Jump to content

గాంబియా నది

Coordinates: 13°28′N 16°34′W / 13.467°N 16.567°W / 13.467; -16.567
వికీపీడియా నుండి
గాంబియా నది
గాంబియా నది పరివాహక ప్రాంత పటం
పటం
స్థానం
దేశాలు
భౌతిక లక్షణాలు
మూలంఫుటా జల్లోన్
 • స్థానంలాబే, గినియా
 • అక్షాంశరేఖాంశాలు11°24′43″N 12°13′34″W / 11.412°N 12.226°W / 11.412; -12.226
 • ఎత్తు795 m (2,608 ft)
సముద్రాన్ని చేరే ప్రదేశంఅట్లాంటిక్ మహాసముద్రం
 • స్థానం
బాంజుల్, గాంబియా
 • అక్షాంశరేఖాంశాలు
13°28′N 16°34′W / 13.467°N 16.567°W / 13.467; -16.567
 • ఎత్తు
0 m (0 ft)

గాంబియా నది (పూర్వంలో గాంబ్రా నదిగా పిలువబడేది) పశ్చిమ ఆఫ్రికాలోని ఒక ప్రధాన నది. ఇది ఉత్తర గినియాలోని ఫుటా జల్లోన్ పీఠభూమి నుండి ప్రారంభమై, సెనెగల్, గాంబియా గుండా పశ్చిమ దిశగా ప్రవహించి, బాంజుల్ నగర సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1120 కి.మీ. ఈ నది దాదాపు సగం పొడవు వరకు నౌకాయానానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ నది గాంబియా దేశంతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ఆఫ్రికా ఖండ ప్రధాన భూభాగంలోని అతి చిన్న దేశమైన గాంబియా, ఈ నది దిగువ సగభాగాన్ని, దాని ఇరువైపుల తీరాలను ఆక్రమించి ఉంది.

భౌగోళికం

[మార్చు]

గాంబియా నది మొత్తం 1120 కి.మీ పొడవు కలిగి ఉంది. ఫుటా జల్లోన్ నుండి ఇది వాయవ్య దిశగా సెనెగల్లోని టాంబాకుండా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. అక్కడ ఇది నియోకోలో - కోబా నేషనల్ పార్కు గుండా ప్రవహిస్తుంది. అనంతరం నియెరి కో, కౌలొంతౌ నదులు ఇందులో కలుస్తాయి. తరువాత బర్రాకుండా జలపాతాలును దాటి, కోయినా వద్ద గాంబియాలోకి ప్రవేశిస్తుంది.

ఈ దశలో నది సాధారణంగా పశ్చిమ దిశగా ప్రవహించినప్పటికీ, అనేక మెలికలతో కూడిన మార్గాన్ని అనుసరిస్తుంది. ఇందులో అనేక ఆక్స్‌బో సరస్సులు ఏర్పడతాయి. నది ముఖద్వారం నుండి సుమారు 100 కి.మీ దూరంలో ఇది క్రమంగా వెడల్పు పెరిగి, సముద్రాన్ని చేరే సమయానికి 10 కి.మీ కంటే ఎక్కువ వెడల్పును సంతరించుకుంటుంది.

నది దాటే మార్గాలు

[మార్చు]

ఈ నదిపై అనేక వంతెనలు నిర్మించబడ్డాయి. వాటిలో అతిపెద్దదీ, నది ముఖద్వారానికి అత్యంత సమీపంగా ఉన్నదీ సెనెగాంబియా వంతెన. ఇది గాంబియాలోని ఫరాఫెన్నీ, సోమా పట్టణాల మధ్య ఉంది. 2019 జనవరిలో ప్రారంభమైన ఈ వంతెన, నది ఉత్తర, దక్షిణ తీరాలపై ఉన్న ట్రాన్స్ - గాంబియా హైవే భాగాలను అనుసంధానిస్తుంది. అలాగే, సెనెగల్‌కు చెందిన ఒంటరిగానున్న కాసామాన్స్ ప్రావిన్స్‌కు వెళ్లే, అక్కడి నుండి వచ్చే సరకు రవాణా వాహనాలకు వేగవంతమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ వంతెన పొడవు 1.9 కి.మీ. ఇది అంతకుముందు ఉపయోగించిన విశ్వసనీయత తక్కువైన వాహన ఫెర్రీ స్థానాన్ని భర్తీ చేసింది. వాహనాల దాటుదలపై టోల్ వసూలు చేస్తారు. అదనంగా, గాంబియాలోని ఎగువ నది ప్రాంతంలో బాసే సాంటా సు, ఫటోటో వద్ద 2021 అక్టోబరులో ప్రారంభమైన వంతెనలు ఉన్నాయి.[2] అలాగే సెనెగల్‌లో గౌలూమ్బూ వద్ద కూడా ఒక వంతెన ఉంది. ఇతర అన్ని దాటుదలలు ఫెర్రీల ద్వారా నిర్వహించబడతాయి. ముఖ్యంగా నది ముఖద్వారం వద్ద బాంజుల్, బర్రా మధ్య ప్రధాన ఫెర్రీ సేవ నడుస్తుంది. కొన్నిచోట్ల చిన్న పడవలను కూడా ఉపయోగిస్తారు.

