చందమామ కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1947 జూలై మాసపత్రిక ముఖ పుట

చందమామ కథలు అంటే, చందమామ మాసపత్రికలో ప్రచురించబడ్డ కథలు. చందమామ పిల్లల కథలకు ప్రత్యేకించబడింది. చందమామ కథలు చదువుతూ పెరిగిన పిల్లలు ఐదారు తరాలవరకు ఉంటారు.

చందమామ కథల ప్రత్యేకతలు[మార్చు]

చందమామ కథల ముఖ్యమైన ప్రత్యేకత సరళమైన భాష, చక్కటి శైలి, చిన్న చిన్న పదాలు ఆపైన వాటి అర్ధవంతమైన వాడుక. చందమామ కథలన్నీ కూడా ప్రస్తుతపు ఆధునిక ప్రపంచానికి సంబంధించినవి కావు. ఈ కథల ద్వారా మంచి, చెడు, నీతి, నిజాయితీల విలువలు తెలియజేస్తాయి.

రోజువారీ దినచర్యతో విసుగెత్తి పోయినప్పడు, ఊహశక్తి మందగించి జీవితంలో రసం తగ్గినప్పడు, రెక్కలు కట్టుకుని ఎక్కడిక్తెనా ఎగిర్తెనా పోగలగాలి; లేదంటే, కాగితాలు కుట్టుకున్న చందమమానైనా తెచ్చుకో గలగాలి. అక్కడ, అకస్శాత్తుగా ఓ లోకోత్తర సౌందర్యరాశి ప్రత్కక్షమై మనల్ని అమాంతం నాగలోకం తీసుకుపోవచ్చు. ఏ మంచి పిల్ల పిశాచమూ అడవిలోకి మొసుకెళ్లి, మర్రిచెట్టు తొర్రలోని రత్నరాసుల్ని చూపిం చవచ్చు. కోరిన చోటికి చిటికెలో చేర్చే పావుకోళ్లు సొంతం కావచ్చు. రెక్కల గుర్రాలు, పుష్పక విమానాలు, పరకాయ ప్రవేశాలు, ఇంకా అనేకా నేక అలౌకిక అనుభూతుల్ని కలగజేసే సమ్మెహన శక్తి చందమామ కథ లకుంది. సుమారు అరవ్తె ఆరేళ్ల క్రితం, 1947 జూల్తె నెలలో తొలిసారిగా 'చందమామ' పిల్లల్ని పలకరించింది.

మన తెలుగు సంస్కృతికి ప్రతీక, భారతీయ సనాతన సంప్రదాయానికి పతాక, చక్రపాణి మానస పుతైక, బి.నాగిరెడ్డి పిల్లల పత్రిక...చందమామ! చందమామ ఏ తెలుగు పిల్లాడూ పెద్దవలేదంటే, ఉన్నట్టుండి ఏ బ్రహ్మరాక్షసుడిగానో మారిపోయేంత ఒట్టు. స్నేహంలోంచి పుట్టిన చందమామ

చందమామ కథలోలాగే ఈ పత్రిక వెనుకా చిత్రమ్తేన మలుపులు న్నయి. 1934 లో తన ఇరావ్తే ఆరేళ్ల వయసులో చక్రపాణికి క్షయ సోకింది. చికిత్స నిమిత్తం మదనపల్లెలోని శానిటోరియంలో చేరారు. అక్కడా పక్కమంచంలోని బెంగాలీబాబుతో పరిచయమయింది. తనకొచ్చిన హిందీతో ఆయన్నుంచి బెంగాలీ నేర్చుకున్నారు . ఒక ఊపిరితిత్తి తొలగించిన తర్వాత, చక్రపాణి ఆసుపత్రీ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయినా బెంగాలీబాబుతో పరిచయం కొనసాగింది. కలకత్తా నుండి బెంగాలీ పూస్తకాలు పంపేవారా వంగాబాబు. వాటిల్లోని పిల్లల పత్రీకలు చక్రపాణిని ఆకర్షించాయి. ఒకరోజు తమ ఇంటికొచ్చిన కొడవటిగంటి కుటుంబరావు తో, ”అన్నారు . ‘చందమామ’ పేరు కూడా ఆయన ప్రస్తావించారు. ఆలా 1935 లోనే పత్రీకకు బీజం పడినా, తగిన ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఆలోచన ముందుకు సాగలేదు.

