధారణంగా అందమైనవారు" అని కూడా వర్ణించాడు. దేశంలో నివసించే అరబు స్థిరనివాసుల ప్రకారం "వారు ఉత్తమ గృహిణులుగా ఉంటారు" అని పేర్కొన్నాడు. అమ్హారికు మాట్లాడేవారి క్రింద ఒరోమోలు ఉన్నారు. వీరు ఉన్నత వర్గాలకు బానిసలుగా ఉంటూ ఒక రకమైన సైనిక నియంతృత్వం క్రింద జీవిస్తున్నారు. వివియను ఒరోమోలను అద్భుతమైన యోధులుగా వర్ణించాడు. వీరు గతంలో ఈ ప్రాంతాన్ని పాలించారు: "గల్లాలు ఎంతటి గొప్ప యోధులంటే వారికి తుపాకులు దొరికితే వారు మళ్ళీ అబిస్సినియన్లను తమ బానిసలుగా చేసుకునేవారు". వివియను ఒరోమోలను నామమాత్రంగా క్రైస్తవులు లేదా ముస్లింలుగా భావించాడు. కానీ వారిలో అత్యధికులు ఇప్పటికీ తమ అసలైన అన్యమత నమ్మకాలను కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. సామ్రాజ్యం, తూర్పు అంచులలో సంచార జాతులైన డనాకిల్సు, సోమాలియన్లు ఉన్నారు. వీరిని వివియను "అసాధారణంగా పేద భూభాగంలో" నివసించే అడవి, మతోన్మాద సంచార జాతులుగా భావించాడు. పశ్చిమ సరిహద్దు ప్రాంతాలలో నీగ్రోలు (షాంకెల్లా) నివసిస్తున్నారు. వీరిని వివియను చాలా ఆదిమ తెగల సమూహంగా భావించాడు. వీరిని అబిస్సినియన్లు క్రమం తప్పకుండా బానిసలుగా చేసుకుంటారు. చివరగా బెటా ఇజ్రాయెలు (ఫలాషా) ప్రజలు ఉన్నారు. వీరు యూదు మతాన్ని స్వీకరించిన ఒక స్థానిక తెగకు చెందిన వారసులు అని ఆయన పేర్కొన్నాడు. చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ, ముస్లిం జనాభా నుండి సాపేక్షంగా ఏకాంతంగా జీవిస్తున్నారు.[95]
సైనిక
[మార్చు]అమ్డే త్సేయోను పాలన నుండి చెవా రెజిమెంట్లు, లేదా సైన్యాలు, సామ్రాజ్యం సైనిక దళాలకు వెన్నెముకగా ఏర్పడ్డాయి. ఈ రెజిమెంట్లకు గీజు పదం షేవా (చెవా) అయితే అమ్హారికు పదం చెవా (మంచిది) అనే పేర్లు ఉంటాయి. రెజిమెంటు సాధారణ పరిమాణంలో అనేక వేల మంది పురుషులు ఉండేవారు. [96] ప్రతి రెజిమెంటుకు ఒక ఫైఫు (గుల్టు) కేటాయించబడింది. దీని నిర్వహణను భూమి ఆదాయం ద్వారా నిర్ధారించారు. [97]
1445లో గోమిటు యుద్ధం తర్వాత చక్రవర్తి జరా యాకోబు చెవా రెజిమెంట్లతో ప్రావిన్సుల మీద దండు చేయడం ప్రారంభించాడని చరిత్రలు నమోదు చేస్తున్నాయి.
