Coordinates: 16°22′45″N 80°50′11″E / 16.379127°N 80.836337°E / 16.379127; 80.836337

గండిగుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గండిగుంట
—  రెవెన్యూయేతర గ్రామం  —
గండిగుంట is located in Andhra Pradesh
గండిగుంట
గండిగుంట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°22′45″N 80°50′11″E / 16.379127°N 80.836337°E / 16.379127; 80.836337
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం వుయ్యూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ గుండె రాంబాబు
పిన్ కోడ్ 521165
ఎస్.టి.డి కోడ్ 08676

గండిగుంట, కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తులో ఉంది

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, విజయవాడ, తెనాలి, మంగళగిరి

ప్రముఖులు[మార్చు]

దండమూడి రాజగోపాలరావు - భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు. సినిమా నటుడు

గ్రామ విశేషాలు[మార్చు]

  • "గండిగుంట" అది నిర్మలమైన గ్రామం. అక్కడ పచ్చని పొలాలు, తేట తేట చెరువులు, అహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది.
  • ఈ గ్రామానికి చెందిన దండమూడి ప్రసాదరావు 45 సంవత్సరాలనుండి పశుపోషకులు. ఇతను వరుసగా 10 సంవత్సరాల నుండి, గండిగుంట పాలకేంద్రంలో అత్యధికంగా పాలు సరఫరా చేసే పాల ఉత్పత్తిదారుగా, కృష్ణా జిల్లా పాలసంఘం అందించు ప్రోత్సాహక బహుమతులు అందుకుంటున్నాడు.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వుయ్యూరు, మానికొండ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 33 కి.మీ.దూరంలో ఉంది.

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, కాకానినగర్. రవీంద్రభారతి స్కూల్, నారాయణ టెక్నో ప్రాథమిక పాఠశాల, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, ఉయ్యూరు

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

వ్యవసాయ మార్కెట్ యార్డ్.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సంగాని నాగకుమారి, సర్పంచిగా ఎన్నికైంది.[2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం స్థానిక ఎన్.టి.ఆర్.సర్కిల్ సమీపంలో ఉంది.

శ్రీ దత్త దేవాలయం[మార్చు]

ఈ దేవాలయంలో, శ్రీ అనఘాసమేత దత్తదిగంబరస్వామి కొలువై యున్నారు. 19-11-2013 మంగళవారం నాడు స్వామి జయంతిని పురస్కరించుకొని ఆలయంలో వివిధ పూజలు నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవం, గోపూజ అనంతరం, లక్ష తులసి దళార్చనతో, దత్తాత్రేయునికి అర్చన చేశారు. లోకకళ్యాణార్ధం హోమం నిర్వహించారు. అన్నసమారాధన చేశారు.[3]

ఈ క్షేత్రం ఏర్పడి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా, 2016, జనవరి-9వ తేదీ శనివారంనాడు, మహాసంప్రోక్షణ-బ్రహ్మ కలశాభిషేకం, వేదపారాయణం, హోమాలు నిర్వహించారు.

శ్రీ అయ్యప్పస్వామి దేవస్థానం[మార్చు]

ఈ దేవస్థానంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, 2007 నుండి మాలలు ధరించిన అయ్యప్ప దీక్షాపరులకు ఉచిత అన్నసమారాధన కార్యక్రమం, బహు నియమనిష్ఠలతో జరుగుచున్నది. ఈ కార్యక్రమం ప్రతిసంవత్సరం నవంబరు 21 నుండి జనవరి 10 వరకూ జరుగుతుంది. ప్రతి రోజూ, ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాలకు చెందిన 500 మంది అయ్యప్ప దీక్షాపరులు ఇక్కడ భోజనం చేస్తున్నారు. దీనికి దాతల సహకారం మరువలేనిది.[4]

ఈ ఆలయంలో ఉపాలయంగా శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం ఉంది.[5]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, 2017, ఆగస్టు-12వతేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు.[6]

మూలాలు[మార్చు]

  1. http://www.imdb.com/title/tt0263778/
  2. ఈనాడు విజయవాడ/పెనమలూరు:- 25, జులై-2013.6వ పేజీ.
  3. ఈనాడు విజయవాడ/పెనమలూరు, 20 నవంబర్, 2013. 1వ పేజీ.
  4. ఈనాడు కృష్ణా/పెనమలూరు; 5,డిసెంబరు,2013. 2వ పేజీ.
  5. ఈనాడు విజయవాడ, 30 నవంబర్ 2013.9వపేజీ.
  6. ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,ఆగష్టు-13; 1వపేజీ.

వెలుపలిలింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గండిగుంట&oldid=4130564" నుండి వెలికితీశారు