తారక్నాథ్ దాస్
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
Taraknath Das | |
---|---|
200px | |
జననం | Kanchrapara, 24 Parganas, Bengal, India | 1884 జూన్ 15
మరణం | 1958 డిసెంబరు 22 New York City, New York, U.S. | (వయసు 74)
జాతి | Bengali Hindu |
మతం | Hinduism |
జీవిత భాగస్వామి | Mary Keatinge Morse |
తారక్నాథ్ దాస్ లేదా తారక్ నాథ్ దాస్ (బెంగాళీ: তারকানাথ দাস) (15 జూన్ 1884 - 1958 డిసెంబరు 22) బ్రిటీష్ వ్యతిరేక బెంగాలీ భారతీయ విప్లవాత్మక మరియు అంతర్జాతీయ విద్వాంసుడు. అతను ఉత్తర అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతంలో ఒక ప్రారంభ వలసదారు మరియు భారతదేశ స్వేచ్ఛా పోరాటానికి సహాయంగా ఆసియన్ ఇండియన్ వలసదారులను నిర్వహించేటప్పుడు, టోల్స్టాయ్తో అతని ప్రణాళికలను చర్చించాడు. అతను కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ప్రొఫెసర్ మరియు పలు ఇతర విశ్వవిద్యాలయాల్లో ఒక ప్రత్యేక అధ్యాపకుడు.
విషయ సూచిక
ప్రారంభ జీవితం[మార్చు]
తారక్ పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలు జిల్లాలోని కాంచ్రాపారా సమీపంలో మాజుపారాలో జన్మించాడు. దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన ఇతను తండ్రి కళిమోహన్ కలకత్తాలోని సెంట్రల్ టెలీగ్రాఫ్ కార్యాలయంలో ఒక క్లర్క్గా పని చేసేవారు. ఈ తెలివైన విద్యార్థి యొక్క రచనా ప్రతిభను గుర్తించిన అతని ప్రధాన ఉపాధ్యాయుడు మాతృదేశాభిమానం నేపథ్యంపై ఒక వ్యాస పోటీలో పాల్గొనేందుకు అతన్ని ప్రోత్సహించాడు. పదహారు సంవత్సరాల వయస్సు గల ఒక పాఠశాల బాలుడు సమర్పించిన వ్యాసం యొక్క నాణ్యతతో ముగ్ధుడైన న్యాయనిర్ణేతల్లో ఒకరు, అనుశీలన్ సమితి స్థాపకుడు బారిస్టర్ పి. మిట్టర్ తన సహచరుడు సతీష్ చంద్ర బాసుతో ఆ బాలుడిని నమోదు చేయమని పేర్కొన్నాడు. 1901లో ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణతీ సాధించిన తారక్ కలకత్తాకు వెళ్లాడు. విశ్వవిద్యాలయ విద్య కోసం ప్రముఖ జనరల్ శాసనసభ యొక్క విద్యా సంస్థ (ప్రస్తుతం స్కాటిష్ చర్చి కళాశాల) లో ప్రవేశాన్ని పొందాడు. తన రహస్య మాతృదేశాభిమాన కార్యక్రమంలో, అతనికి తన పెద్ద సోదరి గిరిజ నుండి సంపూర్ణ మద్దతు లభించింది.[ఉల్లేఖన అవసరం]
ఒక బృహత్కార్యానికి ఆధారం[మార్చు]
