కృష్ణ మండపం, మహాబలిపురం

కృష్ణ మండపం, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా బంగాళాఖాతం కోరమండల్ తీరంలో మహాబలిపురం వద్ద ఉన్న గుహ దేవాలయం.[1] ఇది శ్రీకృష్ణుడుకి అంకితం చేయబడినది.[2] [3][4][5] ఇది పల్లవ కాలం 7వ శతాబ్దం నాటిది. మహాబలిపురంలోని స్మారక చిహ్నాల సమూహంలో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1984లో గుర్తించబడింది.[6] [7]
లేఅవుట్
[మార్చు]ఇది తమిళనాడులోని మహాబలిపురం వద్ద కోరమాండల్ తీరంలో ఉంది. ఒకప్పుడు బహిరంగంగా ఉన్న ఈ కళారూపాలు, 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కాలంలో మండపంగా మార్చబడింది. తూర్పు ముఖంగా ఉన్న ఈ భవనం 29 అడుగుల (8.8 మీటర్లు) పొడవు, 12 అడుగుల (3.7 మీటర్లు) ఎత్తు కలిగి ఉంది. ఇది స్తంభాలతో కూడిన మండపం. గోవర్ధన గిరిని ఎత్తిన కృష్ణుడు, గోపికలతో ఉన్న కృష్ణుడి దృశ్యాలు వంటివి ఇందులో చెక్కబడ్డాయి. ఇది రాతితో చెక్కబడిన అతిపెద్ద గుహ దేవాలయాలలో ఒకటి.
శిల్పం
[మార్చు]ఈ నిర్మాణం రాతి ఉపరితలాలపై చెక్కబడిన తొమ్మిది శిల్పకళారూపాలు ఉన్నాయి. ఇవన్నీ 7వ శతాబ్దానికి చెందినవి, కానీ 16వ శతాబ్దంలో చేసిన చేర్పులతో మరింత పునరుద్ధరించబడ్డాయి.
ఇంద్రుడు కురిపించిన వర్షాల వల్ల కలిగే వరద నుండి ప్రజలను రక్షించడానికి కృష్ణుడు తన ఎడమ చేతి వేలుపై గోవర్ధను కొండను ఎత్తడం ఒక ప్రముఖ కళారూపం. ప్రజలు తమ పశువులతో కొండ కింద ఆశ్రయం పొందుతున్నట్లు చూపించారు. ఈ వర్ణనకు సంబంధించిన కథ ఇంద్రునితో ముడిపడి ఉంది. ఇంద్రుడు తన గౌరవార్థం ఒక పండుగను జరుపుకోవడాన్ని నిలిపివేసినందున గ్రామ ప్రజలపై (ఇప్పుడు మధుర) కోపంగా ఉన్నాడు. అతను భారీ వర్షాలతో భారీ తుఫానును సృష్టించి, గ్రామస్తుల ప్రాణాలకు ముప్పు కలిగించాడు. అదే గ్రామానికి చెందిన కృష్ణుడు, గోవర్ధన కొండను (మధురకు సమీపంలో) పైకి ఎత్తాడు. గ్రామాన్ని, గ్రామ ప్రజలను, పశువుల కాపరులను రక్షించడానికి ఒక గొడుగును సృష్టించాడు. ఈ కళారూపంలో, కృష్ణుడు తన కుడి వైపున ముగ్గురు స్త్రీలు ఉంటారు, వారిలో ఒకరు రాధ, అతని చిన్ననాటి ప్రేమికురాలు అని ఊహించబడింది, ఆమె కిరీట మకుటం, అనేక ఆభరణాలు ధరించి ఉన్నట్లు చూపబడింది. అతని కుడి వైపున ఆద్దరు ఉన్నారు, ఒక పురుషుడు, ఒక స్త్రీ. అదనంగా, జంతువులు, గ్రామీణ జానపద నేపధ్యంలో అనేక ఇతర చిత్రాలు ఉన్నాయి.[8]
మరొక శిల్పకళారూపంలో, కృష్ణుడు తన గోపికలతో సంతోషకరమైన స్థితిలో ఉన్నట్లు చూపబడింది. ఇది దైవిక జీవిగా తన ద్విపాత్రాభినయంనకు ప్రతిబింబం.[8][9][10]
గుహ గోడలపై చెక్కబడిన ఇతర శిల్పాలలో, ఒక వృద్ధుడు తన భుజాలపై ఒక బిడ్డను మోసుకెళ్తున్నప్పుడు, ఒక గ్రామ దృశ్యం, పశువుల కాపరులు ఆవును పాలు పట్టించుకుంటూ, ఆవుదూడ, గోపికలు తలపై నీటి కుండలతో, ఒక పశువుకుట్టువు వేణువు వాయిస్తూ, ఒక వడ్రంగిపిట్ట, ఒక మహిళ పాల కుండ, గడ్డి కట్టను మోసుకొని, ఒక బిడ్డ తన తల్లిని కౌగిలించుకుంటున్నట్టు.. మొదలైనవి ఉన్నాయి.[8] కృష్ణుడి కుడ్యచిత్రంలో అతను పొలాల్లో వేణువు వాయిస్తున్నట్లు చూపిస్తుంది. ఈ ప్యానెల్ ఇంకా నిలబడి ఉన్న ఎద్దుని వర్ణిస్తుంది, దీనిని పల్లవ కళాకారులు సంపూర్ణంగా చెక్కారు. ముఖ్యంగా, కృష్ణ గుహలోని చెక్కడాలు హిందూ ఇతిహాసాల నుండి ఇతివృత్తాలను చాలా వాస్తవిక పునర్వ్యాఖ్యానాలుగా నివేదించబడ్డాయి.
మూలాలు
[మార్చు]- ↑ Tourist Guide to Tamil Nadu. India: Sura Books. p. 28.
- ↑ "General view of the entrance to the Varaha Cave Temple, Mamallapuram". British Library. Archived from the original on 21 May 2011. Retrieved 2008-11-18.
- ↑ Tourist Guide to Tamil Nadu. India: Sura Books. p. 28.
- ↑ Bruyn, Pippa de; Bain, Keith; Allardice, David; Shonar Joshi (18 February 2010). Frommer's India. John Wiley & Sons. p. 335. ISBN 978-0-470-64580-2. Retrieved 7 February 2013.
- ↑ "General view of the entrance to the Krishna Mandapa, Mamallapuram". Online Gallery of British Library. Archived from the original on 18 May 2015. Retrieved 22 February 2013.
- ↑ "Group of Monuments at Mahabalipuram". World Heritage. Retrieved 2007-02-08.
- ↑ Michell, George (1977). The Hindu Temple: An Introduction to Its Meaning and Forms. University of Chicago Press. pp. 81–. ISBN 978-0-226-53230-1. Retrieved 7 February 2013.
- ↑ 8.0 8.1 8.2 "World Heritage Sites – Mahabalipuram – Monolithic Temples". Archaeological Survey of India. Archived from the original on 12 March 2013. Retrieved 23 February 2013.
- ↑ "General view of the entrance to the Krishna Mandapa, Mamallapuram". Online Gallery of British Library. Archived from the original on 18 May 2015. Retrieved 23 October 2012.
- ↑ Tourist Guide to Tamil Nadu. India: Sura Books. p. 28.