చార్ధామ్
చార్ ధామ్ (హిందీ: चारधाम / Cārdhām)[1] అనేది భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన పూరీ, రామేశ్వరం,ద్వారక, బద్రీనాథ్ ల సముదాయం. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు, ఒక శైవ క్షేత్రము ఉంది. కాలక్రమేణా చార్ ధామ్ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.[2][3] బద్రీనాథ్, ద్వారక, పూరీలు విష్ణువు పుణ్యక్షేత్రాలు కాగా రామేశ్వరం శివుని పుణ్యక్షేత్రం.
| చార్ ధామ్ బద్రీనాథ్ • రామేశ్వరం ద్వారక • పూరీ |
|---|
చరిత్ర
[మార్చు]మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన ఆది శంకరాచార్య ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్ధాం హోదాను ఆపాదించాడు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకాధీశ ఆలయం, దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు శైవమతానికి, వైష్ణవ శాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంగా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను కలిపి ఛోటా చార్ధామ్గా వ్యవహరిస్తున్నారు.
ఆది శంకరులు చార్ ధామ్ లోని నాలుగు ప్రదేశాలకు అనుగుణంగా నాలుగు మఠాలను ఏర్పాటు చేశారు. పశ్చిమాన ద్వారకలో ప్రధాన కార్యాలయం, తూర్పున పూరి, దక్షిణాన శృంగేరి శారదా పీఠం, ఉత్తరాన బదరికాశ్రమం.[4]
ఆది శంకరులు స్థాపించిన నాలుగు మఠాల వివరాలు కింది పట్టికలో చూడవచ్చు.[5]
| శిష్యుడు
(పరంపర) |
దిశ | మఠం | మహావాక్యం | వేదం | సంప్రదాయం |
|---|---|---|---|---|---|
| పద్మపాదుడు | తూర్పు | గోవర్ధన పీఠం | ప్రజ్ఞానం బ్రహ్మ (చైతన్యమే బ్రహ్మం) | ఋగ్వేదం | భోగవాల |
| సురేశ్వరుడు | దక్షిణం | శృంగేరి శారదా పీఠం | అహం బ్రహ్మాస్మి (నేనే బ్రహ్మాన్ని) | యజుర్వేదం | భూరివాల |
| హస్తామలకాచార్యుడు | పశ్చిమం | ద్వారక పీఠం | తత్త్వమసి (అది నీవే) | సామవేదం | కితవాల |
| తోటకాచార్యుడు | ఉత్తరం | జ్యోతిర్మఠ పీఠం | అయమాత్మా బ్రహ్మ (ఈ ఆత్మయే బ్రహ్మం) | అథర్వణవేదం | నందవాల |
పుణ్యక్షేత్రాలు
[మార్చు]బద్రీనాథ్ ఆలయం
[మార్చు]
బద్రీనాథ్ ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో గర్హ్వాల్ పర్వతశ్రేణులలో అలకనంద నది ఒడ్డున ఉంది. ఈ పట్టణం 3,133 మీటర్ల (10,279 అడుగుల) ఎత్తులో ఉంది. బద్రీనాథ్ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది.[6] ఇది గర్వాల్ కొండలలో అలకనంద నది ఒడ్డున ఉంది. ఈ పట్టణం నర, నారాయణ పర్వత శ్రేణుల మధ్య, నీలకంఠ శిఖరం (6,560 మీ) నీడలో ఉంది. సమీపంలో 3 కి.మీ పరిధిలో మానా, వ్యాస గుహ, మాతామూర్తి, చరణపాదుక, భీమకుండ్, సరస్వతీ నది ముఖద్వారం లాంటి ఆసక్తికరమైన సందర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. అలకనంద, ధౌలిగంగా నదుల సంగమానికి పైన ఉన్న వాలులలో జోషీమఠ్ ఉంది. ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాలలో జోషీమఠ్ చార్ ధామ్ శీతాకాలపు పీఠం.
మిగిలిన మూడు ధామాలు ఏడాది పొడవునా తెరిచి ఉండగా బద్రీనాథ్ ధామ్ మాత్రం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు మాత్రమే భక్తుల దర్శనానికి తెరిచి ఉంటుంది.
