Jump to content

జయ వాహిని (నటి)

వికీపీడియా నుండి

జయ వాహిని (1978 - 2026 ఫిబ్రవరి 4), తెలుగు, తమిళ సినిమాలు, ధారావాహికలలో పనిచేసిన భారతీయ నటి. టెలివిజన్ సీరియల్స్ లలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2019లో వచ్చిన రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రంలో కథానాయికగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె బహిర్భూమి (2024), పోలీస్ వారి హెచ్చరిక (2025) వంటి సినిమాల్లోనూ నటించింది.

మరణం

[మార్చు]

హైదరాబాదు మణికొండలోని తన సొంత ఇంటిలో 48 ఏళ్ల వయస్సులో 2026 ఫిబ్రవరి 4న తుదిశ్వాస విడిచింది. ఆమె కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది.[1]

మూలాలు

[మార్చు]
  1. "ఎవరూ సాయం చేయలేదు.. ప్రముఖ నటి మృతి". Sakshi. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-02-05.