| రెజిమెంట్ పేరు [98] | ప్రాంతం | అనువాదం |
|---|---|---|
| బాషర్ వాట్ | సెరే, దావరో, మెన్జు, గామో | వాట్ శత్రువు |
| జువాను అమోరా | డోబె'ఏ, ట్సెలెమ్టు, గెడెం | ఈగల్ ఆఫ్ ది మెజెస్టి |
| Ǧan సిద్ధంగా ఉంది | దవరో, డోబె'యా, అంగోటు | |
| č̣ẽwa బాలే | బాలి | |
| చావా మాయ | మెద్రి బహ్రి | |
| బాషూరు అమోరా | గామో | ఈగిల్ ఈటె |
| బాషరు సోటలు | డామోటు | శత్రువు ఈటె |
| చావా మెగెండరు | నిర్వాహకుడు | |
| చావా ఇఫాతు | ఇఫాతు |
సైన్యంలోని ప్రధాన విభాగాలు:
- కోర్టులో రెజిమెంట్లు, హైకోర్టు అధికారుల క్రింద
- ప్రావిన్సులలో రెజిమెంట్లు, ప్రాంతీయ రాసెసు లేదా ఇతర అధికారుల క్రింద
- సరిహద్దు ప్రాంతాలలో లేదా హదియా, బహిరు నెగాషు, బేలు వంటి స్వయంప్రతిపత్తి కలిగిన ప్రావిన్సులలో రెజిమెంట్లు, అజ్మాకు కింద మధ్యయుగ ఇథియోపియాలో రాజు నియమించిన సైనిక అధికారులు. [99]
ఆధునిక సైన్యం 1917లో కెబరు జబాగ్నా, ఇంపీరియలు గార్డు ఏర్పాటుతో రాస్ తఫారి మకోన్నెను ఆధ్వర్యంలో సృష్టించబడింది.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]
20వ శతాబ్దం వరకు భూస్వామ్య వ్యవస్థ చట్రంలో ఆర్థిక వ్యవస్థ శతాబ్దాల నాటి వస్తు మార్పిడి పద్ధతి "ప్రాచీన ద్రవ్యం", వివిధ రకాల కరెన్సీలతో కూడి ఉండేది. [100][101]రైతులు ఉత్పత్తి కోసం పనిచేశారు. వారి కార్యకలాపాలు పన్నుల వసూలు, మార్కెటింగు మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఉత్పత్తికి పరిమితమై ఉండేవి. [102][103] ఒక రకమైన కరెన్సీ బంగారు ఘనాల రూపంలో ఉండేది. లాన్ఫ్రాంకో రిక్కీ రోడోల్ఫో ఫాటోవిచులు మౌంటు యెరరు సమీపంలో జరిపిన తవ్వకాలలో మధ్యయుగ కాలానికి చెందినవైన, ఒక్కొక్కటి 3.2 గ్రాముల బరువున్న 5.5 మి.మీ. బంగారు ఘనాలు బయటపడ్డాయి. ఆభరణాల లక్షణాలు లేకపోవడంతో ఈ ఘనాలు వాణిజ్యం కోసం బంగారం విలువను ప్రామాణీకరించడానికి ఉపయోగపడి ఉండవచ్చు వాటిలో కొన్ని అధికారిక కరెన్సీ హోదాను సూచించే గుర్తులను కలిగి ఉండవచ్చు. 1699లో ఫ్రెంచు యాత్రికుడు చార్లెసు పోన్సెటు ప్రకారం గోండారులో 10 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న బంగారు ముక్కలను కరెన్సీగా ఉపయోగించారు. [104]
1905లో 2వ మెనెలికు 1904 డిసెంబరులో బ్రిటిషు వారి ఆధీనంలో ఉన్న నేషనలు బ్యాంకు ఆఫ్ ఈజిప్టు నుండి రాయితీ పొందిన తర్వాత మొదటి బ్యాంకు అయిన బ్యాంకు ఆఫ్ అబిస్సినియాను స్థాపించారు. ఈ బ్యాంకు అన్ని ప్రభుత్వ నిధులు, రుణాల మీద గుత్తాధిపత్యం కలిగి ఉండేది. కరెన్సీ నోట్లను ముద్రించడం, నాణేలను ముద్రించడం, ఇతర ప్రత్యేక హక్కులను కలిగి ఉండేది.[105] ఇది హరారు, డైరు దావా, గోరే, డెంబిడోలో లలో శాఖలను, గాంబెలాలో ఏజెన్సీలను, జిబౌటిలో ట్రాన్సిటు కార్యాలయాన్ని విస్తరించింది.[106] 1932లో చక్రవర్తి హైలే సెలాసీ చెల్లించిన పరిహారం తర్వాత దీనికి "బ్యాంకు ఆఫ్ ఇథియోపియా"గా పేరు మార్చబడింది. పారిశ్రామిక ఉత్పాదక రంగాల విస్తరణను ప్రోత్సహించడానికి, హైలే సెలాసీ, జాతీయ ఆర్థిక మండలి సహాయంతో 1957 నుండి 1974 వరకు మూడు పంచవర్ష మాస్టరు ప్లానులను కలిగి ఉన్న ఒక అభివృద్ధి ప్రణాళికను ప్రారంభించారు. 1960, 1970 మధ్య, ఇథియోపియా తలసరి, స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో ఏటా 4.4% వృద్ధి రేటును సాధించింది. 1960/61లో 1.9 శాతంగా ఉన్న ఉత్పాదక రంగ వృద్ధి రేటు 1973/74 నాటికి 4.4 శాతానికి పెరిగింది. అదే సమయంలో టోకు, చిల్లర వ్యాపారం, రవాణా, కమ్యూనికేషను రంగాలు 9.5 శాతం నుండి 15.6 శాతానికి పెరిగాయి.[107] ఇథియోపియా సుమారు 8,00,000 బుషెల్సు గోధుమలను, ప్రధానంగా ఈజిప్టు రాజ్యం, డచు ఈస్టు ఇండీసు, గ్రీసుకు ఎగుమతి చేసింది. రెండవ ఇటలో-ఇథియోపియను యుద్ధం కారణంగా తీవ్రంగా పడిపోవడానికి ముందు 1934 ప్రాంతంలో ఇథియోపియా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 1.3 బిలియను డాలర్లుగా ఉండేది.
