ఎన్. శివరాజ్
ఎన్. శివరాజ్ | |
---|---|
లోక్సభ సభ్యుడు | |
In office 1957–1961 | |
అంతకు ముందు వారు | ఓ.వి అళగేశన్ |
తరువాత వారు | ఎ. కృష్ణస్వామి |
నియోజకవర్గం | చెంగల్పట్టు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1892 సెప్టెంబరు 29 కడప, ఆంధ్రప్రదేశ్ |
మరణం | 1964 సెప్టెంబరు 29 చెన్నై, తమిళనాడు | (వయసు: 72)
రాజకీయ పార్టీ | మద్రాస్ షెడ్యూల్డ్ కులాల పార్టీ, మద్రాస్ షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, ఆల్-ఇండియా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, భారతీయ రిపబ్లికన్ పార్టీ |
ఇతర రాజకీయ పదవులు | జస్టిస్ పార్టీ |
జీవిత భాగస్వామి | అన్నై మీనాంబాల్ శివరాజ్ |
కళాశాల | డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల, చెన్నై |
వృత్తి | రాజకీయవేత్త, కార్యకర్త |

రావు బహదూర్ నమశ్శివాయం శివరాజ్ (1892, సెప్టెంబరు 29 - 1964, సెప్టెంబరు 29) తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, షెడ్యూల్డ్ కుల కార్యకర్త.
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]శివరాజ్ 1892, సెప్టెంబరు 29న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని కడప పట్టణంలో పరైయర్ కుటుంబంలో అకౌంట్స్ ఆఫీసర్ అయిన నాంశివాయంకు జన్మించాడు.[1] అతని పూర్వీకులు మద్రాసు సమీపంలోని పూనమల్లి పట్టణానికి చెందినవారు. ఎన్. శివరాజ్ 1907లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు, 1911లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి బి.ఎ. పూర్తి చేశాడు. 1915 లో ఆయన మద్రాస్ లా కాలేజీ నుండి న్యాయవాదిగా పట్టభద్రుడయ్యాడు. సర్ సి.పి. రామస్వామి అయ్యర్ వద్ద జూనియర్గా ప్రాక్టీస్ చేశాడు.[2] ఆయన మద్రాస్ లా కాలేజీలో పదమూడు సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాడు.
కుటుంబం
[మార్చు]శివరాజ్ అన్నై మీనాంబాల్ను వివాహం చేసుకున్నాడు, నలుగురు పిల్లలు ఉన్నారు.[3]
శివరాజ్ డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్లో ప్రముఖ నాయకులలో ఒకరు. అతను 1917లో జస్టిస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు, 1926 వరకు దానికి మద్దతు ఇచ్చాడు. అతను 1945లో మద్రాస్ మునిసిపల్ కార్పొరేషన్లో మేయర్గా పనిచేశాడు. 1946 వరకు పనిచేశాడు. ఆయన 1926లో మద్రాసు శాసన మండలికి నామినేట్ అయ్యి 1937 వరకు సభ్యుడిగా పనిచేశారు. 1937 నుండి 1945 వరకు, శివరాజ్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు. అతను 1952, 1957, 1962 లోక్సభ ఎన్నికలలో పాల్గొని, చెంగల్పట్టు నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు.
ఆయన పెరియార్ ఇవి రామస్వామితో కలిసి తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, మహిళా హక్కుల ఉద్యమంలో చురుకైన సభ్యుడు.[4]
1942 జూలై 17-20 తేదీలలో నాగ్పూర్లో జరిగిన జాతీయ సమావేశంలో బిఆర్ అంబేద్కర్ స్థాపించిన అణగారిన వర్గాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొలి అఖిల భారత రాజకీయ పార్టీ అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య. దీనికి శివరాజ్ అధ్యక్షత వహించగా, ఆయన దాని మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[5]
1957 లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడినప్పుడు, ఆయన మళ్ళీ దాని మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1964 లో మరణించే వరకు సంస్థను స్థాపించడానికి కృషిచేశాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Basu, Raj Sekhar (2011-02-14). Nandanar's Children: The Paraiyans' Tryst with Destiny, Tamil Nadu 1850 – 1956 (in ఇంగ్లీష్). SAGE Publications. ISBN 978-81-321-0514-5.
- ↑ Shakunthala Jagannathan (1999). Sir C. P. Remembered. Vakils, Feffer and Simmons Ltd. p. 74. ISBN 81-87111-27-5.
- ↑ "30 November – Remembering Annai Meenambal Sivaraj – First Dalit Woman President of South India Scheduled Castes Federation (SCF)". Velivada. 2017-11-30. Retrieved 2020-11-27.
- ↑ गीता, V. Geetha वी (2017-06-21). "Ambedkar and Periyar's intellectual comradeship". Forward Press. Retrieved 2020-11-27.
- ↑ "Dr.Ambedkar and All India Scheduled Castes Federation". Retrieved 15 November 2017.
- ↑ Khobragade, Fulchand (2014). Suryaputra Yashwantrao Ambedkar. Nagpur: Sanket Prakashan. pp. 20, 21.
మూలాలు
[మార్చు]- Ramacandra Kshirasagara (1994). Dalit Movement in India. M. D. Publications. pp. 331–333. ISBN 978-81-85880-43-3.