గారపాటి సాంబశివరావు
స్వరూపం
గారపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. దెందులూరు నుంచి 1989, 1995, 1999, 2004లో ఎమ్మెల్యేగా నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. 1999-2004లో మంత్రిగా కూడా పనిచేశారు.
రాజకీయ జీవితం
[మార్చు]గారపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పిలుపునందుకొని రాజకీయాల్లో అడుగుపెట్టి 1983, 1985 ,1994 ,1999 సంవత్సరాల్లో దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరువు మంత్రిగా పని చేశాడు.
మరణం
[మార్చు]అనారోగ్యంతో అతను 75 యేళ్ల వయసులో 2022 ఫిబ్రవరి 2న పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం, నాయుడుగూడెం లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (2 February 2022). "మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూత". the original నుండి 3 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 December 2024.
- ↑ Prajasakti (2 February 2022). "దెందులూరు మాజీ ఎంఎల్ఎ గారపాటి మృతి" (in ఇంగ్లీష్). the original నుండి 3 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 December 2024.