బెంగాలీ ఉత్సాహాన్ని పెంచడానికి, ప్రముఖ బెంగాలీ హిందూ నాయకుల్లో ఒకరు రాజా సీతారాం రాయ్ సాధించిన అంశాలకు స్మరణగా శివాజీతోపాటు ఒక ఉత్సవాన్ని పరిచయం చేశాడు. 1906 లోని ప్రారంభ నెలలో, బాఘా జతిన్ లేదా జతీంద్ర నాథ్ ముఖర్జీకి బెంగాల్ పురాతన రాజధాని జెస్సూర్లోని మొహమ్మద్పూర్లో జరిగే సీతారామ్ ఉత్సవంలో నిర్వహణ కోసం ఆహ్వానం అందినప్పుడు, ఆయనతో పాటు తారక్ కూడా వెళ్లాడు. ఈ సందర్భంలో జతిన్ నిర్వహించిన ఒక ఏకాంత సమావేశంలో తారక్తోపాటు శ్రిష్ చంద్ర సేన్, సత్యేంద్ర సేన్ మరియు అధార్ చంద్ర లష్కర్లు పాల్గొన్నారు: ఈ నలుగురు, ఒకరి తర్వాత ఒకరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 1952లో తారక్ ఆ సమావేశం గురించి మాట్లాడే వరకు సమావేశంలో చర్చించిన విషయం గురించి బయటకు రాలేదు. నిర్దిష్ట ఉన్నత విద్యతోపాటు, వారు సైనిక శిక్షణకు, ప్రేలుడు పదార్ధాలపై అవగాహనను ఆర్జించేందుకూ సిద్ధమయ్యారు. భారతీయుల స్వాతంత్ర్యేచ్ఛకు మద్దతుగా స్వేచ్ఛాయుత పశ్చిమ దేశాల్లోని ప్రజల్లో సానుభూతి పొందాలని వారు ఆశించారు.[1]
ఉత్తర అమెరికాలో జీవితం[మార్చు]
తారక్ బ్రహ్మచారి అనే పేరుతో ఒక సన్యాసి వలె వేషం మార్చుకుని, ఒక ప్రసంగ పర్యటనపై మద్రాసు చేరుకున్నాడు. స్వామి వివేకానంద, బిపిన్ చంద్ర పాల్ తర్వాత, మాతృదేశాభిమాన ప్రసంగాలచే ఆ ప్రాంత ప్రజల్లో ఇటువంటి ఆవేశాన్ని పెంచిన మొదటి వ్యక్తి ఆయనే.యువ విప్లవకారుల్లో, అతను ముఖ్యంగా నీలాకాంత్ బ్రహ్మచారి, సుబ్రహ్మమణి శివ, చిదంబరం పిళ్ళైలను ప్రోత్సహించాడు. 1907 జూలై 16న, జపాన్ ద్వారా తారక్ సియాటిల్కు చేరుకున్నాడు. ఒక వ్యవసాయ కార్మికుని వలె అతని జీవన భృతి తర్వాత, అతను ఒక విద్యార్థి వలె చేరడానికి ముందు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీలోని ప్రయోగశాలలో నియమించబడ్డాడు. అదే సమయంలో, అమెరికా పౌర పరిపాలనలో అనువాదకుడుగా, వ్యాఖ్యాతగా అర్హత సాధించి, అతను 1908 జనవరిలో వాంకూవర్లోని, వలస విభాగంలోకి ప్రవేశించాడు. అక్కడ అతను పని చేసే సమయంలో, కలకత్తా పోలీసు సమాచార విభాగంలోని విలియమ్ సి. హోప్కిన్సన్ (1878-1914) వలస ఇన్సపెక్టరుకు హిందీ, పంజాబీ, గురుముఖి కోసం అనువాదకునిగా నియమించబడ్డాడు. ఏడు సంవత్సరాల సేవలో, అతను (ఒక సిక్కుచే) హత్యకు గురయ్యే వరకు, హోప్కిన్సన్ తారక్ వంటి విద్యార్థి ధాత్వంశాల ఉనికి గురించి భారతదేశ ప్రభుత్వానికి వివరణాత్మక, నియత నివేదికలను పంపాల్సిన బాధ్యతలతో పాటు, బేలా సింగ్ నాయకత్వం వహిస్తున్న బ్రిటీష్ తరపు సిక్కు సమాచారవేత్తల బృందాన్ని పర్యవేక్షించవల్సిన బాధ్యతలను కూడా నిర్వహించాడు.[2]
