కాలచూరి రాజవంశం

వికీపీడియా నుండి
(కలాచురి రాజవంశం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

Kalachuris of Mahishmati

6th century–7th century
పటం
Find spots of the inscriptions issued by the Kalachuris of Mahishmati (map of India)[1][2]
రాజధానిMahishmati
సామాన్య భాషలుSanskrit
మతం
Shaivism
ప్రభుత్వంmonarchy
చరిత్ర 
• స్థాపన
6th century
• పతనం
7th century
Preceded by
Succeeded by
Vakataka dynasty
Vishnukundina
Traikutaka dynasty
Aulikaras
Chalukya dynasty
Today part ofIndia

కలచురిలు (IAST: కలకూరి) 6 వ - 7 వ శతాబ్దాల మధ్య పశ్చిమ-మధ్య భారతదేశంలో పాలించిన ఒక భారతీయ రాజవంశం. వారిని హైహయులు లేదా "ప్రారంభ కలాచూరీలు" అని కూడా పిలుస్తారు.

కలచురి భూభాగంలో ప్రస్తుత గుజరాతు, మధ్యప్రదేశు, మహారాష్ట్ర ప్రాంతాలు ఉన్నాయి. వారి రాజధాని బహుశా మహిష్మతి వద్ద ఉందని భావిస్తున్నారు. ఎలోరా, ఎలిఫెంటా గుహ స్మారక చిహ్నాలను కలచురి పాలనలో నిర్మించినట్లు ఎపిగ్రాఫికు, నమిస్మాటికు ఆధారాలు సూచిస్తున్నాయి.

రాజవంశం మూలం అనిశ్చితం. 6 వ శతాబ్దంలో కలచురిలు గతంలో గుప్తులు, ఒకతకులు, విష్ణుకుండినులు పాలించిన భూభాగాల మీద నియంత్రణ సాధించారు. శిలాశాసనంలో ముగ్గురు కలచురి రాజులు మాత్రమే పేర్కొనబడ్డారు: శంకరగాన, కృష్ణరాజు, బుద్ధరాజు. 7 వ శతాబ్దంలో కలచురిలు శక్తిని వాతాపిలోని చాళుక్యులు పడగొట్టారు. ఒక సిద్ధాంతం త్రిపురి, కళ్యాణి తరువాతి కలచురి రాజవంశాలను మహిష్మతి కలచురిలతో కలుపుతుంది.

భూభాగం[మార్చు]

కలచురి శాసనాల ప్రకారం, రాజవంశం ఉజ్జయిని, విదిషా, ఆనందపురాలను నియంత్రించింది. వారి రాజధాని మాళ్వా ప్రాంతంలోని మహిష్మతి అని సాహిత్య ఆధారాలు సూచిస్తున్నాయి.[3]

ఈ రాజవంశం విదర్భను కూడా నియంత్రించింది. అక్కడ వారు ఒకతక, విష్ణుకుండినా రాజవంశాల తరువాత పాలన సాధించారు. [3]

అదనంగా 6 వ శతాబ్దం మధ్యకాలంలో కలచురిలు ఉత్తర కొంకణాన్ని (ఎలిఫెంటా పరిసరప్రాంతాలు) జయించారు. ఇక్కడ వారు త్రైకుటకా రాజవంశం తరువాత పాలన సాధించారు.[3]

చరిత్ర[మార్చు]

క్రిష్ణరాజ[మార్చు]

కృష్ణరాజ వెండి నాణెం
కలచురి పాలెగాడు రాజా కలహశిల నాణెం సిర్కా (575-610).

కలచురిల మూలం అనిశ్చితం.[3] కృష్ణరాజు (మ. 550-575) రాజవంశం తొలి పాలకుడు. త్రైకూటకా, గుప్త రాజులు జారీ చేసిన మునుపటి నాణేల రూపకల్పనను అనుకరిస్తూ బ్రాహ్మి లిపి పదాలు కలిగి ఉన్న నాణేలను ఆయన విడుదల చేశాడు. ఎద్దును కలిగి ఉన్న అతని నాణేలు స్కందగుప్తా జారీ చేసిన నాణేల మీద ఆధారపడి ఉంటాయి. ఆయన పాలన తరువాత సుమారు 150 సంవత్సరాలు ఆయన వెండి నాణేలు విస్తృతంగా చలామణి చేయబడ్డాయి.[3]

కృష్ణరాజు నాణేలు ఆయనను పరమ-మహేశ్వరుడు (శివుని భక్తుడు) గా అభివర్ణిస్తాయి. ఆయన కుమారుడు శంకరగన శాసనం ఆయన పుట్టినప్పటి నుండి పశుపతి (శివ) భక్తుడని పేర్కొంది.[3] చారిత్రాత్మక ఆధారాలు ఆయన ఎలిఫంటా గుహల వద్ద ఉన్న శైవ స్మారక కట్టడాలను, ఆయన నాణేలు కనుగొనబడిన ఎల్లోరాలోని బ్రాహ్మణ గుహలలో మొట్టమొదటివిగా రూపొందించబడి ఉండవచ్చని సూచిస్తున్నాయి.[4][5][3]

