కట్ట వరదరాజ భూపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కట్ట వరదరాజ భూపతి సా.శ.1560 నాటికి చెందిన కవి. ఆయన రాజవంశీకుడైన తెలుగు రాజకవుల్లో ఒకరిగా నిలుస్తున్నారు.

జీవితం[మార్చు]

కట్ట వరదరాజ భూపతి విజయనగర సామ్రాజ్య పాలకుల రాజబంధువు. శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, విజయనగరాన్ని పరోక్షంగా పరిపాలించినవాడూ అయిన అళియ రామరాజుకు వరదరాజ భూపతి పినతల్లి కుమారుడు.

సాహిత్య రంగం[మార్చు]

కట్ట వరదరాజ భూపతి సుప్రసిద్ధమైన వైష్ణవక్షేత్రం శ్రీరంగం విశిష్టత గురించి శ్రీరంగ మహాత్మ్యం అనే కావ్యాన్ని రచించారు. ఇదే కాక పరమ భాగవత చరిత్రము, రామాయణ ద్విపద వంటి కావ్యాలను రచించారు.[1]

రచనలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. రామకృష్ణకవి, మానవల్లి (1910). "ఆంధ్ర రాజకవులు". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 81. Retrieved 6 March 2015.