కరెన్సీ
[మార్చు]ఇథియోపియా చరిత్ర తొలినాటి కాలంలో అత్యంత సాధారణ కరెన్సీగా "అమోలే" (ఉప్పు కడ్డీలు), గుడ్డ ముక్కలు లేదా ఇనుము ముక్కలు, తరువాత తూటాలు వంటి అవసరమైన వస్తువులు ఉండేవి. 19వ శతాబ్దంలో మాత్రమే మరియా థెరిసా థాలరు పెద్ద లావాదేవీలకు మారకపు సాధనంగా మారింది. చివరికి శతాబ్దం ప్రారంభంలో మెనెలికు స్థానిక కరెన్సీని ముద్రించడం ప్రారంభించే వరకు ఇది కొనసాగింది.[108]
ప్రభుత్వం
[మార్చు]ఇథియోపియను సామ్రాజ్యంలో భూస్వామ్య వ్యవస్థ ప్రధాన సూత్రంగా మారడంతో అది సంస్థాగత సామాజిక అసమానతలతో కూడిన నిరంకుశ వ్యవస్థగా అభివృద్ధి చెందింది. భూమి ప్రధాన వస్తువుగా మారడంతో దానిని స్వాధీనం చేసుకోవడం సామ్రాజ్యవాదం వెనుక ప్రధాన చోదక శక్తిగా మారింది. ముఖ్యంగా 2వ మెనెలికు పాలన నుండి ఇది ప్రారంభమైంది.[109]
చక్రవర్తి హైలే సెలాసీ ఆధునీకరణ ప్రయత్నాలలో భాగంగా 1931, 1955 రాజ్యాంగాలను ప్రవేశపెట్టడం ద్వారా సాంప్రదాయ రాచరిక పాలన సంస్కరించబడింది. ఈ రాజ్యాంగాలు రెండు శాసనసభలతో కూడిన ఏకీకృత పార్లమెంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టాయి: సెనేటు సభ (యెహెగ్గు మెవోస్సెగ్నా మెకెరు బెత్), ప్రతినిధుల సభ (యెహెగ్గు మెమెరియా మెకెరు బెత్).[110][111] 1956 రాజ్యాంగంలోని ఆర్టికలు 56 ప్రకారం ప్రతి సమావేశం ప్రారంభంలో లేదా ముగింపులో సమావేశమయ్యే ఈ రెండు సభలలో ఏ వ్యక్తి కూడా ఏకకాలంలో సభ్యుడిగా ఉండటానికి వీలు లేదు. .[112]
పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికయ్యే 250 మంది సభ్యులతో ప్రతినిధుల సభ ఉండేది. అయితే సెనేటులో ప్రతినిధుల సభలో సగం మంది (125) సభ్యులు ఉండేవారు. వారు ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి చక్రవర్తిచే నియమించబడేవారు.[113]
ఇంకా చూడండి
[మార్చు]- ఇథియోపియా చరిత్ర
- ఇథియోపియన్ చరిత్ర చరిత్ర
- ఇథియోపియా చక్రవర్తి
- ఇథియోపియన్ చక్రవర్తుల జాబితా
- క్రౌన్ కౌన్సిల్ ఆఫ్ ఇథియోపియా
- ఇథియోపియన్ సామ్రాజ్యం యొక్క సైన్యం
- ఇఫాత్ సుల్తానేట్
- షేవా సుల్తానేట్
- ఎర్త్ మెసఫింటు (1755–1855)
- మొదటి ఇటలో-ఇథియోపియన్ యుద్ధం (1895–1896)
- రెండవ ఇటాలియన్-ఇథియోపియన్ యుద్ధం (1935-1936)
- ఇటాలియన్ తూర్పు ఆఫ్రికా (1936–1941)
- అర్బెగ్నోచు (1936–1941)
- తూర్పు ఆఫ్రికా ప్రచారం (రెండవ ప్రపంచ యుద్ధం) (1941)
- ఇథియోపియాలో ఇటాలియన్ గెరిల్లా యుద్ధం (1941–1943)
- ఇథియోపియా విప్లవం (1974)
- ఇథియోపియను అంతర్యుద్ధం (1974–1991)
మూలాలు
[మార్చు]- ↑ Pankhurst, Richard (1982). History Of Ethiopian Towns. Steiner. p. 41. ISBN 978-3-515-03204-9.
