కొవ్వూరు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొవ్వూరు పురపాలక సంఘం
కొవ్వూరు
స్థాపన1965
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
కందుకూరు
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

కొవ్వూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని, కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

కొవ్వూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 200 కి.మీ దూరంలో ఉంది. పూర్వం గోవూరుగా ఉండేది.కాలక్రమంలో అది కొవ్వూరుగా మారింది. గోవు సంచరించిన ప్రాంతం కాబట్టి, గోవూరు అయింది.1965 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 23 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 39,667 జనాభా ఉండగా అందులో పురుషులు 19,244, మహిళలు 20,423 మంది ఉన్నారు.అక్షరాస్యత 82.14% ఉండగా అందులో పురుష జనాభాలో 86.12%, స్త్రీ జనాభాలో 78.41% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3768 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 10,919 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా సూరపనేని సూర్య భాస్కర రామమోహన్ పనిచేస్తున్నాడు.[2] వైస్ చైర్మన్‌గా దుడ్డుపూడి రాజా రమేష్ పనిచేస్తున్నాడు.[2]

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 21064 గృహాల ఉన్నారు.15 రెవెన్యూ వార్డులు,23 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ పురపాలక సంఘంలో 23 మురికివాడలు ఉండగా అందులో 25719 జనాభా ఉన్నారు. 1 ప్రభుత్వ ఆసుపత్రి,28 ప్రభుత్వ పాఠశాలు,1 ఉన్నత పాఠశాలలు, 14 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Kovvur Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-29.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]