కాండూరు నరసింహాచార్యులు
కాండూరు నరసింహాచార్యులు | |
---|---|
![]() | |
జననం | కాండూరు నరసింహాచార్యులు 1900 జూన్ 15 వనపర్తి, వనపర్తి జిల్లా, తెలంగాణ, |
మరణం | 1972 ఫిబ్రవరి 24 | (వయసు: 71)
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | కవి, రచయిత, ఆయుర్వేద వైద్యుడు. |
మతం | హిందూ |
తండ్రి | రామవాచార్యులు |
తల్లి | తిరువేంగడమ్మ |
కాండూరు నరసింహాచార్యులు (1900, జూన్ 15 - 1972, జనవరి 24) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, ఆయుర్వేద వైద్యుడు.[1]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]కాండూరు నరసింహాచార్యులు 1900, జూన్ 15న తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా లోని, వనపర్తిలో తిరువేంగడమ్మ, రామవాచార్యుల దంపతులకు జన్మించాడు. దురదృష్టవశాత్తు, తన ఆరేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి నెట్టబడింది. తల్లి భిక్షాటన చేస్తూ ఇద్దరు కుమారులను పోషించింది. పెద్ద కుమారుడికి విద్య అబ్బలేదు, కానీ తల్లి నరసింహాచార్యులను విద్యావంతుడిని చేయాలని నిశ్చయించుకుంది. నరసింహాచార్యులు కూడా విద్యపై మక్కువతో 1915 నుండి 1928 వరకు ప్రొద్దుటూరు, మద్రాసు, మైసూరు, బెంగళూరులోని కళాశాలల్లో సంస్కృతం, ఆంధ్ర భాషలను అభ్యసించాడు.[2]
ఉపాధ్యాయ వృత్తి
[మార్చు]నరసింహాచార్యులు 1926 నుండి 1955 వరకు కడప జిల్లా, జమ్మలమడుగు పి.ఆర్. బోర్డు హైస్కూలులో ప్రధానాంధ్ర పండితులుగా పనిచేశాడు.[3]
ముఖ్య రచనలు
[మార్చు]నరసింహాచార్యులు అనేక గ్రంథాలు రచించాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:[4]
- ఇడ్లి మహా ప్రబంధము: ఇది వారి ముఖ్య రచనలలో ఒకటి.
- హర్షుడు - భీష్ముడు: ఈ రెండు రచనలు విద్యార్థులకు ఉపవాచకాలుగా ఉండేవి.
- రంగనాథ శతకము
- కావ్య ప్రకాశ వివరణము
- సాహిత్య విచార చంద్రిక
- సందేశము
- చంద్రా పీరుడు
- కలభాషిణీ చరిత్ర
- ప్రారంభ వ్యాకరణము
- మహాశ్వేత-పరివర్తనము: ఇది అముద్రిత నవల.
మరణం
[మార్చు]నరసింహాచార్యులు తన 72 ఏళ్ల వయసులో 1972, జనవరి 24న జమ్మలమడుగులో మరణించారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ 2.0 2.1 కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).