పాండురంగ ఖాంకోజ్ (బి.జి. తిలక్ యొక్క రహస్య ప్రతినిధి) తో, తారక్ భారత స్వతంత్ర సమితిని స్థాపించాడు. జతిన్ ముఖర్జీ (బాఘా జతిన్ అని కూడా పిలుస్తారు) అందించిన నిధులతో అధార్ లష్కర్ కలకత్తా నుండి చేరుకున్నాడు, ఆ నిధులు తారక్ అతని ఫ్రీ హిందూస్థాన్ ఆంగ్లంలో అలాగే 1907 అక్టోబరు 31లో కలకత్తాకు చేరుకున్న గురాన్ దిత్ కుమార్చే గురుముఖి సంచిక స్వదేశ్ సేవక్ ('మాతృభూమిలోని సేవకులు') ప్రారంభించడానికి ఉపయోగపడ్డాయి. ఫ్రీ హిందూస్థాన్ను కాన్స్టాన్స్ బ్రిసెండెన్ "కెనడాలో మొట్టమొదటి దక్షిణ ఆసియా ప్రచురణ మరియు ఉత్తర అమెరికాలో మొట్టమొదటి వాటిలో ఒకటి" అని పేర్కొన్నాడు. వారికి ప్రేలుడు పదార్ధాల్లో నిపుణుడైన ప్రొఫెసర్ సురేంద్ర మోహన్ బోస్ సహాయం చేశాడు. టోల్స్టాయ్, హేండ్మాన్, శ్యామ్జీ కృష్ణవర్మ, మాడమే కామా వంటి ప్రముఖ వ్యక్తుల నియత ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా, తారక్ను అతని ఉద్యమంలో ప్రోత్సహించారు. "సంఘ ప్రతినిధి" వలె పేర్కొనబడిన, ఇతను 1907లో వాంకౌవర్లో హిందూస్థానీ సంఘాన్ని స్థాపించాడు.[ఉల్లేఖన అవసరం]
ఉనికిలో ఉన్న చట్టాలను సంపూర్ణంగా తెలిసిన, తారక్ అతని స్వదేశీయుల అవసరాలను తీర్చాడు, వారిలో ఎక్కువమంది పంజాబ్ ప్రాంతం నుండి వలస వచ్చిన నిరక్షరాస్యులు. మిల్సైడ్లో, న్యూ వెస్ట్మినిస్టర్ సమీపంలో, అతను ఆసియా భారతదేశ వలసదారుల పిల్లల కోసం ఒక బోర్డింగ్ పాఠశాల స్వదేశ్ సేవక్ హోమ్ను స్థాపించాడు. ఇదే కాకుండా, ఈ పాఠశాల ఆంగ్లం మరియు గణిత శాస్త్రాలను బోధించడానికి సాయంత్ర తరగతులను కూడా నిర్వహించేది మరియు ఈ విధంగా వలస వచ్చినవారు వారి కుటుంబాలకు లేదా వారి సంస్థ వ్యక్తులకు లేఖలను రాయడానికి సహాయపడ్డారు. ఇది వారు భారతదేశంలో వారి విధుల గురించి మరియు వారు నివసిస్తున్న మాతృదేశంలో వారి హక్కుల గురించి మరింత తెలుసుకోవడానికి దోహదపడింది. కెనడా మరియు ఉత్తర అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో సుమారు రెండు వేల మంది భారతీయులు ఉన్నారు, వారిలో ఎక్కువమంది సిక్కులు ఉన్నారు. వారిలో ఎక్కువమంది వ్యవసాయం మరియు నిర్మాణ పనుల్లో పనిచేసేవారు. ఒక ప్రారంభ ఆలస్యాలు అనంతరం, ఈ భారతీయ రైతులు ప్రారంభ 1910ల్లో కాలిఫోర్నియాలోని అత్యధిక వరి పంటను సాధించడంలో విజయవంతమయ్యారు మరియు వీరిలో ఎక్కువమంది వ్యక్తులు చైనా, జపాన్, కొరియా, నార్వే మరియు ఇటలీల నుండి ఒప్పంద వలసదారులతో సహా కాలిఫోర్నియాలోని వెస్టరన్ పసిఫిక్ రైల్వే నిర్మాణంలో పనిచేశారు.[3] తారక్ వంటి ప్రధాన వ్యక్తులు భారతీయ విరోధి హింస మరియు మినహాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా పగ తీర్చుకోవడానికి భారత సంఘాన్ని సిద్ధం చేశారు.[4]
