ఉదయపూర్ సిటీ ప్యాలెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదయపూర్ సిటీ ప్యాలెస్
ప్యాలెస్
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉదయ్‌పూర్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°34′34″N 73°40′59″E మార్చు
స్వంతదారుMahendra Singh Mewar మార్చు
Category for the interior of the itemCategory:Interior of the City Palace (Udaipur) మార్చు
Category for the view of the itemCategory:Views of Udaipur from City Palace మార్చు
పటం

ఉదయపూర్ సిటీ ప్యాలెస్, అనేది రాజస్థాన్ రాష్ట్రం లోని ఉదయ్‌పూర్ నగరంలో ఉన్న ఒక ప్యాలస్ కాంప్లెక్స్. మేవాడ్ రాజవంశీకులు దాదాపు 400 ఏళ్ల పాటు ఈ ప్యాలెస్ ను నిర్మించారు. 1553లో సిసోడియా రాజ్ పుత్ కుటుంబానికి చెందిన మహారాణా ఉదయ్ సింగ్ II ఈ ప్యాలెస్ నిర్మాణం ప్రారంభించారు. ఆయన తన రాజధానిని చిత్తోర్ నుంచి ఉదయపూర్ కు మార్చే సమయంలో ఈ ప్యాలెస్ ను నిర్మించడం మొదలుపెట్టారు.[1]

పిచోలా సరస్సుకు తూర్పు ఒడ్డున ఉంది. ఈ ప్యాలెస్ లోనే ఎన్నో ప్యాలెస్ లు ఉన్నాయి. అందుకే ఇది ప్యాలెస్ ల కాంప్లెక్స్ గా ఉంది.[2][3][4][5][6]

ఈ ప్యాలెస్ చాలా ఆడంబరంగా నిర్మించారు. రాజస్థాన్ లోని అన్ని ప్యాలస్ ల కన్నా ఇదే అతిపెద్ద భవనం. కొండపైన కట్టిన ఈ ప్యాలెస్ ను రాజస్థానీ, మొఘల్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ భవనం నుంచీ పూర్తి నగరాన్నీ వీక్షించవచ్చు. ఈ ప్యాలెస్ కాంప్లెక్స్ లో పిచోలా సరస్సుతో పాటు లేక్ ప్యాలెస్, జగ్ మందిర్, జగదీశ్ ఆలయం, మాన్ సూన్ ప్యాలెస్, నీమచ్ మాతా ఆలయం వంటివి ఉంటాయి. ఆరావళీ పర్వతాల్లో ఈ ప్యాలెస్ ను నిర్మించారు. 1983లో తీసిన  జేమ్స్ బాండ్ సినిమా ఆక్టోపసీను ఈ ప్యాలస్ లలోనే తీశారు.

మూలాలు[మార్చు]

  1. UDAIPUR: Since 1553 CE!
  2. Brown, Lindsay; Amelia Thomas (2008).
  3. George, Michell; Antoni Martinelli (1994).
  4. Henderson, Carol E; Maxine K. Weisgrau (2007).
  5. "History of Udaipur" Archived 2016-03-03 at the Wayback Machine.
  6. "City Palace, Udaipur".

వెలుపలి లంకెలు[మార్చు]