- ↑ Pankhurst, Richard (2009). "Barara, the Royal City of 15th and Early 16th Century (Ethiopia). Medieval and Other Early Settlements Between Wechecha Range and Mt Yerer". Annales d'Éthiopie. 24 (1): 209–249. doi:10.3406/ethio.2009.1394.
- ↑ The Southern Marches of Imperial Ethiopia: Essays in History and Social Anthropology, Donham Donald Donham, Wendy James, Christopher Clapham, Patrick Manning. CUP Archive, Sep 4, 1986, p. 11, https://books.google.com/books?id=dvk8AAAAIAAJ&q=Lisane+amharic#v=snippet&q=Lisane%20amharic&f=false Archived 28 డిసెంబరు 2022 at the Wayback Machine
- ↑ Layers of Time: A History of Ethiopia, Paul B. Henze, November 18, 2008, p. 78, https://books.google.com/books?id=3VYBDgAAQBAJ&q=Lisane#v=snippet&q=Lisane&f=false Archived 28 డిసెంబరు 2022 at the Wayback Machine
- ↑ Nathaniel T. Kenney (1965). "Ethiopian Adventure". National Geographic. 127: 555.
- ↑ Negash, Tekeste (2006). "The Zagwe Period and the Zenith of Urban Culture in Ethiopia, Ca. 930–1270 AD". Africa: Rivista Trimestrale di Studi e Documentazione dell'Istituto Italiano per l'Africa e l'Oriente. 61 (1): 120–137. JSTOR 40761842.
- ↑ Constitution of Ethiopia, 4 November 1955, Article 76 (source: Constitutions of Nations: Volume I, Africa by Amos Jenkins Peaslee)
- ↑ "Ethiopia Ends 3,000 Year Monarchy". Milwaukee Sentinel. 22 March 1975. p. 3.
- ↑ "Ethiopia ends old monarchy". The Day. 22 March 1975. p. 7.
- ↑ Henc van Maarseveen; Ger van der Tang (1978). Written Constitutions: A Computerized Comparative Study. Brill. p. 47.
- ↑ "Ethiopia". The World Factbook. Central Intelligence Agency. 1987.
- ↑ Ethiopia - Population Countryeconomy
- ↑ 13.0 13.1 The Royal Chronicle of his reign is translated in part by Richard K. P. Pankhurst, The Ethiopian Royal Chronicles (Addis Ababa: Oxford University Press, 1967).
- ↑ Markessini, Joan (2012). Around the World of Orthodox Christianity – Five Hundred Million Strong: The Unifying Aesthetic Beauty. Dorrance Publishing. ISBN 978-1-4349-1486-6.
- ↑ Morgan, Giles (2017). St George: The patron saint of England. Oldcastle Books. ISBN 978-1-84344-967-6.
- ↑ E. A. Wallis Budge (2014). A History of Ethiopia. Vol. I: Nubia and Abyssinia. Routledge. p. 7. ISBN 978-1-317-64915-1.
- ↑ Lewis, William H. (1956). "The Ethiopian Empire: Progress and Problems". Middle East Journal. 10 (3): 257–268. ISSN 0026-3141. JSTOR 4322824.