గాండీవం లాంటి ఈ ఆలోచన కిందికి దిగాలంటే, అక్కడేఈక్కడో ప్రీంటింగ్ ఫ్రేస్ లో ఉన్న బి .నాగిరేడ్డి రావాలి . తగినా రంగం అ ‘బెంగాలీ’నే సిద్దం చేసింది. ఈలోగా చక్రపాణికి వంగాసాహిత్యం బాగా పట్టుబడింది. ‘దేవదాసు’ సహ శరత్ నవలల్ని తెలుగులోకి అనువదిచడం మొదలుపేట్టారు. వీటిని అచ్చువేయడానికి బి .ఎస్.కె.ఫ్రేస్కూ వేళ్లారూ . అదిగో, అక్కడ చక్రపాణి-నాగిరేడ్డి చారిత్రక స్నేహనికి పూనాది పదింది.ఇంకేం, అలోచన కిందికి దిగింది. అకాశంలోని చండమామకు తోడుగా అవని ‘చందమామ’1947 జూలైలో జన్మించింది.

భాషలు ఎన్నయినా ప్ర ‘భావం’ తెలుగే!

ఏకకాలంలో తెలుగు, తమీల (అంబులీమామ) భాషల్లో ఆరు వేల కాపీలతో,ఆరణాల వేలతో ప్రారంభమైన చందమామ మరుసటి నేలలోనే ఇరవై వేల కాపేలు అమ్ముడుపోయింది. హింది,కన్నడ,మలయాళం,మరాఠీ,గుజరాతీలకు విస్తరించింది. ఒరియా, అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్; మొత్తం 16భాషల పాఠకులను పలకరించింది. ఎన్నింట్లో వచ్చినా, దాని హృదయం మాత్రం తెలుగే. ముండుగా తెలుగు చందమామ రూపోందేది. అవే కథలను మిగాతా భాషల్లో అనువాదం చేయించి, అవే బొమ్మలతో మరుసటి నేల విడుదల చేసేవారు. సింహళ, సింధీ,గుర్ముఖి(పంజాబీ) ) చందమామలు కొద్దికాలం మాత్రమే వచ్చి ఆ జి‌ఐపోయి నా , పదమూడు భాషల్లో రావడం ప్రపంచ బాల సాహిత్య చరిత్రలోనే అపూర్వమైన విషయం. ‘తోక చుక్క’ప్రభంచనం

చందమామ అంటేనే జానపదాలకు ప్రసిద్ధి. ఈ జానాపడాల సృష్టికర్త దాసరి సుబ్రహ్మణం కావడం కూడా ‘కథ’లో మలుపే! ప్రారంభం నుండి విచిత్ర కవలలు,అపూర్వ సౌధం ,రత్న కిరీటం, శబ్దవేది వంటి జానపదసీరియళ్లు పిల్లల్నీ అలంరించాయి. వీటి రచయిత రాజజారరావవు! ! ప్రారంభం నుండి విచిత్ర కవలలు , ఆపూర్వ సౌధం, రత్నకిరీటం, శబ్దవేది వంటీ జానాపద సీరియళ్లు పిల్లల్నీ , పేద్దల్నీ అలరించాయీ. వీటీ రాచయీత రాజారావు !ఆయన ఆకస్మిక మరణంతో, ఆయన స్తానాన్ని భర్తీ చేయాల్సిన బాద్యత సంపపాదక వర్గంలోని దాసరి సుబ్రహ్మణ్యం మీద పడీంది. అంతవరకూ ఆయనకు అలాంటి రచనలు చేసీన అనుభవం లేదూ. కానీ ఆదేసించింది చక్రపాణి! చిత్రకారుడు ’చిత్రా’తో దాసరి ఈ సంగతి చర్చించారు.చిత్రా కొన్ని బొమ్మలు వేశారు. వాటి ఆధారంగా మొట్ట మొదటి రంగు బొమ్మల సీరియల్ ‘తోకచుక్క’ 1954 జనవరి సంచికలో ప్రారంభమైంది.