ఆసియా భారతీయ వలసదారుల నుండి లంచాలను తీసుకున్నాడనే అనుమానంతో, హోప్కిన్సన్ తారక్ను బలిపశువుగా చేయడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తాడు మరియు చివరికి 1908 మధ్యకాలంలో కెనడా నుండి అతని బహిష్కరించబడేలా చేస్తాడు. మాతృదేశం నుండి వచ్చిన వారి నిర్వహణను బోస్, కుమార్ మరియు చాగన్ ఖాయిరాజ్ వర్మ (హుసైన్ రాహిమ్ అని కూడా పిలుస్తారు) లకు విడిచిపెట్టి, తారక్ సీటల్ నుండి శాన్ ఫ్రాన్సికో వరకు గల ప్రాంతాలపై దృష్టి సారించడానికి వాంకౌవర్కు చేరుకుంటాడు. సీటల్ చేరుకున్న తర్వాత, దాని జూలై 1908 సంచిక నుండి, ఫ్రీ హిందూస్థాన్ తారక్ నుండి ఈ లక్ష్యంతో తీవ్రంగా బ్రిటీష్ వారికి వ్యతిరేకించే పత్రికగా మారింది: "అన్ని దౌర్జన్యాలకు నిరసన తెలపడం మానవత్వానికి ప్రతీక మరియు పౌరుల విధి." NYC ఆధారిత గియోలిక్ అమెరికన్ వార్తాపత్రిక యొక్క ఐరీష్ విప్లవకారుడు జార్జ్ ఫ్రీమాన్ను ఇద్దరు భారతీయులు శామ్యూల్ ఎల్. జోషీ మరియు బరాకతుల్లాలతో సన్నిహితంగా బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమానికి నిజమైన నేతగా భావించేవారు. ఫిట్జెరాల్డ్చే ఆహ్వానించబడిన తారక్ ఫ్రీ హిందూస్థాన్ యొక్క ఆగస్టు మరియు తదుపరి సంచికలను న్యూయార్క్ నుండి విడుదల చేశాడు. 1908లో, తారక్ వెర్మోంట్, నార్త్ఫీల్డ్లోని నార్విచ్ విశ్వవిద్యాలయంలో చేరాడు, "సైనిక శిక్షణను పొందడానికి ఉన్నత స్థాయి ఇంజినీరింగ్ మరియు సైనిక శిక్షణా సంస్థ. అతను వెర్మోంట్ జాతీయ సంరక్షణ దళంలో నమోదు (...) కోసం కూడా దరఖాస్తు చేశాడు..." అన్ని జాతుల మూలాల్లోని విద్యార్థుల్లో అతనికి ఉన్న ప్రజాదరణకు మినహా, అతని బ్రిటీష్ వ్యతిరేక కార్యక్రమాల (ఫ్రీ హిందూస్థాన్ను సవరణ వంటి) వలన అతన్ని విద్యా సంస్థ నుండి దేశానికి పంపివేశారు. 1909 ముగిసే నాటికి, అతను సీటల్కు చేరుకున్నాడు.[5]
గదర్ పార్టీ స్థాపన[మార్చు]
ఫ్రీ హిందూస్థాన్ సెప్టెంబరు-అక్టోబరు 1909 సంచికలో "సిక్కులకు ఒక ప్రత్యక్ష అభ్యర్థన" ప్రచురించబడింది, దీనిని స్వదేశీ సేవక్ పునరుత్పత్తి చేసింది; ఈ కథనం ఇలా ముగిసింది: "స్వేచ్ఛను ఆస్వాదిస్తున్న ప్రజలు మరియు స్వేచ్ఛా దేశాల సంస్థలతో పరిచయం ఏర్పడటం వలన, కొంతమంది సిక్కులు ఉత్తర అమెరికా ఖండంలో కార్మికులు అయినప్పటికీ, స్వేచ్ఛ ఆలోచనను ఇముడ్చుకోవాలి మరియు బానిసత్వ సంకెళ్లను తెంచుకోవాలి" [6] మార్చి 1912లో ది పంజాబీ' లో ప్రచురించబడిన ఒక లేఖలో విప్లవాత్మక స్ఫూర్తిని పెంచే ఉద్దేశంతో ఆ ప్రాంతంలోని భారతీయులు నిర్వహణ కోసం ఒక నేత రావాలని అభ్యర్థించారు. వాస్తవానికి వారు కుమార్ను, తర్వాత సర్దార్ అజిత్ సింగ్ను ఆహ్వానించేందుకు చర్చించారు. ' అయితే తారక్ చేరుకున్న తర్వాత, అతను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు తనకు పరిచయమైన ఆర్యన్ అరాజకవాది లాలా