ద్వారకాధీశ ఆలయం
[మార్చు]
ఈ ఆలయం భారతదేశ పశ్చిమాన గుజరాత్ రాష్ట్రంలో స్థాపించబడింది. ఈ నగరం నామం ద్వార్ (వాకిలి) అనే సంస్కృత పదం నుండి జనించింది. ఈ నగరం గోమతి నది సమీపంలో, నది సముద్రంలో సంగమించే కచ్ సింధుశాఖ వద్ద స్థాపితమైంది. ఈ గోమతి నది, గంగా నదికి ఉపనదిగా భావించే గోమతి నది, ఒక్కటి కావు. పౌరాణిక నగరమైన ద్వారక శ్రీకృష్ణుని నివాస స్థలం. సముద్రం వల్ల కలిగిన నష్టం, విధ్వంసం కారణంగా ద్వారక ఆరుసార్లు మునిగిపోయిందని, ఆధునిక ద్వారక ఈ ప్రాంతంలో నిర్మించబడిన 7వ నగరం అని సాధారణంగా విశ్వసిస్తారు.[7][8]
పూరీ జగన్నాథ ఆలయం
[మార్చు]
ఈ నగరం భారతదేశ తూర్పు భాగంలో ఒడిషా రాష్ట్రంలో స్థాపితమైంది. ఈ నగరం భారతదేశ అతి ప్రాచీన తూర్పు నగరాలలో ఒకటి. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉంది. ఇక్కడ పూజించే ప్రధాన దైవం కృష్ణుడు, ఆయనను జగన్నాథుడుగా ఆరాధిస్తారు. కృష్ణుని సోదరి అయిన సుభద్రను ఆమె సోదరులు జగన్నాథుడు, బలభద్రులతో పాటు పూజించే ఏకైక క్షేత్రం భారతదేశంలో ఇదొక్కటే. ఆలయ రికార్డుల ప్రకారం అవంతి రాజు ఇంద్రద్యుమ్నుడు పూరీలో ప్రధాన జగన్నాథ ఆలయాన్ని నిర్మించాడు.[9] పదవ శతాబ్దం నుండి తూర్పు గాంగ వంశం మొదటి రాజు అనంతవర్మ చోడగంగ ఆవరణలో ముందున్న ఆలయాల స్థానంలో ప్రస్తుత ఆలయాన్ని నిర్మించాడు (ప్రధాన జగన్నాథ ఆలయాన్ని మినహాయించి).[10] ఆది శంకరాచార్యులు సృష్టించిన నాలుగు ప్రధాన మఠాలలో ఒకటైన గోవర్ధన మఠం పూరీలో ఉంది.
రామనాథస్వామి ఆలయం
[మార్చు]
రామేశ్వరము భారతదేశ దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశ ద్వీపకల్ప చివరి భాగంలో మన్నార్ సింధుశాఖ వద్ద ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రదేశం నుండే రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది శైవులకు అంకితమైన ప్రముఖ దేవాలయం. పురాణాల ప్రకారం శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడు, భక్తుడు హనుమంతుడితో కలిసి లంక పాలకుడు రావణుడు అపహరించిన తన భార్య సీతను రక్షించడానికి లంక చేరుకోవడానికి ఇక్కడే ఒక వంతెనను (రామ సేతు) నిర్మించాడు. రామేశ్వరంలో గణనీయమైన ప్రాంతాన్ని శివునికి అంకితం చేయబడిన రామనాథస్వామి ఆలయం ఆక్రమించింది. ఈ ఆలయాన్ని రాముడు ప్రతిష్టించాడని విశ్వసిస్తారు. వారణాసి తీర్థయాత్ర రామేశ్వర తీర్థయాత్ర లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ ప్రదేశం హిందువులకు ముఖ్యమైనది. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ రామనాథ స్వామి పేరుతో లింగ రూపంలో ఉంటుంది; ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి కూడా.