బొలాంగ్‌లు

[మార్చు]

నది దిగువ భాగంలోని చిన్న ఉపనదులను సాధారణంగా బొలాంగ్‌లు లేదా బొలాన్‌లు అని పిలుస్తారు. వీటిలో మధ్య నది విభాగం, ఎగువ నది విభాగం ఉత్తర భాగాలను విడదీసే సామి బొలాంగ్, దిగువ నది విభాగంను పశ్చిమ తీర విభాగం నుండి వేరు చేసే బింటాంగ్ బొలాంగ్ ఉన్నాయి. అలాగే సోఫాంకామా, జురుంకు, కూటాంగ్, నియాంజి, సాండుగు వంటి చిన్న జలప్రవాహాలు కూడా ఈ వర్గంలోకి వస్తాయి.[3]

చరిత్ర

[మార్చు]

గాంబియా నది పరివాహక ప్రాంతంలో నివసించిన తొలి ప్రజలలో జోలా, బలాంతే, బైనుక్,, మంజాక్ ప్రజలు ఉన్నారు.[4] క్రీస్తుపూర్వ 5వ శతాబ్దంలో కార్తేజ్ కు చెందిన అన్వేషకుడు హాన్నో ది నావిగేటర్ తన సముద్రయాన సమయంలో గాంబియా ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని భావిస్తారు.[5]

మౌఖిక సంప్రదాయం ప్రకారం, మాలి నుండి పెద్ద సంఖ్యలో మండింకా వలసదారులు, సుండియాటాకు చెందిన ప్రముఖ సేనాధిపతులలో ఒకరైన తిరామఖాన్ ట్రావోరే నాయకత్వంలో, 14వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి వచ్చారు. అయితే కొందరు ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ప్రధానంగా జులా వ్యాపారుల రూపంలో కొద్దిమంది వలసదారులే వచ్చారు. వీరి ప్రభావంతో సమాజంలో క్రమంగా సాంస్కృతిక మార్పులు చోటుచేసుకుని, ఉన్నత ప్రతిష్ఠ కలిగిన మండింకా జాతితో, పాలక మాలి సామ్రాజ్యంతో తమను అనుసంధానించుకునే ప్రక్రియ ఏర్పడింది.[6][7]జులా వ్యాపారులు గాంబియాను విశాలమైన పశ్చిమ ఆఫ్రికా వాణిజ్య జాలంలో ఒక ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ వాణిజ్య మార్గాల ద్వారా ఉప్పు, సముద్రపు గుల్లలు, ఇనుము, వస్త్రాలు, దంతాలు, తేనెమొమ, బంగారం, బానిసలు, తోలు తదితర వస్తువులు నైజర్ నది వరకు, దానికంటే దూర ప్రాంతాలకు మార్పిడి చేయబడేవి.[8][9] వెనిస్కు చెందిన అన్వేషకుడు అల్విజే కాదమోస్తో, పోర్చుగల్ తరఫున పనిచేస్తూ, 1455లో గాంబియా నదికి చేరుకున్న తొలి యూరోపియన్‌గా గుర్తించబడుతున్నాడు. అతడు ఈ నదిని గాంబ్రా లేదా కాంబ్రా అని పిలిచాడు. ఆ కాలంలోని ఇతర ఆధారాల్లో గువాంబియా, గువాబు, గాంబు వంటి పేర్లు కూడా కనిపిస్తాయి. ఇవి ఆ సమయంలో లేదా తరువాత చరిత్ర రచనలో నది పేరు, కాబూ రాజ్యం పేర్ల కలయిక వల్ల ఏర్పడి ఉండవచ్చు.[10]

కాదమోస్తో తర్వాత రెండు శతాబ్దాలపాటు వివిధ యూరోపియన్ దేశాల వ్యాపారులు గాంబియా నదిపై వాణిజ్యం కొనసాగించారు. అయితే శాశ్వత స్థావరాన్ని మొదటగా స్థాపించిన వారు కౌర్లాండ్, సెమిగాలియా డచీ. వారు 1651లో ప్రస్తుతం కుంటా కింటె ద్వీపంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో, తమకు తెలిసిన పేరైన సెయింట్ ఆండ్రూస్ ద్వీపంలో స్థావరం ఏర్పాటు చేశారు. 1661లో ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని 'సెయింట్ జేమ్స్' అని పేరు మార్చిన ఇంగ్లాండ్, తదుపరి దాదాపు నూరన్నర సంవత్సరాలపాటు నదిపై వాణిజ్య ఆధిపత్యం కోసం ఫ్రాన్స్‌తో పోటీ పడింది.[11]