హార్దయాల్ను ఆహ్వానించాలని పేర్కొన్నాడు. హర్దయాల్ హిందూ అసోసియేషన్ ఆఫ్ ది పసిఫిక్ ఓషియన్ను స్థాపించడం ద్వారా అతనితో పనిచేసేందుతు అంగీకరించాడు, ఇది గదర్ పార్టీకి ప్రాథమిక ఆధారాన్ని అందించింది. "పలువురు నేతలు ఇతర పార్టీల నుండి మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలను వచ్చారు, హర్దయాల్, రాస్ బిహారీ బోస్, బారకతుల్లా, సేత్ హుస్సేన్ రహీమ్, తారక్ నాథ్ దాస్ మరియు విష్ణు గణేష్ పింగ్లే... గదర్ అనేది 1857లో అభివృద్ధి తర్వాత స్వేచ్ఛ కోసం నిర్వహించబడిన మొట్టమొదటి హింసాత్మక సంఘటనగా చెప్పవచ్చు. పలువురు వారి ప్రాణాలను కోల్పోయారు,” అని ఖుష్వాంత్ సింగ్ రాశాడు.[7]
బెర్లిన్ నుండి కాబూల్కు[మార్చు]
1914లో, అతను బెర్కెలేలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధనా పరిశోధకుడు వలె నియమించబడ్డాడు. తారక్ అతని M.A. పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించాడు మరియు అతను విశ్వవిద్యాలయంలో అధ్యాపర బృందంలో చేరడతో పాటు అంతర్జాతీయ సంబంధాలు మరియు అంతర్జాతీయ చట్టంపై అతని PhD సిద్ధాంత వ్యాసాన్ని ప్రారంభించాడు. అతను తర్వాత వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో అతని PhD డిగ్రీని సాధించాడు. మరింత స్వేచ్ఛను పొందడానికి, ఆ సంవత్సరంలో అతను అమెరికా పౌరసత్వాన్ని కూడా సాధించాడు. యుసి బెర్కెలేలోని రాబర్ట్ మోర్స్ లోవెట్, ఉపామ్ పోప్, ఆర్థుర్ రైడర్ మరియు డేవిడ్ స్టార్ జోర్డాన్ మరియు పాలో ఆల్టో (స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో) లోని స్టౌర్ట్ వంటి ప్రొఫెసర్ల సహాయంతో, తారక్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించాడు. అతను అమెరికా విశ్వవిద్యాలయాలకు ఒక ప్రతినిధి వలె అంతర్జాతీయ విద్యార్థుల సంఘంచే ఆహ్వానించబడ్డాడు. అతనికి అప్పటికే ఇండో-జర్మన్ ప్లాన్ను పేర్కొన్నారు మరియు 1915 జనవరిలో, అతను బెర్లిన్లో వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ్ను కలుసుకున్నాడు. ఆ సమావేశానికి, బరాకతుల్లా మరియు హర్దయాల్లు కూడా బెర్లిన్ చేరుకున్నారు. వారందరూ రాజ మహేంద్ర ప్రతాప్ అతని కాబూల్ విస్తరణలో సహాయంగా ఒక సన్నిహిత సమూహాన్ని రూపొందించారు.[ఉల్లేఖన అవసరం]