చిత్రమాలిక
[మార్చు]చోటా చార్ ధామ్
[మార్చు]భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న మరో నాలుగు పురాతన పుణ్యక్షేత్రాల సర్క్యూట్ను ఈ చార్ ధామ్ ప్రదేశాల పెద్ద సర్క్యూట్ నుండి వేరు చేయడానికి చోటా చార్ ధామ్ అని పిలుస్తారు. ఇందులో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఉన్నాయి. మంచు కురవడం వల్ల శీతాకాలంలో చోటా చార్ ధామ్ పుణ్యక్షేత్రాలు మూసివేయబడతాయి, వేసవి రాకతో యాత్రికుల కోసం తిరిగి తెరవబడతాయి.[11][12][13][14]
శీతాకాల చార్ ధామ్
[మార్చు]ఆఫ్ సీజన్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం 'వింటర్ చార్ ధామ్' (శీతాకాల చార్ ధామ్) కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోంది.[15] శీతాకాలంలో సాంప్రదాయక చోటా చార్ ధామ్లు మూసివేయబడతాయి, దేవతలను పూజల కోసం సమీపంలోని గ్రామాలకు తరలిస్తారు.[16] వింటర్ చార్ ధామ్లు ప్రధాన ధామ్ల నుండి దేవతల శీతాకాలపు నివాసాలు: కేదార్నాథ్ కోసం ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయం, బద్రీనాథ్ కోసం చమోలీలోని పాండుకేశ్వర్, గంగోత్రి ధామ్ కోసం ఉత్తరకాశీలోని ముఖ్బా, యమునోత్రికి ఖర్సాలి.[17]
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Official website
Media related to Char Dham at Wikimedia Commons
మూలాలు
[మార్చు]- ↑ Bharati, Agrhananda (2011-06-03). Agents and Audiences (in ఇంగ్లీష్). Walter de Gruyter. p. 53. ISBN 978-3-11-080584-0.
- ↑ "Chaar Dham Yatra: A True Test of Every Hindu's Quest Towards Spiritual Enlightenment". NewsGram. 20 March 2015. the original నుండి 23 January 2022 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ Chakraborty, Yogabrata (28 June 2023). "পুরীধাম ও জগন্নাথদেবের ব্রহ্মরূপ বৃত্তান্ত" [Puridham and the tale of lord Jagannath's legendary 'Brahmarup']. dainikstatesmannews.com (in Bengali). Kolkata: Dainik Statesman (The Statesman Group). p. 4. ఒరిజినల్ నుండి 28 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 June 2023.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sankara Acarya: 4 - Monastic Traditions". the original నుండి 8 May 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 May 2009.
- ↑ "The Amnaya Peethams". Sri Sringeri Sharada Peetham. the original నుండి 26 June 2006 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "Chardham Yatra 2024: Badrinath Temple, Where Lord Vishnu Did Penance". Times Now (in ఇంగ్లీష్). 2024-05-05. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-05-18.
- ↑ Santosh, Urmila (22 November 2016). "Where Mythology Meets Reality: Sunken City Of Dwarka". gounesco.com. GoUNESCO. ఒరిజినల్ నుండి 1 July 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 July 2019.
- ↑ Shankar, Kalyani (15 March 2007). "Legends by the sea". The Economic Times. Bennett, Coleman & Co. Ltd. ఒరిజినల్ నుండి 25 July 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 July 2019.
- ↑ Chakraborty, Yogabrata (28 June 2023). "পুরীধাম ও জগন্নাথদেবের ব্রহ্মরূপ বৃত্তান্ত" [Puridham and the tale of lord Jagannath's legendary 'Bramharup']. dainikstatesmannews.com (in Bengali). Kolkata: Dainik Statesman (The Statesman Group). p. 4. Archived from the original on 28 June 2023. Retrieved 28 June 2023.
- ↑ Cesarone, Bernard (2012). "Bernard Cesarone: Pata-chitras of Odisha". asianart.com. Retrieved 2 July 2012.
This temple was built in approximately 1135–1150 by Codaganga, a king of the Eastern Ganga dynasty
- ↑ Char Dham of Garhwal Archived 5 ఏప్రిల్ 2023 at the Wayback Machine India, by Joe Windless, Sarina Singh, James Bainbridge, Lindsay Brown, Mark Elliott, Stuart Butler. Published by Lonely Planet, 2007. ISBN 1-74104-308-5. Page 468.
- ↑ Chardham Yatra, by Savitri Dubey. Published by Alekh Prakashan. ISBN 978-81-88913-25-1
- ↑ "Welcome To Alekh Prakashan". the original నుండి 23 December 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2019.
- ↑ "Char Dham and Hemkund Sahib Yatra to restart from May 2014". IANS. news.biharprabha.com. 24 April 2014. ఒరిజినల్ నుండి 7 January 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 April 2014.
- ↑ "WINTER CHAR DHAM CIRCUIT | Uttarakhand Tourism". uttarakhandtourism.gov.in (in ఇంగ్లీష్). the original నుండి 2024-07-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-01-03.
- ↑ "Winter Char Dham यात्रा क्या है? क्यों कहते हैं सूर्य पर्यटन, यहां जानें हर एक बात". Zee News Hindi (in హిందీ). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-01-03.
- ↑ "What is the winter Char Dham? Why is the Uttarakhand government promoting it?". The Indian Express (in ఇంగ్లీష్). 2025-01-02. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-01-03.