ఇ. ఎస్. వెంకట్రామయ్య
స్వరూపం
ఇ.ఎస్.వెంకట్రామయ్య | |
---|---|
![]() | |
19వ భారత ప్రధాన న్యాయమూర్తి | |
In office 19 జూన్ 1989 – 17 డిసెంబర్ 1989 | |
Nominated by | ఆర్. ఎస్. పాఠక్ నేతృత్వంలోని న్యాయమూర్తుల కొలీజియం |
Appointed by | రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ |
అంతకు ముందు వారు | రఘునందన్ స్వరూప్ పాఠక్ |
తరువాత వారు | సబ్యసాచి ముఖర్జీ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1924 డిసెంబరు 18 |
మరణం | 1997 సెప్టెంబరు 24 | (వయసు: 72)
సంతానం | బీవీ నాగరత్న |
ఎంగలగుప్పె సీతారామయ్య వెంకటరామయ్య (18 డిసెంబర్ 1924 - 24 సెప్టెంబర్ 1997[1]) భారతదేశ 19వ ప్రధాన న్యాయమూర్తి, 19 జూన్ 1989 నుండి 17 డిసెంబర్ 1989న పదవీ విరమణ చేసే వరకు సేవలందించాడు. ఇతడు 1946లో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. నవంబర్ 1970లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడైనాడు.
మార్చి 1979లో, ఇతడు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. జూన్ 1989లో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. యాదృచ్ఛికంగా ఇతడు కర్ణాటక నుండి భారత ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి. తన సుప్రీంకోర్టు పదవీకాలంలో, వెంకటరామయ్య 256 తీర్పులను చెప్పాడు. 720 బెంచ్లపై పనిచేశారు..[2] ఇతడు 1997 సెప్టెంబర్ 24వ తేదీన గుండెపోటుతో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Obituary Events in 1997". Archived from the original on 2003-12-31. Retrieved 15 October 2018.
- ↑ "E.S. Venkataramaiah". Supreme Court Observer (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-30.
బయటి లింకులు
[మార్చు]- Brief biography, karnatakajudiciary.kar.nic.in. Accessed 13 March 2024.