కోట్ల వెంకటేశ్వరరెడ్డి
స్వరూపం
| కోట్ల వెంకటేశ్వరరెడ్డి | |
|---|---|
| జననం | కోట్ల వెంకటేశ్వరరెడ్డి |
| నివాస ప్రాంతం | మహబూబ్ నగర్ |
| వృత్తి | ఉపాధ్యాయుడు |
| ప్రసిద్ధి | కవి |
| మతం | హిందూ |
కోట్ల వెంకటేశ్వరరెడ్డి తెలుగు కవి మరియు రచయిత.
జీవిత విశేషాలు
ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. జలజం సత్యనారాయణతో కలిసి తెలంగాణ రచయితల వేదికకు జిల్లా బాధ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. నానీల రచనలో వీరిది అందెవేసిన చెయ్యి. "నూరు తెలంగాణ నానీలు", "నాన్నా! నాలా ఎదుగు" , "మనిషెల్లిపోతుండు", "గుండె కింద తడి", రహస్యాలు లేని వాళ్ళు, రంగు వెలసిన జెండా వంటి కవితా సంకలనాలు వెలువరించాడు[1], నాలుగు సార్లు రంజని-కుందుర్తి అవార్డ్ అందుకున్నాడు. సమతా రచయితల సంఘం వారి ఉత్తమ కవితా సంపుటి అవార్డును 1998లో అందుకున్నారు.
రచనలు
- నూరు తెలంగాణ నానీలు (నానీలు)
- నాన్నా! నాలా ఎదుగు (దీర్ఘ కవిత)
- మనిషెల్లిపోతుండు (వచన కవితలు)
- గుండె కింద తడి (వచన కవితలు)
- రహస్యాలు లేని వాళ్ళు (వచన కవితలు)
- రంగు వెలసిన జెండా (వచన కవితలు)
పురస్కారాలు
ఆయనకు పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం 2014 సంవత్సర కీర్తి పురస్కారం "వివిధ ప్రక్రియలు" విభాగంలో వచ్చినది.[2]
మూలాలు
- ↑ పాలమూరు కవిత, సంపాదకులు. భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితీ ప్రచురణ -2004, కవి జీవితాలు, పుట-163
- ↑ ప్రతిభామూర్తులకు కీర్తి పురస్కారాలు