- ↑ Hathaway, Jane (2018). The Chief Eunuch of the Ottoman Harem: From African Slave to Power-Broker. Cambridge University Press. p. 26. ISBN 978-1-107-10829-5.
- ↑ Barsbay. Encyclopedia Aethiopica.
- ↑ Erlikh, Hagai (2000). The Nile Histories, Cultures, Myths. Lynne Rienner Publishers. p. 41. ISBN 978-1-55587-672-2.
- ↑ Hassen, Mohammed. Oromo of Ethiopia with special emphasis on the Gibe region (PDF). University of London. p. 22.
- ↑ J. Spencer Trimingham, Islam in Ethiopia (Oxford: Geoffrey Cumberlege for the University Press, 1952), p. 75
- ↑ The Cambridge History of Africa, Volume 3. Cambridge University Press. 1975. p. 167. ISBN 978-0-521-20981-6.
- ↑ "Adal". Encyclopædia Britannica.
- ↑ Pankhurst, History, p. 70; Özbaran, 87
- ↑ Pankhurst, History, p. 119
- ↑ Salvano, Tadese Tele (2018). የደረግ አነሳስና (የኤርትራና ትግራይ እንቆቅልሽ ጦርነት) [The Derg Initiative (The Eritrean-Tigray Mysterious War)]. Tadese Tele Salvano. pp. 81–97. ISBN 978-0-7915-9662-3.
- ↑ Pankhurst, Richard (2001). The Ethiopians: A History. Wiley. p. 45. ISBN 0-631-22493-9.
- ↑ Taddesse Tamrat, Church and State in Ethiopia (Oxford: Clarendon Press, 1972), p. 68 n.1 మూస:ISBN?
- ↑ Getachew Mekonnen Hasen, Wollo, Yager Dibab (Addis Ababa: Nigd Matemiya Bet, 1992), pp. 28–29 మూస:ISBN?
- ↑ Pankhurst, Richard (2001). The Ethiopians: A History. Wiley. p. 46. ISBN 0-631-22493-9.
- ↑ Henze, Paul B. (2000). Layers of Time: A History of Ethiopia. Hurst & Company. p. 58. ISBN 1-85065-393-3.
- ↑ Pankhurst, Richard (1997). The Ethiopian Borderlands Essays in Regional History from Ancient Times to the End of the 18th Century. Red Sea Press. p. 42. ISBN 978-0-932415-19-6.
- ↑ Pankhurst, Richard (1997). The Ethiopian Borderlands Essays in Regional History from Ancient Times to the End of the 18th Century. Red Sea Press. p. 67. ISBN 978-0-932415-19-6.
- ↑ Erlikh, Ḥagai (2002). The Cross and the River Ethiopia, Egypt, and the Nile. Lynne Rienner Publishers. p. 48. ISBN 978-1-55587-970-9.
- ↑ 36.0 36.1 Henze, Paul B. (2000). Layers of Time: A History of Ethiopia. Hurst & Company. p. 67. ISBN 1-85065-393-3.
- ↑ Henze, Paul B. (2000). Layers of Time: A History of Ethiopia. Hurst & Company. p. 68. ISBN 1-85065-393-3.
- ↑ Pankhurst, Richard (1982). History Of Ethiopian Towns. Steiner. p. 58. ISBN 978-3-515-03204-9.
- ↑ Mordechai, Abir. Ethiopia And The Red Sea (PDF). Hebrew University of Jerusalem. pp. 26–27.
- ↑ J. Spencer Trimingham, Islam in Ethiopia (Oxford: Geoffrey Cumberlege for the University Press, 1952), p. 75. https://zelalemkibret.files.wordpress.com/2012/05/islam-in-ethiopia-j-spencer-trimingham.pdf
- ↑ Pankhurst, Richard (1997). The Ethiopian Borderlands Essays in Regional History from Ancient Times to the End of the 18th Century. Red Sea Press. p. 117. ISBN 9780932415196.
- ↑ Mukhtar, Mohamed Haji. Historical Dictionary of Somalia. United States: Scarecrow Press, 2003, xxvii [1]
- ↑ A. Wallace Budge, E. (1828). History Of Ethiopia Nubia And Abyssinia. Vol. 1. Methuen & co. p. 300.
- ↑ Budge, E. A. Wallis. A History of Ethiopia: Volume I (Routledge Revivals): Nubia and Abyssinia, pp. 328-329 [2]
- ↑ Henze, Paul B. (2000). Layers of Time: A History of Ethiopia. Hurst & Company. p. 75. ISBN 1-85065-393-3.
