తంజావూరు మరాఠీ రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తంజావూరు మరాఠీ రాజ్యం
తంజావూరు రాజాస్థానం

1674–1855
Map of Tanjore
Map of Tanjore
Approximate extent of the Thanjavur Maratha Kingdom, at the time of its accession to the British in 1798
Approximate extent of the Thanjavur Maratha Kingdom, at the time of its accession to the British in 1798
స్థాయిKingdom from 1674 to 1799.
Princely state under the paramountcy of the British Raj (1799–1855)
రాజధానిTanjore
సామాన్య భాషలుMarathi, Tamil, Telugu
మతం
Hindu
ప్రభుత్వంPrincipality
Ruler 
• (first) 1674 - 1684
Venkoji
• (last) 1832 - 1855
Shivaji II of Thanjavur
చరిత్ర 
• Conquest of the Madurai Nayak Kingdom by Venkoji
1674
• Earliest records
1674
• పతనం
1855
విస్తీర్ణం
9,600 km2 (3,700 sq mi)
Preceded by
Succeeded by
Thanjavur Nayak kingdom
Ramnad estate
Tanjore District (Madras Presidency)
Today part ofIndia

" తంజావూరు మరాఠీ రాజ్యం " భోంస్లే రాజవంశం మరాఠా రాజ్యం 17 - 19 వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాజ్యంగా ఉంది. వారి మాతృభాష మరాఠీ. ఈ రాజవంశాన్ని వెంకోజీ స్థాపించాడు.

మరాఠీలు తంజావూరును జయించడం[మార్చు]

15 వ శతాబ్దంలో చోళ పాలన పతనం అయిన తరువాత (ప్రత్యేకంగా 1436 లో), తంజావూరు ప్రాంతం పాండ్య పాలనలో వచ్చింది. తరువాత మాలికు కాఫూరు దాడి తరువాత అది అస్తవ్యస్తంగా మారింది.


పాండ్య నాడు చాలా త్వరగా వారి స్వాతంత్ర్యాన్ని పునరుద్ఘాటించి ఢిల్లీ సుల్తానును తంజావూరు నుండి పారిపోవాలని ఒత్తిడి చేశారు. అయితే వెంటనే విజయనగర సామ్రాజ్యం వారిని స్వాధీనం చేసుకుంది. తెలుగు బలిజ కులానికి చెందిన తన నమ్మకమైన బంధువును చక్రవర్తి మదురై, తంజావూరు రాజప్రతినిధులుగా (నాయకులు) నియమించారు. మదురై నాయక రాజవంశానికి చెందిన చోక్కనాథ నాయక, తంజావూరుకు చెందిన ఆయన మామ విజయరాఘవ నాయక మధ్య తలెత్తిన ఒక అంతర్గత కుటుంబ గొడవలు ఒక యుద్ధానికి వీలు కల్పించి చివరికి తంజావూరును ఓడించింది. తంజావూరు నాయకుల పాలన 1673 వరకు కొనసాగింది. మదురై పాలకుడు చోక్కనాథ నాయకు తంజావూరు మీద దాడి చేసి దాని పాలకుడు విజయరాఘవను చంపాడు.

చోక్కనాథ తన సోదరుడు అలగిరిని తంజావూరు సింహాసనం మీద స్థాపించాడు. కాని ఒక సంవత్సరంలోనే తన విధేయతను విరమించుకున్నాడు. చోక్కనాథ తంజావూరు స్వాతంత్ర్యాన్ని గుర్తించవలసి వచ్చింది. విజయ రాఘవ కుమారుడు తాంజావూరు సింహాసనాన్ని తిరిగి పొందడానికి బిజాపూరు సుల్తానును ప్రేరేపించాడు. 1675 లో బీజాపూరు సుల్తాను కొత్త ఆక్రమణదారుడి నుండి రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మరాఠా జనరలు వెంకోజీ (ఎకోజీ) నేతృత్వంలోని శక్తిని పంపాడు. వెంకోజీ అళగిరిని ఓడించి తంజావూరును ఆక్రమించాడు. అయినప్పటికీ బీజాపూరు సుల్తాను ఆదేశాల మేరకు ఆయన తన ప్రతినిధిని సింహాసనంపై ఉంచనప్పటికీ కానీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఆ విధంగా తంజావూరు మీద మరాఠాల పాలన ప్రారంభమైంది.

మరాఠీ రాజులు[మార్చు]

వెంకోజీ[మార్చు]

మరాఠా రాజు శివాజీకి సోదరుడు వెంకోజీ భోసలే రాజవంశం నుండి వచ్చిన తంజావూరుకు చెందిన మొదటి రాజా. ఆయన 1674 ఏప్రెలులో తంజావూరు పరిపాలనను చేపట్టి 1684 వరకు పరిపాలించాడని విశ్వసిస్తున్నారు. తన పాలనలో శివాజీ 1676-1677లో జింగీ, తంజావూరుల మీద దాడి చేసి తన సోదరుడు శాంతాజీని కొలెరూనుకు ఉత్తరాన ఉన్న అన్ని భూములకు పాలకుడిగా చేసాడు. తన పాలన చివరి సంవత్సరాలలో మైసూరు నుండి వెంకోజీ చేసిన దండయాత్రను తిప్పికొట్టడానికి మదురైకి చెందిన చోక్కనాథతో పొత్తు పెట్టుకున్నాడు.