ఈ కాలంలో గాంబియా నది పరిసర ప్రాంతాలలో ఉన్న రాజ్యాలలో నియూమి (ప్రస్తుతం బర్రా), నియాని రాజ్యం, కాంటోరా, జిమారా, కియాంగ్, బడిబు, ఫులాడు, తుమానా,, వులి రాజ్యం ముఖ్యమైనవి. వీటి పేర్లు నేటి గాంబియాలోని అనేక జిల్లాలకు పెట్టబడ్డాయి. నది తీరంలోని లేదా సమీపంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో బర్రా, ఆల్బ్రెడా, జుఫురె, జేమ్స్ ద్వీపం (ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం), టెండాబా, జోర్, మ్యాకార్తీ ద్వీపం, ఫట్టాటెండా, సుటుకోబా ఉన్నాయి.

18వ శతాబ్ద ప్రారంభకాలంలో స్కాటిష్ అన్వేషకుడు ముంగో పార్క్ నైజర్ నది వైపు తన యాత్రల సందర్భంగా గాంబియా నదిని రెండు సార్లు పైప్రవాహ దిశగా అనుసరించాడు.[12] 1889లో కుదిరిన ఆంగ్లో-ఫ్రెంచ్ కన్వెన్షన్ ప్రకారం గాంబియా రక్షిత ప్రాంతం, సెనెగల్ వలసప్రాంతాల మధ్య సరిహద్దులు నిర్ణయించబడ్డాయి. ఈ సరిహద్దులు యార్బుటెండా (ప్రస్తుత కోయినా సమీపం) వరకు నది ఉత్తర, దక్షిణ దిశల్లో తలా పది కిలోమీటర్ల దూరంలో నిర్ణయించబడ్డాయి. తూర్పు సరిహద్దు పట్టణ కేంద్రం నుండి 10 కిలోమీటర్ల వ్యాసార్థంతో నిర్ణయించబడింది.[13] ఈ విధంగా సముద్ర నౌకలు ప్రయాణించగలంత వరకు నది మీద బ్రిటిష్ నియంత్రణ నెలకొంది. ఆ సమయంలో ఈ సరిహద్దులు తాత్కాలికమని భావించినప్పటికీ, 1889లో నిర్ణయించిన అవే సరిహద్దులు నేటికీ అమలులో ఉన్నాయి.[14]

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

గాంబియా నది పరివాహక ప్రాంతంలోని జలజంతుజాలం సెనెగల్ నది పరివాహక ప్రాంతంలోని జలజీవులతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉంది. అందువల్ల ఈ రెండు ప్రాంతాలను సాధారణంగా సెనెగల్–గాంబియా పరివాహక ప్రాంతాలు అనే ఒకే పర్యావరణ ప్రాంతంగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో జాతి వైవిధ్యం మితమైన స్థాయిలో ఉన్నప్పటికీ, కప్పలలో కేవలం మూడు జాతులు, చేపలలో ఒకే ఒక్క జాతి మాత్రమే ఈ పర్యావరణ ప్రాంతానికి స్థానికంగా పరిమితమైనవి.[15] గాంబియా నదిలోని ఓయిస్టర్లను మహిళలు సేకరిస్తారు. వీటిని ఉపయోగించి ఓయిస్టర్ స్ట్యూ అనే సాంప్రదాయ వంటకాన్ని తయారు చేస్తారు. ఇది గాంబియా వంటకాల్లో ఒక ముఖ్యమైన పదార్థంగా పరిగణించబడుతుంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Gambia River". Encyclopædia Britannica. Retrieved 30 October 2016.
  2. Ma, Jianchun (13 Oct 2021). "Building the Friendship Bridges towards a Shared Future of China and The Gambia". The Point. Retrieved 3 August 2022.
  3. Gailey.
  4. Buhnen, 49.
  5. "Kunta Kinteh Island and Related Sites". UNESCO World Heritage Centre. United Nations Educational, Scientific, and Cultural Organization. Accessed 14/8/22.
  6. Wright, "Beyond Migration", 385.
  7. Buhnen, 51.
  8. Wright, "Darbo Jula", 33.
  9. Van Hoven.
  10. Buhnen, 71.
  11. Gailey, 3.
  12. Capt. Washington. "Some Account of Mohammedu-Siseï, a Mandingo, of Nyáni-Marú on the Gambia." The Journal of the Royal Geographical Society of London, vol. 8, 1838, pp. 448–54. JSTOR, https://doi.org/10.2307/1797825. Accessed 27 Jul. 2022.
  13. Gailey, 27.
  14. Gailey, 28.
  15. "509: Senegal – Gambia". Freshwater Ecoregions of the World. Archived from the original on 30 October 2016. Retrieved 30 October 2016.

గ్రంథసూచి

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]