శంకరగాన[మార్చు]

ఉజ్జయిని, నిర్గుండిపద్రాకా నుండి జారీ చేయబడిన తన సొంత శాసనాల ద్వారా శంకరాగన (r. C. సా.శ.575-600) ఈ రాజవంశం ప్రారంభపాలకుడు అని ధ్రువీకరించబడింది. ఆయన ఉజ్జయినిలో మంజూరు చేయబడిన శాసనం రాజవంశం తొలి ఎపిగ్రాఫికు వ్రాతపూర్వక ఆధారాలు లభించాయి.[6]

శకరగాన గుప్త చక్రవర్తి స్కందగుప్తుడు బిరుదులను స్వీకరించాడు. ఆయన గతంలో గుప్తుల అధికారం క్రింద ఉన్న పశ్చిమ మాళ్వాను జయించాడని ఇది సూచిస్తుంది. ఆయన రాజ్యంలో ప్రస్తుత గుజరాతులోని కొన్ని భాగాలు కూడా ఉన్నాయి.[6]

తన తండ్రిలాగే శంకరగాన తనను తాను పరమ-మహేశ్వరుడు (శివుని భక్తుడు) గా అభివర్ణించాడు.[6]

బుద్ధరాజు[మార్చు]

ప్రారంభ కలచురి రాజవంశం చివరి పాలకుడు బుద్ధరాజు. ఆతన శంకరగాన కుమారుడు.[6]బుద్ధరాజు తూర్పు మాళ్వాను జయించాడు. కాని ఆయన బహుశా పశ్చిమ మాళ్వాను వల్లభీ పాలకుడి చేతిలో ఓడిపోయాడు. తన పాలనలో చాళుక్య రాజు మంగలేషా సా.శ. 600 తరువాత కొంతకాలం దక్షిణాన కలచురి రాజ్యం మీద దాడి చేశాడు. బుద్ధరాజు సా.శ.609-610 (360 KE) విదిషా, సా.శ. 610-611 (361 KE) ఆనందపురా శాసనాల ద్వారా ఈ దాడి పూర్తి విజయం సాధించలేదని అంచనా వేయబడింది.[6] బుద్ధరాజు రెండవ చాళుక్య దండయాత్రలో (మంగలేషా, [7] లేదా ఆయన మేనల్లుడు రెండవ పులకేశి) తన సార్వభౌమత్వాన్ని కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్నారు.[6]మంగలేష కలచురిలను ఓడించాడని చాళుక్య శాసనాలు పేర్కొన్నాయి. కాని ఈ విజయాల ఘనతను పులకేశికి ఇవ్వలేదు; అందువలన చాంగూయ పాలకుడు మంగలేషా కలచురి అధికారాన్ని అంతం చేసాడని తెలుస్తోంది. [7]

తన తండ్రి, తాత వలె బుద్ధరాజు తనను తాను పరమ-మహేశ్వరుడు (శివుని భక్తుడు) గా అభివర్ణించాడు. ఆయన రాణి అనంత-మహాయి పశుపత వర్గానికి చెందినవారు.[6]

వారసులు[మార్చు]

బుద్ధరాజు వారసుల గురించి కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. కాని సా.శ. 687 నాటికి కలాచూరీలు చాళుక్యుల పాలెగాళ్ళు అయ్యారు.[6]

శంఖేద వద్ద తారాలస్వామి అనే యువరాజు జారీ చేసిన ఒక శాసనం కనుగొనబడింది (ఇక్కడ శంకరాగణ శాసనాలలో ఒకటి కూడా కనుగొనబడింది). ఈ శాసనం తారాలస్వామిని శివుని భక్తుడని, ఆయన తండ్రి మహారాజా నన్నను "కటచురి" కుటుంబ సభ్యుడిగా అభివర్ణించింది. ఈ శాసనం పేర్కొనబడని యుగం 346 సంవత్సరానికి చెందినది. ఆ యుగాన్ని కాలచురి శకం అని ఊహిస్తే, తారాలస్వామి శంకరగానకు సమకాలీనుడు. అయితే తారాలస్వామి నన్నా ఇతర కలచురి రికార్డులలో పేర్కొనబడలేదు. అలాగే ఇతర కలచురి శాసనాల మాదిరిగా కాకుండా ఈ శాసనం లోని తేదీని దశాంశ సంఖ్యలలో పేర్కొన్నారు. అంతేకాక శాసనం లోని కొన్ని వ్యక్తీకరణలు 7 వ శతాబ్దపు సెంద్రకా శాసనాల నుండి అరువు తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ సాక్ష్యాల కారణంగా వి. వి. మిరాషి తారాలస్వామి శాసనాన్ని నకిలీదిగా భావించారు.[8]

