Coordinates: 17°35′32″N 78°25′00″E / 17.592087°N 78.416651°E / 17.592087; 78.416651

గుండ్లపోచంపల్లి పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండ్లపోచంపల్లి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
గుండ్లపోచంపల్లి పురపాలకసంఘం is located in తెలంగాణ
గుండ్లపోచంపల్లి పురపాలకసంఘం
గుండ్లపోచంపల్లి పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°35′32″N 78°25′00″E / 17.592087°N 78.416651°E / 17.592087; 78.416651
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి
మండలం మేడ్చల్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 33 km² (12.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 15,051
 - పురుషుల సంఖ్య 8,009
 - స్త్రీల సంఖ్య 6,788
 - గృహాల సంఖ్య 8,350
పిన్ కోడ్ - 500043
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

గుండ్లపోచంపల్లి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] గుండ్లపోచంపల్లి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న గుండ్లపోచంపల్లి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3] మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లి, కండ్లకోయి, ఘన్‌పూర్, బసెరెగది, ఆర్కెలగూడ మొదలైన గ్రామ పంచాయితీలు కలిపి పురపాలక సంఘంగా ఏర్పాటు చేశారు.

భౌగోళికం[మార్చు]

గుండ్లపోచంపల్లి 33 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°34′05″N 78°28′48″E / 17.568°N 78.480°E / 17.568; 78.480 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15051 మంది కాగా, అందులో 8009 మంది పురుషులు, 6788 మంది మహిళలు ఉన్నారు. 8350 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 6 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. ఎస్. రజిత
  2. లక్కిరెడ్డి శ్రీలత
  3. వీణ
  4. అమరం సరస్వతీ
  5. బాల్ రాజ్
  6. చింత పెంటయ్య
  7. మారెపల్లి రాజకుమారి
  8. ఆంథోనమ్మ
  9. హంస రాణి
  10. దుమ్మన్నగారి ప్రభాకర్
  11. అమరం జైపాల్ రెడ్డి
  12. సాయిపేట శ్రీనివాస్
  13. దొడ్ల మల్లికార్జున్
  14. అమరం హేమంత్ రెడ్డి
  15. మద్దుల లక్ష్మీ

మూలాలు[మార్చు]

  1. "Gundlapochampally Municipality". gundlapochampallymunicipality.telangana.gov.in. Retrieved 1 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 1 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 1 April 2021.
  4. "Basic Information of Municipality, Gundlapochampally Municipality". gundlapochampallymunicipality.telangana.gov.in. Retrieved 1 April 2021.
  5. skannegari. "Gundla Pochampally Municipality - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]