జి.ఎం.సి.బాలయోగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంటి మోహనచంద్ర బాలయోగి
జి.ఎం.సి.బాలయోగి
జననంజి.ఎం.సి.బాలయోగి
1951-10-01
యెదురులంక,తూర్పు గోదావరి జిల్లా
మరణం2002-03-03
కువ్వడలంక ,కృష్ణా జిల్లా
మరణ కారణంహెలికాప్టరు ప్రమాదం
పదవి పేరుపార్లమెంట్ సభ్యుడు
పదవీ కాలం1998-03-24 : 2022-03-03 లోక్‌సభ స్పీకర్
భార్య / భర్తవిజయకుమారి
పిల్లలుముగ్గురు కుమార్తెలు , గంటి హ‌రీష్ మాధుర్‌
తండ్రిగన్నయ్య
తల్లిసత్యమ్మ

గంటి మోహనచంద్ర బాలయోగి, (1951 అక్టోబరు 1-2002 మార్చి 3) ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్.[1]

జననం[మార్చు]

బాలయోగి 1945, అక్టోబరు 1 న తూర్పు గోదావరి జిల్లా లంక గ్రామంలో గంటి యెదురుగన్నయ్య, సత్యమ్మ దంపతులకు ఒక దళిత రైతు కుటుంబంలో జన్మించాడు.[1] ఇతను ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ, ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహం చేసుకున్నాడు.ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.

మరణం[మార్చు]

వేమగిరి (తూ.గో.జిల్లా)లో జి.ఎం.సి.బాలయోగి విగ్రహం

2002,మార్చి 3న భీమవరం నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపం వలన హెలికాప్టరు ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామం సమీపంలోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదంలో బాలయోగి మరణించాడు.[1]

నిర్వహించిన పదవులు[మార్చు]

  • 1987 - 1991 తూర్పు గోదావరి జిల్లాపరిషత్ అధ్యక్షుడు
  • 1991లో - 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
  • 1996 - 1998 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు, ఉన్నత విద్యా శాఖా మంత్రి
  • 1998 - 12వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
  • 1998 - మార్చి 24 - 2002, మార్చి 3 లోక్‌సభ స్పీకర్
  • 1999 - 13వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
అంతకు ముందువారు
పి.ఎ.సంగ్మా
భారత లోక్‌సభ స్పీకర్లు
1998–2002
తరువాత వారు
మనోహర్ జోషి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Former Speakers -GMC Balayogi". Retrieved 2021-07-21.

ఇతర లింకులు[మార్చు]