వి. వి. మిరాషి త్రిపురి కలచురిలను ప్రారంభ కలచురి రాజవంశంతో అనుసంధానించాడు. ప్రారంభ కలచురిలు తమ రాజధానిని మహిష్మతి నుండి కలంజారాకు, అక్కడి నుండి త్రిపురికి తరలించారని ఆయన సిద్ధాంతీకరించారు.[9]

సాంస్కృతిక కార్యక్రమాలు[మార్చు]

ఎలిఫెంటా గుహలు[మార్చు]

Elephanta Caves

ముంబై సమీపంలోని ఎలిఫెంటా ద్వీపంలో కొంకణ తీరం వెంట ఉన్న ఎలిఫెంటా గుహలు శైవ స్మారక చిహ్నాలను కలిగి ఉన్నాయి. ఈ స్మారక చిహ్నాలు కృష్ణరాజుతో (ఆయనను శవితుడు అని కూడా పేర్కొంటారు) సంబంధం కలిగి ఉన్నాయని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.[5]కలచురిలు నిర్మించిన కొన్ని ఎలిఫాంటా స్మారక కట్టడాలు వీరు కొంకణ తీరానికి పాలకులుగా ఉన్నట్లు తెలుస్తుంది.[5] కృష్ణరాజు వెండి నాణేలు కొంకణ తీరం వెంబడి, సల్సెటు ద్వీపంలో (ఇప్పుడు ముంబైలో భాగం), నాసికు జిల్లాలో కనుగొనబడ్డాయి.[5] ఆయన రాగి నాణేలలో సుమారు 31 ఎలిఫెంటా ద్వీపంలో కనుగొనబడ్డాయి. ఇది ఆయన ద్వీపంలోని ప్రధాన గుహ ఆలయానికి పోషకుడని సూచిస్తుంది.[4] నమిస్మాటిస్టు శోభన గోఖలే అభిప్రాయం ఆధారంగా ఈ తక్కువ-విలువైన నాణేలు గుహ తవ్వకాలలో పాల్గొన్న కార్మికుల వేతనాలు చెల్లించడానికి ఉపయోగించబడి ఉండవచ్చని భావిస్తున్నారు.[6]

ఎల్లోరా గుహలు[మార్చు]

ఎల్లోరా గుహ నం:29

ఎల్లోరాలోని బ్రాహ్మణ గుహలలో మొట్టమొదటిది కలచురి పాలనలో, బహుశా కలచురి పోషణలో నిర్మించినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు ఎల్లోరా కేవ్ నం 29 ఎలిఫెంటా గుహలతో నిర్మాణ, ఐకానోగ్రాఫికు సారూప్యతలను చూపిస్తుంది.[5] కేవ్ నెంబర్ 21 (రామేశ్వర) ముందు ఎల్లోరాలో లభించిన ప్రారంభకాల నాణెం కృష్ణరాజు జారీ చేసిందిగా గుర్తించబడుతుంది. [3]

పాలకులు[మార్చు]

మాళ్వా కలచురి రాజవంశం పాలకులు వారి పాలనాకాలం (బ్రాకెట్లలో పేర్లు) ఈ క్రిందివి:[10]

  • కృష్ణరాజు (కారజా), ఆర్. సి. సా.శ. 550-575
  • శంకరగాన (శంకరగాన), r. సి. సా.శ. 575-600
  • బుద్ధరాజు (బుద్ధరాజ), ఆర్. సి. సా.శ. 600-625

ఇవికూడా చూడండి[మార్చు]

  • కలచురి శకం, కలచురిలు కాలనిర్ణయానికి ఉపయోగించారు. అందుకని వారి పేరుతో పిలువబడింది.

మూలాలు[మార్చు]

జీవితచరిత్ర[మార్చు]

  • Charles Dillard Collins (1988). The Iconography and Ritual of Siva at Elephanta. SUNY Press. ISBN 9780887067730.
  • Durga Prasad Dikshit (1980). Political History of the Chālukyas of Badami. Abhinav. OCLC 8313041.
  • Geri Hockfield Malandra (1993). Unfolding A Mandala: The Buddhist Cave Temples at Ellora. SUNY Press. ISBN 9780791413555.
  • Ronald M. Davidson (2012). Indian Esoteric Buddhism: A Social History of the Tantric Movement. Columbia University Press. ISBN 9780231501026.
  • V. V. Mirashi (1974). Bhavabhuti. Motilal Banarsidass. ISBN 9788120811805.

అదనపు అధ్యయనాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]