జి.కిషన్ రెడ్డి
గంగపురం కిషన్ రెడ్డి | |||
![]()
| |||
కేంద్ర సహాయక మంత్రి గా
| |||
పదవీ కాలం 2019 మే 30 – ప్రస్తుతం | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం మే 2019 – 2021 | |||
ముందు | బండారు దత్తాత్రేయ | ||
నియోజకవర్గం | సికింద్రాబాదు | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | శ్రీకృష్ణ యాదవ్ | ||
తరువాత | లేరు | ||
నియోజకవర్గం | హిమాయత్ నగర్ | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | లేరు | ||
తరువాత | కాలేరు వెంకటేశ్ | ||
నియోజకవర్గం | అంబర్పేట | ||
అధ్యక్షుడు, భారతీయ జనతా యువమోర్చా
| |||
పదవీ కాలం 2002 – 2005 | |||
ముందు | శివరాజ్ సింగ్ చౌహాన్ | ||
తరువాత | ధర్మేంద్ర ప్రదాన్ | ||
నియోజకవర్గం | సికింద్రాబాదు | ||
కేంద్రమంత్రి గా
| |||
పదవీ కాలం జులై 8 2021 – ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిమ్మాపూర్ గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ | 1964 మే 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | జి స్వామిరెడ్డి, ఆండాలమ్మ | ||
జీవిత భాగస్వామి | కావ్య | ||
సంతానం | వైష్ణవి, తన్మయి రెడ్డి | ||
నివాసం | హైదరాబాదు | ||
మతం | హిందూ | ||
వెబ్సైటు | Official site |
జి.కిషన్ రెడ్డి (G.Kishan Reddy) భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. . 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1] 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికై [2] వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 2012 జనవరి 19న మహబూబ్నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో కొనసాగే భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.ఆయన ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]
వ్యక్తిగత జీవితం[మార్చు]
1964, మే 15న జి.స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించాడు. టూల్ డిజైనింగ్లో డిప్లోమా చేసిన కిషన్ రెడ్డి 1995లో కావ్యను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం (వైష్ణవి, తన్మయ్).[4]
రాజకీయ జీవితం[మార్చు]
కిషన్ రెడ్డి 1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రవేశించి, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తన సేవలు అందిస్తున్నాడు. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టాడు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షపదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందినాడు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందినాడు.
కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో [5] గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించాడు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు స్వీకరించాడు. 2014 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 62598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి శాసనసభలో ప్రవేశించాడు. అ తారువాత 2014 లో మరల తెలంగాణ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
కిషన్ రెడ్డి 2018 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆరెస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందాడు.2019 లో జరిగిన పార్లమెంట్ ఎలెక్షన్లలో సికింద్రాబాద్ నుండి గెలిచి నరేంద్రమోదీ క్యాబినెట్ లో కేంద్రాసహాయమంత్రిగా పనిచేశారు.2021 లో క్యాబినెట్ విస్తరణలో భాగంగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖకీ కేంద్రమంత్రిగా నియమితులయ్యారు.[6][7]
భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర[మార్చు]
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున జీ.కిషన్రెడ్డి మహబూబ్నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి 19, 2012న భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించాడు.[8] ఈ యాత్ర 22 రోజులపాటు తెలంగాణ జిల్లాల్లో కొనసాగీంది[9] పోరుయాత్ర ప్రారంభం రోజు కృష్ణా గ్రామంలో జరిగిన సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరి హాజరయ్యాడు.
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 07-03-2010
- ↑ సూర్య దినపత్రిక, తేది 17-05-2009
- ↑ Sakshi (1 June 2019). "కిషన్రెడ్డికి కీలక శాఖ". Sakshi. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-08-08. Retrieved 2010-03-07.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 17-05-2009
- ↑ Sakshi (7 July 2021). "రైతు బిడ్డ నుంచి కేబినెట్ మంత్రిగా కిషన్రెడ్డి ప్రస్థానం". Sakshi. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
- ↑ Andhra Jyothy (8 July 2021). "కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి" (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 20-01-2010
- ↑ సాక్షి దినపత్రిక, మహబూబ్నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 20-01-2012