మొదటి షాహూజీ[మార్చు]

పన్నెండు సంవత్సరాల వయస్సులో సింహాసనం అధిష్టించాడు. ఆయన పాలనలో మొఘలులు కోరమాండలు తీరం, తిరుచిరాపల్లిని ఆక్రమించడంతో ఆయన మొగలులకు కప్పం అర్పించవలసి వచ్చింది. షాహుజీ సాహిత్య పోషకుడు. ఆయన పాలనలో సరిహద్దు భూముల నియంత్రణ కోసం మదురై, రామ్నాధుపురం రాజాతో తరచూ సంఘర్షణలు, యుద్ధాలు జరిగాయి.

మొదటి సర్ఫోజీ[మార్చు]

వెంకోజీ కుమారుడు మొదటి సర్ఫోజీ 1712 నుండి 1728 వరకు పరిపాలించాడు. ఆయన పాలన సాధారణ యుద్ధం, మదురై నాయకుతో వివాదాల ద్వారా గుర్తించబడింది.

తుక్కోజీ[మార్చు]

1728 నుండి 1736 వరకు. అతని పాలన చందా సాహిబు దండయాత్ర, మదురై మీద ముస్లిం దండయాత్రకు సాక్ష్యంగా నిలిచింది.

ప్రతాపు సింగు[మార్చు]

తుక్కోజీ మరణం తరువాత అరాచక కాలం 1739 లో ప్రతాపుసింగు సింహాసనం అధిష్టించడంతో ముగిసింది. ఆయన 1763 వరకు పరిపాలించాడు. ఆయన కర్ణాటక నవాబు అయిన మహ్మదు అలీతో పొత్తు పెట్టుకున్నాడు. ఫ్రెంచుకు వ్యతిరేకంగా బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి సహాయం చేశాడు. కర్నాటక యుద్ధాలు, ఏడు సంవత్సరాల యుద్ధంలో ఈస్టు ఇండియా కంపెనీ. బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి డైరెక్టరుగా "హిజు మెజెస్టి" అని సంబోధించబడిన చివరి రాజు ఆయన. 1762 లో తంజావూరు, కర్ణాటక, బ్రిటీషు వారి మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఆయన కర్ణాటక నవాబుకు అధిపతి అయ్యాడు.

థుజలి[మార్చు]

తంజావూరు స్వతంత్ర పాలకుడు. 1773 లో తంజావూరును కర్నాటక నవాబు చేజిక్కించుకుని 1776 వరకు పాలించాడు. బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ డైరెక్టర్లు ఈ సింహాసనాన్ని పునరుద్ధరించినప్పటికీ ఆయన పునరుద్ధరణ కొరకు భారీ మూల్యం చెల్లిమవలసి వచ్చింది. వచ్చింది, ఎందుకంటే ఇది ఆయన స్వతంత్ర్యం కోల్పోయేలా చేసింది.

రెండవ సర్ఫోజీ[మార్చు]

తుల్జాజీ తరువాత ఆయన టీనేజు కుమారుడు రెండవ సెర్ఫోజీ 1787 లో అధికారపీఠం స్వీకరించాడు. వెంటనే ఆయన మామ రాజప్రతినిధి అమర్సింగు రెండవ సెర్ఫోజీని పదవీచ్యుతుడయ్యాడిని చేసి ఆయన తన కోసం సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటిషు వారి సహాయంతో రెండవ సెర్ఫోజీ 1798 లో సింహాసనాన్ని తిరిగి పొందాడు. తరువాతి ఒప్పందం ఆయనను రాజ్యం పగ్గాలను బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి అప్పగించమని బలవంతం చేసింది. ఫలితంగా తంజావూరు జిల్లా (మద్రాసు ప్రెసిడెన్సీ) లో భాగమైంది. ఆ తరువాత ప్రజా ఆదాయాలను నిర్వహించడానికి జిల్లా కలెక్టరేటు వ్యవస్థను ఏర్పాటు చేశారు. తరువాత రెండవ సెర్ఫోజీ కోట, పరిసర ప్రాంతాల నియంత్రణలో ఉంచబడింది. ఆయన 1832 వరకు పరిపాలించాడు. ఆయన పాలన తంజావూరు దేశం సాహిత్య, శాస్త్రీయ, సాంకేతిక విజయాలకు ప్రసిద్ది చెందింది.

