చర్చ:ఇక్ష్వాకు వంశం

వికీపీడియా నుండి
(చర్చ:ఇక్ష్వాకు వంశము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఇక్ష్వాకు వంశము అని ఉండాలి. ఇక్ష్వాక వంశము అని కాదు. శీర్షికను సరిచెయ్యాలి.----కంపశాస్త్రి 16:05, 14 నవంబర్ 2007 (UTC)

ఇక్ష్వాకు వంశము పౌరాణిక రాజవంశము. ఇది త్రేతాయుగానికి చెందినది. ఇది లక్షల సంవత్సరాల క్రితం సంగతి. దీనిని చారిత్రకులు ఒప్పుకుంటారా? వీరు సాక్ష్యాలు అడుగుతారు. మరి మూడవ శతాబ్దం నాటి ఇక్ష్వాకులు చారిత్రక మూలాలు కలిగిన వారు. ఈ రెండు వంశాలను ఎలా ముడి వేస్తారు? ముడి కుదిరితే రామసేతువు చారిత్రక సత్యం అవుతుందేమో.--కంపశాస్త్రి 16:30, 14 నవంబర్ 2007 (UTC)
ఈ వంశానికి చెందినవారే 3వ శతాబ్దములో ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. కృష్ణా నది పై నాగార్జునసాగర్ లోని శ్రీపర్వతము పై ఉన్న బౌద్ధ స్థూపాన్ని నిర్మించింది ఇక్ష్వాకులే - ఈ అభిప్రాయానికి ఏ విధమైన చారిత్రిక ఆధారమూ లేదు. అప్పటి రాజులు తమ వంశానికి గొప్పతనం ఆపాదించుకోవడానికి చెప్పుకొన్న గాధలే అని చరిత్రకారులు భావిస్తున్నారు. కనుక ఈ వాక్యాన్ని తొలగించాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:11, 19 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]