ఉమయల్పురం కె.నారాయణస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉమయల్పురం కె.నారాయణస్వామి
వ్యక్తిగత సమాచారం
జననం(1929-05-14)1929 మే 14
కుంభకోణం, తంజావూరు జిల్లా, తమిళనాడు
మరణం1997 ఆగస్టు 3(1997-08-03) (వయసు 68)
చెన్నై
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాద్యకళాకారుడు
వాయిద్యాలుఘటం

ఉమయల్పురం కె.నారాయణస్వామి (1929–1997) ఒక కర్ణాటక సంగీత శాస్త్రీయ వాద్యకారుడు.

విశేషాలు[మార్చు]

ఇతడు 1929, మే 14వ తేదీన కుంభకోణంలో జన్మించాడు.[1] ఇతడు తన తండ్రి ఉమయల్పురం కోదండరామ అయ్యర్ వద్ద ఘటవాదనం నేర్చుకున్నాడు. ఇతడు ఘటవాద్యంతో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎస్.రాజం, చిట్టిబాబు, మణి కృష్ణస్వామి గురువాయూర్ దొరై వంటి సంగీతవిద్వాంసులకు సహకారం అందించాడు.[2] 1994లో ఇతడు అమెరికా పర్యటించి అనేక విశ్వవిద్యాలయాలలో కర్ణాటక సంగీతంపై ఉపన్యాసాలు చేశాడు. ఇతడు ఆకాశవాణిలో నిలయ విద్వాంసునిగా పనిచేసి 1989లో పదవీవిరమణ చేశాడు. ఇతడు 1997, ఆగష్టు 3వ తేదీన చెన్నైలో మరణించాడు.

అవార్డులు[మార్చు]

ఇతడిని అనేక సంగీత సభలు, సంస్థలు సత్కరించాయి. 1995లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతనికి కళైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది. అదే యేడు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి కర్ణాటక సంగీతం వాద్యపరికరాలు - ఘటం విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించింది.

మూలాలు[మార్చు]

  1. web master. "Umayalpuram K. Narayanaswamy". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 14 ఆగస్టు 2020. Retrieved 8 March 2021.
  2. Umayalpuram Narayanaswamy dead