చౌడేపల్లె మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
Map
నిర్దేశాంకాలు: 13°26′02″N 78°41′24″E / 13.434°N 78.69°E / 13.434; 78.69Coordinates: 13°26′02″N 78°41′24″E / 13.434°N 78.69°E / 13.434; 78.69
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంచౌడేపల్లె
విస్తీర్ణం
 • మొత్తం234 km2 (90 sq mi)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం42,103
 • సాంద్రత180/km2 (470/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి992


చౌడేపల్లె మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన మండలం.ఇది పుంగనూరు శాసనసభ నియోజక వర్గంలో ఉంది. పుణ్య క్షేత్రమైన తిరుపతి నుంచి ఈ మండలానికి బస్సు సౌకర్యం ఉంది.బస్సు మార్గంలో చౌడేపల్లె నుంచి మదనపల్లె 16 కి.మీ దూరం ఉంది. OSM గతిశీల పటం

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా గణాంకాలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 40,410 -అందులో పురుషులు 20,266 మందికాగా - స్త్రీలు 20,144 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 60.43% - పురుషులు అక్షరాస్యత రేటు 73.65% - స్త్రీలు అక్షరాస్యత రేటు 47.17%.

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. దిగువపల్లె
  2. కోగతి
  3. కొండమర్రి
  4. గడ్డంవారిపల్లె
  5. పెద్దయల్లకుంట్ల
  6. చౌడేపల్లె
  7. పందిళ్లపల్లె
  8. సెట్టిపేట
  9. పూడిపట్ల
  10. ఈ.చింతమాకులపల్లె
  11. కాటిపేరి
  12. లద్దిగం
  13. ఏ.కొత్తకోట
  14. దుర్గసముద్రం
  15. చారాల

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మండలంలో చూడదగ్గ ప్రదేశాలు[మార్చు]

మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం (చౌడేపల్లె) - ఈ అలయం ప్రసిద్ధి చెందింది. చుట్టూ కొండలు,ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ మహిమాన్వితుడుగా మృత్యుంజయుడు పూజలందు కొంటున్నాడు. ఆలయ నిర్మాణ కర్త పుంగనూరు జమిందారు మరణశయ్య నుంచి స్వామి వారి కటాక్షంతో మృత్యువును జయించడంతో పాటు, పూర్తి స్దాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేశాడు రాష్ట్రం లోనే ఏ ప్రాంతంలోను లేని విదంగా మృత్యుంజయుని ఆలయం నిర్మించబడింది. రాష్ట్రం నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడుల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మృత్యుంజయుని దర్శించుకుంటారు.

సమీప మండలాలు[మార్చు]

సోమల, పుంగనూరు పెద్దపంజాని, నిమ్మనపల్లె., మండలాలు.

రవాణా సౌకర్యం[మార్చు]

రోడ్డు రవాణా..

ఇక్కడికి దగ్గరగా వున్న టౌన్ పుంగనూరు 16 కి.మీ. దూరంలో ఉంది. సోమల బస్ స్టేషను, పుంగనూరు బస్ స్టేషనులు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు ఎక్కువుగా తిరుగుతాయి.

రైలు వసతి.

ఇక్కడికి పది కి.లోమీటర్ల లోపు రైలు వసతి లేదు. ప్రముఖ రైల్వే స్టేషను కాట్పాడి ఇక్కడికి 78 కి.మీ దూరంలో ఉంది.

పాఠశాలలు[మార్చు]

ఇక్కడ ఒల జిల్లాపరిషత్ పాఠశాల, ఒక మండలపరిషత్ ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి.

ఉపగ్రామాలు[మార్చు]

పొదలపల్లె, నగిరిమిట్టపల్లె, చిన్నయెల్లకుంట్ల, కిన్నకొండమర్రి, చిట్టిరెడ్డిపల్లె, గోసులకూరపల్లె.

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు[మార్చు]