ఓదెల మండలం
ఓదెల మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండల కేంద్రం.[1]
ఓదెల మండలం | |
— మండలం — | |
పెద్దపల్లి జిల్లా పటంలో ఓదెల మండలం మండల స్థానం | |
తెలంగాణ పటంలో ఓదెల మండలం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి |
మండల కేంద్రం | ఓదెల |
గ్రామాలు | 11 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 42,211 |
- పురుషులు | {{{population_male}}} |
- స్త్రీలు | 21,247 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.62% |
- పురుషులు | 62.01% |
- స్త్రీలు | 37.18% |
పిన్కోడ్ | 505152 |
ఈ మండలం పరిధిలో 11 రెవెన్యూ గ్రామాలు కలవు.
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.[మార్చు]
లోగడ ఓదెల గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లాలోని, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఓదెల మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 42,211 స్త్రీలు 21,247.
సమీప మండలాలు[మార్చు]
ఈ మండలానికి సరిహద్దు మండలాలు పెద్దపల్లి, జమ్మికుంట, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
మండల పర్యాటక ప్రదేశాలు[మార్చు]
ఈ మండలంలో ఓదెల మల్లన్న దేవాలయంగా ఖ్యాతిగాంచిన ఈ దేవాలయం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల్లో ఒకటి. ఈ దేవాలయం పెద్దపల్లి జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయ నిర్మాణక్రమం, స్తంభ వర్ణ శిలల శిల్పాల ఆధారంగా చాళుక్యుల కాలంలోనే నిర్మింపబడి, క్రీ.శ.1300 మధ్యకాలంలో కాకతీయుల కాలంలో పునర్నిర్మింపబడినట్లుగా తెలుస్తుంది. ఈ దేవాలయం ఓదెల గ్రామానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో జరిగే జాతరకు పెద్దపల్లి జిల్లా నుండేకాక సరిహద్దు జిల్లాలైన కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రితో మొదలయ్యే ఈ జాతర పెద్దపట్నం అనే కార్యక్రమంతో ముగుస్తుంది.
రవాణా సౌకర్యాలు[మార్చు]
ఈ మండలానికి సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం ఉంది. బస్సు సౌకర్యం కలదు.