- ↑ Trimmingham, John Spencer (1952). Islam in Ethiopia. Frank Cass & Company. p. 87. ISBN 978-0-7146-1731-2.
{{cite book}}: ISBN / Date incompatibility (help) - ↑ Cerulli, Enrico. Islam Yesterday and Today translated by Emran Waber. pp. 376–381.
- ↑ Trimmingham, John Spencer (1952). Islam in Ethiopia. Frank Cass & Company. p. 88. ISBN 978-0-7146-1731-2.
{{cite book}}: ISBN / Date incompatibility (help) - ↑ Trimmingham, John Spencer (1952). Islam in Ethiopia. Frank Cass & Company. p. 89. ISBN 978-0-7146-1731-2.
{{cite book}}: ISBN / Date incompatibility (help) - ↑ Akyeampong, Emmanuel (2 February 2012). Dictionary of African Biography. Vol. 1–6. OUP USA. p. 451. ISBN 978-0-19-538207-5.
- ↑ Hassen, Mohammed. The Oromo and the Christian Kingdom of Ethiopia: 1300-1700. United Kingdom: James Currey, 2015, p.179
- ↑ Trimingham, J. Spencer. Islam in Ethiopia. United Kingdom: Taylor & Francis, 2013, p.92
- ↑ Pankhurst, Richard (1997). The Ethiopian Borderlands: Essays in Regional History from Ancient Times to the End of the 18th Century. The Red Sea Press. p. 375. ISBN 978-0-932415-19-6.
- ↑ Trimingham, J. Spencer. Islam in Ethiopia. United Kingdom: Taylor & Francis, 2013, p.96
- ↑ Richard Pankhurst, The Ethiopian Borderlands: Essays in Regional History from Ancient Times to The End of the 18th Century Asmara. Red Sea Press, Inc., 1997. p. 390 మూస:ISBN?
- ↑ Braukämper, Islamic History and Culture in Southern Ethiopia: Collected Essays (Hamburg: Lit Verlag, 2002), p. 82
- ↑ John Young (1998). "Regionalism and Democracy in Ethiopia". Third World Quarterly. 19 (2): 192. doi:10.1080/01436599814415. JSTOR 3993156.
- ↑ International Crisis Group, "Ethnic Federalism and its Discontents". Issue 153 of ICG Africa report (4 September 2009) p. 2.
- ↑ Haberland, Eike (1983). "An Amharic Manuscript on the Mythical History of the Adi kyaz (Dizi, South-West Ethiopia)". Bulletin of the School of Oriental and African Studies. 46 (2): 240. doi:10.1017/S0041977X00078836. S2CID 162587450. Retrieved 18 December 2017.
- ↑ Edward C. Keefer (1973). "Great Britain and Ethiopia 1897–1910: Competition for Empire". International Journal of African Studies. 6 (3): 470. doi:10.2307/216612. JSTOR 216612.
- ↑ Caulk, Richard (1971). "The Occupation of Harar: January 1887". Journal of Ethiopian Studies. 9 (2): 1–20. JSTOR 41967469.
- ↑ Zewde, Bahru (25 March 2024). Society, State, and History Selected Essays. Addis Ababa University Printing Press. p. 52. ISBN 978-99944-52-15-6.
- ↑ Hammerton, John Alexander (1922). Peoples of All Nations Their Life To-day and the Story of Their Past · Volume 1. the University of California. p. 1.
- ↑ Hammerton, John Alexander (1922). Peoples of All Nations Their Life To-day and the Story of Their Past · Volume 1. the University of California. p. 14.
- ↑ Nahum, Fasil (1997), Constitution for a Nation of Nations: The Ethiopian Prospect. Red Sea Press. ISBN 1-56902-051-5, p. 17.
- ↑ 66.0 66.1 Fasil (1997), Constitution for a Nation of Nations, p. 22.
- ↑ Antonicelli 1975, p. 79.
- ↑ The New International Year Book (in ఇంగ్లీష్). Dodd, Mead and Company. 1941.
- ↑ "The Lion of Judah and Jerusalem". embassies.gov.il. Archived from the original on 2022-09-14. Retrieved 2022-09-14.