రెండవ శివాజీ[మార్చు]

రెండవ శివాజీ తంజావూరు చివరి మరాఠా పాలకుడుగా బలహీనమైన యువరాజుగా 1832 నుండి 1855 వరకు పరిపాలించాడు. ఆయన మొదటి భార్యకు మగ వారసుడు లేనందున రాణి తన మేనల్లుడిని దత్తత తీసుకుంది. 1855 లో మహారాజా (రెండవ శివాజీ) మరణం తరువాత దత్తత జరిగింది. బ్రిటిషు వారు ఈ దత్తతను అంగీకరించలేదు. లాప్సు సిద్ధాంతం నిబంధనల ఆధారంగా తంజావూరును వారు స్వాధీనం చేసుకున్నారు.

సాహిత్యం[మార్చు]

తంజావూరు మరాఠీ రాజభవనం దర్భారుహాలు లోపలి భాగం

తంజావూరు మరాఠా రాజులు సంస్కృత, తెలుగు వైపు మొగ్గు చూపడంతో శాస్త్రీయ తమిళం క్షీణించడం ప్రారంభించింది. చాలా నాటకాలు సంస్కృతంలో ఉన్నాయి. భోంస్లే రాజవంశం మొదటి పాలకుడు వెంకోజీ తెలుగులో 'ద్విపాద' రామాయణం రచించాడు. ఆయన కుమారుడు షాహుజీ అధ్యయనం, సాహిత్యాలను గొప్పగా పోషించాడు. తంజావూరు మరాఠా సాహిత్యంలో ఎక్కువ భాగం ఆయన కాలం నాటికి చెందినవై ఉన్నాయి. వాటిలో చాలావరకు రామాయణం లేదా నాటకాలు, చారిత్రక స్వభావం గల చిన్న కథలు ఉన్నాయి. సంస్కృతం, తెలుగు ఈ నాటకాలలో చాలావరకు ఉపయోగించిన భాషలలో కొన్ని తమిళ 'కూతు' కూడా ఉన్నాయి. ఈ కాలంలో వచ్చిన ప్రముఖ రచనలలో అద్వైత కీర్తన ఒకటి. తరువాత తంజావూరు పాలకులు రెండవ సెర్ఫోజీ, శివాజీ తమ సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్న సమయంలో అధ్యయనం, సాహిత్య సాధనలలో మునిగిపోయారు. సెర్ఫోజీ తన అపారమైన పుస్తకం వ్రాతప్రతులను సేకరణను ఉంచడానికి రాజభవనం ఆవరణలో సరస్వతి మహలు లైబ్రరీని నిర్మించాడు. భారతీయ భాషలతో పాటు రెండవ సెర్ఫోజీ ఇంగ్లీషు, ఫ్రెంచ్, డచ్చి, గ్రీకు, లాటిను భాషలలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు.

నిర్వహణ[మార్చు]

రాజుకు తన దేశ పరిపాలన నిర్వహించడానికి మంత్రుల మండలి సహాయపడింది. ఈ మంత్రుల మండలికి సుప్రీం అధిపతి ఒక మంత్రి లేదా దళవాయి. దళవాయి సైన్యాధ్యక్షుడుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తాడు. రాజసభలో ప్రధాని (దేవాను), దాబీరు పండిటులకు తరువాతి స్థానంలో ప్రాధాన్యత ఉంటుంది. పరిమాణం క్రమంలో దేశాన్ని సుబా, సీమై, మాగాణాలుగా విభజించారు. దేశంలోని ఐదు సుబాహులు: పట్టుకోటై, మాయవరం, కుంబకోణం, మన్నార్గుడి, తిరువాడి.

ఆర్ధికం[మార్చు]

పాలకుడు తన మిరాసుదారుల (పుట్టకదారులు)ద్వారా ప్రజల నుండి తన పన్నులను వసూలు చేశాడు. గ్రామ స్థాయి నుండే వాటిని సేకరించబడ్డాయి. శుంకాలు గ్రామంలోని వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ప్రాధమిక పంటలలో వరి ఒకటి. సాగుకు ఉపయోగించే భూమి పెద్ద భూస్వాములకు స్వంతంగా ఉండేది. అనాథరామ శాస్త్రి పేదల పరిస్థితులను మెరుగుపరిచేందుకు పన్నులు వసూలు చేయాలని ప్రతిపాదించారు. విదేశీ వాణిజ్యం జరగలేదు. ఐరోపా వ్యాపారులు రాజాకు అద్దెగా నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించడం దేశంలో ఉన్న ఏకైక విదేశీ వాణిజ్యం. ఉపయోగించిన కరెన్సీ వ్యవస్థ చక్రం లేదా పొన్ (1 చక్రం = బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ రూపాయిలో మూడు వంతులు ముద్రించబడ్డాయి). ఉపయోగించిన నాణేల ఇతర వ్యవస్థలు పగోడా (1 పగోడా = మూడున్నర కంపెనీ రూపాయిలు), ఒక పెద్ద పణం (కంపెనీ రూపాయిలో ఆరవ వంతు), ఒక చిన్న పణం (కంపెనీ రూపాయిలో పదమూడవ వంతు).

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]