కంభం చెరువు
కంభం చెరువు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా కంభం లో ఉంది. ఈ చెరువు 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణ దేవరాయులు కాలంలో ఈ చెరువును నిర్మించారు.ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది.[1]
ఇతర వివరాలు[మార్చు]
కంభం చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఇటీవల పూడిక కారణంగా 2 టీఎంసీలకే పరిమితం అయినది. ఈ చెరువు ద్వారా 6,944 ఎకరాలకు సాగునీరు చేరుతుంది.ప్రస్తుతం కంభం చెరువు ఆయకట్టు పరిధిలో అరటి, పసుపు, శనగ, వరి వంటి పంటలు విరివిగా పండిస్తున్నారు. 2 లక్షల జనాభా తాగునీటి సమస్య తీరుస్తుంది.ఈ చెరువు 9 సార్లు మాత్రమే పూర్తిగా నిండింది. అది కూడా 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996,2005,2020 పూర్తిగా నిండినది.[2]
అంతర్జాతీయంగా గుర్తింపు[మార్చు]
కంభం చెరువుని ప్రపంచ చారిత్రక వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజే (ఐసీఐడీ) సంస్థ అధికారికంగా ప్రకటించింది.[3]
మూలాలు[మార్చు]
- ↑ S.murali (2016-09-27). "Cumbum tank a big draw in Prakasam". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2020-12-06.
- ↑ "25 సంవత్సరాల తర్వాత.. కంభం చెరువు తొణికిసలాడుతుండటంతో." www.andhrajyothy.com. Retrieved 2020-12-06.
- ↑ "కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?". BBC News తెలుగు. Retrieved 2020-12-06.