- ↑ Bowers, Keith (2016). Imperial Exile: Emperor Haile Selassie in Britain 1936-1940 (in ఇంగ్లీష్). TSEHAI Publishers & Distributors. ISBN 978-1-59907-168-8.
- ↑ "Members of Ethiopian Diaspora Gather at British Home of Former Emperor". VOA (in ఇంగ్లీష్). 14 January 2020. Retrieved 2022-09-14.
- ↑ 72.0 72.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;:1అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "(1936) Emperor Haile Selassie of Ethiopia, "Appeal to the League of Nations"" (in అమెరికన్ ఇంగ్లీష్). 2008-05-20. Retrieved 2022-09-14.
- ↑ Pankhurst, Richard (2002). "Emperor Haile Sellassie's Arrival in Britain: An Alternative Autobiographical Draft by Percy Arnold". Northeast African Studies. 9 (2): 1–46. doi:10.1353/nas.2007.0008. ISSN 0740-9133. JSTOR 41931306. S2CID 144707809.
- ↑ Pankhurst, Richard (1996). "Emperor Haile Sellassie's Autobiography, and an Unpublished Draft". Northeast African Studies. 3 (3): 69–109. doi:10.1353/nas.1996.0015. ISSN 0740-9133. JSTOR 41931150. S2CID 143268411.
- ↑ "Emperor Haile Selassie I Returns Triumphant to Ethiopia". Origins (in ఇంగ్లీష్). 30 May 2016. Retrieved 2022-09-14.
- ↑ "Haile Selassie, last emperor of Ethiopia and architect of modern Africa". HistoryExtra (in ఇంగ్లీష్). Retrieved 2022-09-14.
- ↑ Peter P. Hinks, John R. McKivigan, R. Owen Williams (2007). Encyclopedia of antislavery and abolition, Greenwood Publishing Group, p.248. ISBN 0-313-33143-X.
- ↑ Shinn, David Hamilton and Ofcansky, Thomas P. Historical Dictionary of Ethiopia. 2004, page 201.
- ↑ 80.0 80.1 Shinn, David Hamilton and Ofcansky, Thomas P. Historical Dictionary of Ethiopia. 2004, page 140-1.
- ↑ 81.0 81.1 81.2 81.3 81.4 Ofcansky, Thomas P., and Berry, Laverle. Ethiopia: A Country Study. 2004, page 63-4.
- ↑ Willcox Seidman, Ann. Apartheid, Militarism, and the U.S. Southeast. 1990, page 78.
- ↑ 83.0 83.1 83.2 Watson, John H. Among the Copts. 2000, page 56.
- ↑ Nathaniel, Ras. 50th Anniversary of His Imperial Majesty Haile Selassie I. 2004, page 30.
- ↑ "Ethiopia Administrative Change and the 1955 Constitution". Country-studies.com. Retrieved 12 September 2010.
- ↑ "Ethiopia's Revised Constitution". Middle East Journal. 10 (2): 194–199. 1956. ISSN 0026-3141. JSTOR 4322802.
- ↑ Bahru Zewde, A History of Modern Ethiopia, second edition (Oxford: James Currey, 2001), pp.220–26
- ↑ 88.0 88.1 Mammo, Tirfe. The Paradox of Africa's Poverty: The Role of Indigenous Knowledge. 1999, page 100.
- ↑ "General Assembly Resolutions 5th Session". United Nations. Retrieved 16 October 2007.
- ↑ Semere Haile "The Origins and Demise of the Ethiopia-Eritrea Federation", Issue: A Journal of Opinion, 15 (1987), pp.9–17
- ↑ "Ethiopia Executes 60 Former Officials, Including 2 Premiers and Military Chief". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). 1974-11-24. ISSN 0362-4331. Retrieved 2021-08-08.
- ↑ Bulcha, Mekuria (1997). "The Politics of Linguistic Homogenization in Ethiopia and the Conflict over the Status of "Afaan Oromoo"". African Affairs. 96 (384): 325–352. doi:10.1093/oxfordjournals.afraf.a007852. ISSN 0001-9909. JSTOR 723182.
- ↑ Bahrey. (1954). History of the Galla. In C.F. Beckingham and G.B.W. Huntingford
- ↑ Transitional government of Ethiopia, National Conservation Strategy, 1994, http://documents.worldbank.org/curated/en/720181468749078939/pdf/multi-page.pdf Archived 28 ఆగస్టు 2017 at the Wayback Machine
- ↑ Hammerton, John Alexander (1922). Peoples of All Nations Their Life To-day and the Story of Their Past · Volume 1. the University of California. p. 14.
