చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన జైపాల్ రెడ్డి

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. కొత్తగా చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఈ లోక్‌సభ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. ఇంతకు పూర్వం ఇది హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది.తెలంగాణాలోని 33 జిల్లాలలో జిల్లా కేంద్రము కాని పార్లమెంటు రెండు స్థానాలు చేవెళ్ళ, జహీరాబాదు. 2019 లో జరిగిన 17 వ లోక్‌సభ ఎన్నికల్లో గడ్డం రంజిత్‌రెడ్డి గెలుపొందాడు.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]

  1. మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం
  2. రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం
  3. శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
  4. చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం
  5. పరిగి శాసనసభ నియోజకవర్గం
  6. వికారాబాదు శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
  7. తాండూర్ శాసనసభ నియోజకవర్గం

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బద్దం బాల్‌రెడ్డి పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో మిర్యాలగూడ లోక్‌సభ నుండి విజయం సాధించిన ఎస్.జైపాల్ రెడ్డి పోటీలో ఉన్నాడు.[2]

సంవత్సరం రిజర్వేషన్ గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2009 జనరల్ సూదిని జైపాల్ రెడ్డి కాంగ్రెస్ 4,20,807 ఎ.పి.జితేందర్ రెడ్డి టీడీపీ 402275
2014 జనరల్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ 435077 పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ 362054
2019 జనరల్ జి.రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ 528148 కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ 513831
2024 జనరల్

2014 ఎన్నికలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009