ఊర ఈశ్వరరెడ్డి
Oora Eshwar Reddy ఊర ఈశ్వరరెడ్డి | |
---|---|
![]() | |
జననం | ఊర ఈశ్వరరెడ్డి 10.06.1954 గ్రామం : కోయిలదిన్నె, మండలం : వడ్డేపల్లి |
నివాస ప్రాంతం | కోయిలదిన్నె |
ఇతర పేర్లు | ఊర ఈశ్వరరెడ్డి |
వృత్తి | వ్యవసాయం |
ప్రసిద్ధి | కవి |
మతం | హిందూ |
ఊర ఈశ్వరరెడ్డిజోగులాంబ గద్వాల జిల్లా కు చెందిన పద్య కవి. పారమార్థ కవి. ఇతను జోగులాంబ గద్వాల జిల్లా, వడ్డేపల్లి మండలంలోని కోయిలదిన్నెగ్రామంలో జన్మించారు. 1954 జూన్ 10 వ తేదిన జన్మించారు. తల్లిదండ్రులు ఊర కృష్ణమ్మ, ఊర వెంకటరామిరెడ్డి. వీరి భార్య ఊర ఈశ్వరమ్మ. స్వగ్రామమైన కోవెల దిన్నెలో వీరు ప్రాథమిక విద్యను అభ్యసించారు. సమీపంలోని రామాపురంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవించారు. సాహిత్యం మీద ఇష్టంతో పద్య కవిత్వం రాయడం ప్రారంభించారు. వాస్తు ప్రకారం ఇండ్ల ప్లానులు, భూములు సర్వే చేయడం వీరి ప్రవృత్తి.
రచనలు
[మార్చు]1.వేంకటేశ్వర ద్విశతి[1].
2.చెన్నకేశవ శతకం[2].
3.కవితాలహరి
4. సమస్యా పూరణం
5.ముక్తిపథం[3].
6. వేణిసోంపురం వేణుగోపాలస్వామి[4].
2014 లో వెలువడిన వీరి వెంకటేశ్వర ద్విశతి 208 ఆటవెలది పద్యాలతో రాయబడిన శతకం. విశ్వమందు నిజము వెేంకటేశ అనునది మకుటం. ఇందులో మొదటి పద్యం-
శ్రీరమాంతరంగ శ్రిత పారిజాతమా
తిరుమలగిరి పైన తిరముగాను
వెలిసినావు నీవు వెేంకటేశుడవయ్యి
విశ్వమందు నిజము వేంకటేశ
2021లో వెలువడిన వీరి చెన్నకేశవ శతకము వృత్తపద్యాలలో రాయబడినది. చెన్నకేశవా అనునది మకుటం.
జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు పద్య సంకలనం లో వేణి సోంపురం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రశస్థి గురించి రాశారు. జడకందములు, సైనికార్చన, శంకరాభరణం సప్తతి సంచిక, శార్వరి ఉగాది సంకలనం, పద్య ప్రభంజనం, అష్టవిధ నాయకులు, జలకళ, సురవరం మొగ్గలు, శిరిడి సాయి మొగ్గలు, బతుకమ్మ మొగ్గలు, గాంధీజీ మొగ్గలు తదితర సంకలనాల్లో వీరి రచనలు ప్రచురించబడ్డాయి.

ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఊర ఈశ్వరరెడ్డి,వేంకటేశ్వర ద్విశతి, అమృత ప్రింటర్స్, హైదరాబాద్-20, జూన్, 2014
- ↑ ఊర ఈశ్వరరెడ్డి,చెన్నకేశవ శతకం, శంకరాభరణం ప్రచురణలు,హైదరాబాద్, ఫిబ్రవరి, 2021
- ↑ ఊర ఈశ్వరరెడ్డి,ముక్తిపథం, శంకరాభరణం ప్రచురణలు,హైదరాబాద్, ఆగస్టు, 2021
- ↑ ఊర ఈశ్వరరెడ్డి,వేణిసోంపురం వేణుగోపాలస్వామి, శంకరాభరణం ప్రచురణలు,హైదరాబాద్, నవంబర్, 2021