టి. యం. సౌందరరాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2016లో టిఎం సౌందరరాజన్ పేరిట ఇండియన్ పోస్టల్ స్టాంప్

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు టి.ఎమ్‌.సౌందరరాజన్‌ ( తుగులువ మీనాక్షి అయ్యర్‌ సౌందరరాజన్‌) . తెలుగు చిత్రసీమ చెన్నైలో ఉన్న రోజుల్లో ఘంటసాలకు సమకాలికుడు సౌందరరాజన్‌. 1923 మార్చి 24వ తేదీన జన్మించారు. మధురై ఆయన స్వస్థలం. 1950లో వచ్చిన 'కృష్ణవిజయం' చిత్రంలో ఎస్‌.ఎమ్‌.సుబ్బయ్యనాయుడు సంగీత దర్శకత్వంలో తొలి పాట పాడారు. తమిళంలో ఎమ్‌జీఆర్‌, శివాజీ గణేశన్‌ , తెలుగులో ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు తదితరులు చిత్రాల్లో పాటలు పాడారు. 'జయభేరి'లో 'దైవం నీవేనా.', 'గోపాలుడు భూపాలుడు'లో 'ఇదేనా తరతరాల చరిత్రలో జరిగేది...', 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న'లో 'చెబితే శానా ఉంది...' లాంటి గీతాలను సౌందర్‌రాజన్‌ పాడారు.'సర్వర్‌ సుందరం' అనే అనువాద చిత్రంలో ఓ సన్నివేశంలో సౌందరరాజన్‌ నటించారు. ఆయనపై వచ్చే 'నవ యువతి...' అనే పాటను ఘంటసాల పాడారు. 2003 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మందవేలి ప్రాంతంలోని ఆయన స్వగృహంలో 25.5.2013 న చెన్నైలో తుదిశ్వాస విడిచారు