‘…. కుండలినీ ద్వీపరజు చిత్రసేనుడు ప్రజలు సుఖంగా ఉండాలని పన్నులు చాలావరకు తగ్గించడంతో ధనాగారం వట్టి పోయింది.దాన్ని నింపడానికి సేనాపతి సమారసేనుడు స్తెన్యాన్ని సమాయత్తపరచి ఇతర దీవుల మీదికి దండయాత్రకు బయలుదేరాడు.. ’అశుభం అశుభం... ప్రయాణం ఆపండి’ అంటూ అరిచాడు ఆస్తాన దైవజుడు. సమరసేనుడు దాన్నిమూఢనమ్మకంగా కొట్టిపడేశాడు. అతని అజానుసారం దక్షిణ దిక్కుకే గబాగబా సాగిపోయినై... (ఇంకా ఉంది) ’

మూఢనమ్మకాన్ని ఎదిరించి, మాయలు, మంత్రాలను మట్టి కరిపించి, మానవశక్తి సాధీంచిన విజయం ఈ కథ! పద్దేనిమిది మాసాల పాటు సాగిన ఈ సీరియల్తో 1954కు ముందు లక్ష ఉన్న చందమామ సర్క్యులేషన్ రెట్టింపైంది. తర్వాత, దాసరి సుబ్రహ్మణ్యం వెనుతిరిగి చూడలేదు.ముగ్గురు మాంత్రికులు, కంచుకోట, జ్వాలాద్వీపం, రాకాసి లోయ, పాతాల దుర్గం, రాతిరధం, యక్షపర్వతం, మాయాసరోవరం, భల్లుక మాంత్రికుడు వంటి ఆణిమత్యాలు రాశారు. ఆకట్టుకునే కథ, ఉత్కంఠ భరిట సస్పేన్న్, అండమైన రంగుల బొమ్మలు;ఈ సీరియల్స్ విజయానికి కారణాలు. రచయితల కర్మాగారం

చందమామ ఎడిటోఋయేల్ బోర్డులో మొదట్లో రాజారావు, ముద్దా విశ్వనాధం, రంగారావు, బైరాగి ఉండే వారు.అనంతరం దాసరి సుబ్రహ్మణ్యిం, కొడవటిగంటి కుటుంబరావు చేరారు. చందమామలో కథలు ఎన్నిక చేసే విభీన్నంగా ఉండేది. పంపపినా దాన్ని చందమామ సూత్రం మేరకు తిరగరా యాల్సిందే. అందుకే ప్రతి కథ సరళ పదాలతో, ఒకే శైలిలో ఉండి పిల్లలను ఆకట్టుకునేవి. కొత్తగా రాసేవారు ఎలాంటి కథ పంపినా అందులో ఏద్తెనా పాయింటు నచ్చిన, మొత్తం కథను, పాత్రలతో సహ మార్చిరాసే వారు.చందమామతో వెలుగులోకి వచ్చిన రచయితలు లెక్కలేనంతమంది! కృష్ణశాస్త్రి, చలం, చింతా దీక్షితులు, శ్రీశ్రీ, ఏటుకూరి వెంకట నర్సయ్య, విద్వాన్ విశ్వం, ఆలూరి బైరాగి, డా. అవసరాల రామకృష్ణారావు, పాలంకి రమచంద్రమూర్తి వంటి వాళ్ల రచనలు కూడా తొలి నాళ్లలోచందమామలో చోటుచేసుకున్నాయి. దీనికోసమే పుట్టిన చిత్రకారులు సహజత్వం ఊట్టిపడే ‘అట్టిహసం’తో ఏమాత్రం చూపు తిప్పకోనీయని బోమ్మలు చందమామ ప్రత్యేకత!