- ↑ Mordechai ABIR, Ethiopia and the Red Sea, p. 51 https://books.google.com/books?id=7fArBgAAQBAJ&dq=chewa%20ehiopia&pg=PA49 Archived 28 డిసెంబరు 2022 at the Wayback Machine
- ↑ Mordechai ABIR, Ethiopia and the Red Sea, p. 49 https://books.google.com/books?id=7fArBgAAQBAJ&dq=chewa%20ehiopia&pg=PA49 Archived 28 డిసెంబరు 2022 at the Wayback Machine
- ↑ Deresse Ayenachew, Evolution and Organisation of the Ç̌äwa Military Regiments in Medieval Ethiopia, Annales d'Ethiopie, p. 93, https://www.persee.fr/docAsPDF/ethio_0066-2127_2014_num_29_1_1559.pdf
- ↑ Deresse Ayenachew, Evolution and Organisation of the Ç̌äwa Military Regiments in Medieval Ethiopia, Annales d'Ethiopie, p. 88, https://www.persee.fr/docAsPDF/ethio_0066-2127_2014_num_29_1_1559.pdf
- ↑ "The Rise of Feudalism in Ethiopia" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-04.
- ↑ Ellis, Gene (1979). "Feudalism in Ethiopia: A Further Comment on Paradigms and Their Use". Northeast African Studies. 1 (3): 91–97. ISSN 0740-9133. JSTOR 43660024.
- ↑ Cohen, John M. (1974). "Ethiopia: A Survey on the Existence of a Feudal Peasantry". The Journal of Modern African Studies. 12 (4): 665–672. doi:10.1017/S0022278X00014312. ISSN 0022-278X. JSTOR 159996. S2CID 154715719.
- ↑ Cohen, John M. (1974). "Peasants and Feudalism in Africa: The Case of Ethiopia". Canadian Journal of African Studies. 8 (1): 155–157. doi:10.2307/483880. ISSN 0008-3968. JSTOR 483880.
- ↑ Vigano, Marco; ቪጋኖ, ማርኮ (2016-04-21). "Prayers and Cornerstones. Wedges of gold, Prows of old. Ancient and medieval Ethiopia as an African Empire based on sea trade".
{{cite journal}}: Cite journal requires|journal=(help) - ↑ Schaefer, Charles (1992). "The Politics of Banking: The Bank of Abyssinia, 1905–1931". The International Journal of African Historical Studies. 25 (2): 361–389. doi:10.2307/219391. ISSN 0361-7882. JSTOR 219391.
- ↑ Teklemedhin, Fasil Alemayehu and Merhatbeb. "The Birth and Development of Banking Services in Ethiopia". www.abyssinialaw.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 21 January 2022. Retrieved 2022-07-06.
- ↑ "Industry and Industrialization in Ethiopia: Policy Dynamics and Spatial Distributions" (PDF). 4 July 2022.
- ↑ Zekaria, Ahmed (1991). "Harari Coins: A Preliminary Survey". Journal of Ethiopian Studies. 24: 23–46. ISSN 0304-2243. JSTOR 41965992.
- ↑ "The Rise of Feudalism in Ethiopia" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-17.
- ↑ Lewis, William H. (1956). "The Ethiopian Empire: Progress and Problems". Middle East Journal. 10 (3): 257–268. ISSN 0026-3141. JSTOR 4322824.
- ↑ "1931 Constitution of Ethiopia" (PDF). 17 September 2022.
- ↑ "Revised Constitution of the Empire of Ethiopia" (PDF). 22 September 2022. Archived from the original (PDF) on 9 February 2023. Retrieved 22 September 2022.
- ↑ "ETHIOPIA" (PDF). 22 September 2022.
ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు
- మూలాల లోపాలున్న పేజీలు
- CS1 errors: ISBN date
- CS1 బ్రిటిష్ ఇంగ్లీష్-language sources (en-gb)
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు
- Articles containing Ge'ez-language text
- Articles containing Amharic-language text
- Articles containing English-language text
- Pages using infobox country with unknown parameters
- Pages using infobox country or infobox former country with the flag caption or type parameters
- Pages using infobox country or infobox former country with the symbol caption or type parameters