గర్భరక్షాంబికా దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గర్భరక్షాంబికా దేవి[మార్చు]

గర్భరక్షాంబిక దేవి సాక్షాత్ ఆదిశక్తి అయినటువంటి పార్వతి దేవి. స్త్రీల గర్భంలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టి వారికి సంతానాన్ని ఇచ్చే అమ్మవారు. సంతానం లేక బాధపడే స్త్రీలతో పాటు గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు ఆమెను పూజిస్తారు.అమ్మవారి ఆశీస్సులు పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు.

గర్భరక్షాంబికా ఆలయం​[మార్చు]

గర్భరక్షాంబికా దేవి ఆలయం తిరుకరుకావూరులో ఉంది. తిరుకరుకావూరు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోలో ఉంది. ఇది తంజావూరు లేదా కుంభకోణం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
గర్భరక్షాంబికా దేవి దేవాలయాన్ని దర్శించుకోవాలని కునే భక్తులు ముందుగా తంజావూరు లేదా కుంభకోణం రైలు మార్గంలో చేరుకొని అక్కడి నుండి బస్సు మార్గంలో తిరుకరుకావూరు లోని గర్భరక్షాంబికా దేవి ఆలయాన్ని చేరుకుంటారు.

గర్భరక్షాంబికా దేవి పూజా విధానం[మార్చు]

గర్భ సంబంధమైన ఇబ్బందులకు గర్భం దాల్చే సమస్యలను ఎదుర్కొంటుంటే, మీరు ఈ గర్భరక్షాంబికా ఆలయంలో పదకొండు ఆవు నెయ్యి దీపాలను వెలిగించాలి. గుడిలో పూజా మందిరానికి పూజలు చేసి అమ్మవారిని ప్రార్థించాలి. దేవాలయాల్లో ఆవు నెయ్యి ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకెళ్లాలి. ఇంటికి రాగానే ఇద్దరూ 48 రోజుల పాటు పడుకునే ముందు ఒక చెంచా ఆవు నెయ్యి ప్రసాదం తినాలి.

సుఖ ప్రసవం కొరకు సాఫీగా ప్రసవం, ఆరోగ్యవంతమైన పిల్లలు ఉండేలా ఆముదం ఇక్కడ ప్రసాదంగా అందించబడుతుంది. గర్భిణీ స్త్రీలు లేదా వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన ఏడు నెలల తర్వాత నడుము కింది భాగంలో ఈ ఆముదం రాయాలి. దీనివలన సుఖప్రసవం కలిగి, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.[1]

గర్భరక్షాంబికా చరిత్ర[మార్చు]


పూర్వం మల్లవనం అనే మల్లెల వనంలో గౌతమ మహర్షి, గార్గేయుడు తపస్సు చేశారు. ఈ ఋషులు నిధ్రువ, వెదికాయి వారి పిల్లల సమస్య గురించి సలహా ఇచ్చారు. ఋషులు గర్భరక్షాంబికా దేవిని ప్రార్థించమని చెప్పారు,, వారు అలా చేయడంతో, వేదికై గర్భవతి అయింది.

ఇంతలో ఊర్ధ్వపాద మహర్షి వారి ఇంటికి వచ్చాడు. మహర్షి వెదికాయి పిలిచాడు.కానీ గర్భము వలన నీరస చెంది మహర్షి మాటలు వినలేకపోయింది. మహర్షి ఆమె గర్వంగా ఉందని భావించి స్పందించకపోవటంతో ఆమెకు గర్భస్రావం జరగాలని శపించాడు. తనకు గర్భస్రావం జరగబోతోందని గ్రహించిన వేదికై దేవి గర్భరక్షాంబికను తీవ్ర విచారంతో ప్రార్థించింది. అప్పుడు గర్భరక్షాంబికా దేవి ప్రత్యక్షమై పిండాన్ని ఒక కుండలో ఉంచి రక్షించింది. కొంతకాలానికి ఆ పిండము మగ శిశువుగా కుండలోనే జన్మించెను. ఆ పిల్లవానికి నైదురువన్ అని పేరు పెట్టారు.

నైదురువన్ కు తల్లిపాలు లేకపోవడంతో వెదికాయి గర్భరక్షాంబికా దేవిని ప్రార్థించెను. అప్పుడు అమ్మవారు కామధేనువును పంపెను. ఆ కామదేనువు గుడి ముందు పాదాలతో భూమిని తవ్వింది. అప్పుడు ఒక పాల కుండ ఏర్పడింది. దానినే క్షీరకుండము అని పిలుస్తారు. ఇప్పటికీ గర్భరక్షాంబికా దేవి ఆలయం ముందు ఈ కుండములు చూడవచ్చు. ఆ మల్లెవనం అనే ప్రాంతమే తిరుకరుకావూరుగా మారింది. [2]

గర్భరక్షాంబికా స్తోత్రం[మార్చు]

శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ ||

వాపీతటే వామభాగే, వామదేవస్య దేవస్య దేవి స్థితా త్వమ్ |
మాన్యా వరేణ్యా వదాన్యా, పాహి గర్భస్థజంతూన్ తథా భక్తలోకాన్ || 1 ||

శ్రీగర్భరక్షాపురే యా, దివ్యసౌందర్యయుక్తా సుమాంగళ్యగాత్రీ |
ధాత్రీ జనిత్రీ జనానాం, దివ్యరూపాం దయార్ద్రాం మనోజ్ఞాం భజే త్వామ్ || 2 ||

ఆషాఢమాసే సుపుణ్యే, శుక్రవారే సుగంధేన గంధేన లిప్తా |
దివ్యాంబరాకల్పవేషా, వాజపేయాదియాగస్థభక్తైః సుదృష్టా || 3 ||

కల్యాణదాత్రీం నమస్యే, వేదికాఢ్యస్త్రియా గర్భరక్షాకరీం త్వామ్ |
బాలైస్సదా సేవితాంఘ్రిం, గర్భరక్షార్థమారాదుపేతైరుపేతామ్ || 4 ||

బ్రహ్మోత్సవే విప్రవీథ్యాం, వాద్యఘోషేణ తుష్టాం రథే సన్నివిష్టామ్ |
సర్వార్థదాత్రీం భజేఽహం, దేవవృందైరపీడ్యాం జగన్మాతరం త్వామ్ || 5 ||

ఏతత్ కృతం స్తోత్రరత్నం, దీక్షితానంతరామేణ దేవ్యాశ్చ తుష్ట్యై |
నిత్యం పఠేద్యస్తు భక్త్యా, పుత్రపౌత్రాది భాగ్యం భవేత్తస్య నిత్యమ్ || 6 ||
[3]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "గర్భరక్షాంబికా దేవి పూజా విధానం". Archived from the original on 2022-08-31. Retrieved 2022-08-31.
  2. గర్భరక్షాంబికా చరిత్ర
  3. గర్భరక్షాంబికా స్తోత్రం