1916 ఏప్రిల్లో, కాబూల్ యొక్క షిరాజ్-ఉల్-అక్బర్ తారక్ నుండి ఒక కాన్స్టాంటినోప్లే కాగితం నుండి ఒక ప్రసంగాన్ని మళ్లీ చదివాడు: దీనిలో ఓట్టామాన్ సైన్యానికి అత్యధిక శిక్షణ ఇస్తున్న జర్మన్ అధికారుల కార్యక్రమాలను మరియు టర్కీల వీరత్వాన్ని మరియు ధైర్యాన్ని ప్రశంసించాడు. అతను జర్మనీ మరియు ఆస్ట్రియాల మాత్రమే యుద్ధాన్ని ప్రకటించాయని, మిత్రరాజ్యాలు కాదని పేర్కొన్నాడు మరియు ఈ విధంగా చేసి వారు మానవులపై వారి శత్రువుల చేస్తున్న క్రూరమైన దురాగతాల నుండి భూమిని ప్రక్షాళన చేయాలని మరియు వారి దేశాల నుండి బలవంతంగా ఖాళీ చేయించి మరియు వారిని బానిసలుగా మార్చిన ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వాసులు మరియు రష్యన్ వాసుల నుండి భారతదేశం, ఈజిప్ట్, పెర్షియా, మోరోకోలోని మరియు నుండి ఆఫ్రికా అభాగ్య నివాసులను రక్షించాలని భావిస్తున్నారు. తారక్ టర్కీ వాసులు వారి దేశాన్ని మరియు వారి స్వేచ్ఛను రక్షించుకోవడానికి మాత్రమే కాకుండా, 300 మిలియన్ మంది ముస్లింలకు కొత్త జీవితాన్ని అందించడానికి మరియు హిందువులు మరియు ముస్లింలు గల 350 మిలియన్ భారతీయులు వారి మద్దతు మరియు సహాయాన్ని పొందే ఒక పటిష్ఠమైన ఆధారంపై ఆప్ఘాన్ రాష్ట్రాన్ని స్థాపించడానికి యుద్ధంలోకి ప్రవేశించిందని నొక్కిచెప్పాడు. (రాజకీయ, p. 304)
తారక్ 1916 జూలైలో కాలిఫోర్నియాకు తిరిగి చేరుకున్నాడు. తర్వాత అతను ప్రపంచ రాజకీయాల్లో జపాన్ విస్తరణ మరియు దాని ప్రాముఖ్యత పై ఒక విస్తృత అధ్యయనం అనే ఒక ప్రాజెక్ట్తో జపాన్ చేరుకున్నాడు. ఈ అధ్యయనం 1917లో ఈజ్ జపాన్ ఏ మెనాన్స్ టు ఆసియా ? అనే శీర్షికతో పుస్తకం రూపంలో విడుదలైంది. ఈ పుస్తకం యొక్క ముందుమాటను మాజీ చైనీస్ ప్రధాన మంత్రి షాయో-I హాంగ్ టాంగ్ రాశాడు. రాష్ బీహారీ బోస్ మరియు హెరాంబాలాల్ గుప్తాల సహకారంతో, అతను మాస్కోలోని ఒక కార్యక్రమం కోసం బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు, అప్పుడు తారక్ అపఖ్యాతియైన హిందూ జర్మన్ వివాద విచారణలో పాల్గొనాలని వెనక్కి పిలవబడ్డాడు. మొత్తం శ్వేతజాతీయుల న్యాయ సమితి అతన్ని "చాలా ప్రమాదకరమైన అపరాధి"గా ఆరోపించింది మరియు అతను తన అమెరికా పౌరసత్వాన్ని వెనక్కి తీసుకోవాలని మరియు బ్రిటీష్ పోలీసులకు లొంగిపోవాలని ప్రతిపాదించింది. 1918 ఏప్రిల్ 30న, అతనికి ఇరవై రెండు నెలల జైలుశిక్షను విధించి, లీవెన్వర్త్ ఫెడరల్ జైలుకు పంపారు.[ఉల్లేఖన అవసరం]
విద్యా వృత్తి[మార్చు]
1924లో అతను విడుదలైన తర్వాత, తారక్ అతని దీర్ఘకాల స్నేహితురాలు మరియు ఉపకారి మేరీ కీటింగ్ మోర్స్ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ మరియు నేషనల్ ఉమెన్స్ పార్టీల్లో ఒక స్థాపక సభ్యురాలు. ఆమెతో, అతను ఐరోపాకు ఒక దీర్ఘకాల పర్యటనకు వెళ్లాడు. అతను తన కార్యాచరణలకు మ్యూనిచ్ను అతని ప్రధాన కార్యాలయంగా చేసుకున్నాడు. అక్కడే అతను ఇండియా ఇన్స్టిట్యూట్ను స్థాపించాడు, ఇది జర్మనీలో ఉన్నత విద్యలను అభ్యసించిన ప్రతిభ గల భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించింది. అతను శ్రీ అరబిందోతో సన్నిహితంగా మెలిగాడు మరియు అంతర్గత ఆధ్యాత్మిక క్రమశిక్షణ నేర్చుకున్నాడు. సంయుక్త రాష్ట్రాలకు తిరిగి చేరుకున్న తర్వాత, తారక్ కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ వలె మరియు జార్జ్టౌన్ విశ్వవిద్యాలయంలో ఒక సహచరుడు వలె నియమించబడ్డాడు. అతను తన భార్యతో కలిసి, 1935లో యు.ఎస్, మరియు ఆసియా దేశాల మధ్య విద్యా కార్యక్రమాలను ప్రోత్సహించడానికి మరియు సాంస్కృతిక సంబంధాలను పోషించడానికి ఉపయోగకర తారక్నాథ్ దాస్ ఫౌండేషన్ను తెరిచాడు.[ఉల్లేఖన అవసరం]
తారక్ నాథ్ దాస్ ఫౌండేషన్[మార్చు]
ప్రస్తుతం, ఈ ఫౌండేషన్ అవార్డులు సంయుక్త రాష్ట్రాల్లో చదువుతున్న గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డబ్బును అందిస్తాయి, ఇది ఒక సంవత్సరం గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేసిన లేదా పూర్తి చేయబోతున్న మరియు ఒక డిగ్రీ కోసం చదువుతున్న విద్యార్థులకు సహాయం చేస్తుంది. అమెరికాలోని ఒక డజను విశ్వవిద్యాలయాల్లో తారక్ నాథ్ దాస్ నిధులు సహాయ పడుతున్నాయి. మారీ కీటింగ్ దాస్ ఫండ్ అని పిలిచే కొలంబియా విశ్వవిద్యాలయంలోని నిధి మాత్రమే అత్యధిక మొత్తంలో నిధులను కలిగి ఉంది మరియు దాని ఆదాయాన్ని భారతదేశంలోని ప్రసంగాలు మరియు సమావేశాలకు నిధులుగా ఉపయోగిస్తున్నారు. ఇతర సభ్యత్వ విశ్వవిద్యాలయాల్లో పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, వర్జీనియా విశ్వవిద్యాలయం, హోవార్డ్ విశ్వవిద్యాలయం, యాలే విశ్వవిద్యాలయం, చికాగో విశ్వవిద్యాలయం, మిచిగాన్ విశ్వవిద్యాలయం. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం, అమెరికా విశ్వవిద్యాలయం మరియు మానోవాలోని హావాయి విశ్వవిద్యాలయం ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం]
తదుపరి జీవితం[మార్చు]
1947లో భారతదేశ విభజన నుండి మానసికంగా బాధపడిన వారిలో తారక్ ఒకడు మరియు అతని చివరి శ్వాస వరకు దక్షిణ ఆసియా బాల్కానీసేషన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. నలభై ఆరు సంవత్సరాల దేశ బహిష్కరణ అనంతరం, అతను 1952లో వాటుముల్ ఫౌండేషన్కు ఒక ప్రత్యేక ప్రొఫెసర్ వలె అతని మాతృభూమిని మళ్లీ సందర్శించాడు. అతను కలకత్తాలో వివేకానంద సొసైటీని స్థాపించాడు. 1952 సెప్టెంబరు 9న, అతను బాఘా జతిన్ యొక్క పోరాట బలిదానం యొక్క 37వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా సమావేశంలో అతని గురులు జతిందా నిర్వహించిన విలువలను పునరుద్ధరించాలని యువతను ఉత్సాహపరిచాడు.[8] అతను 1958 డిసెంబరు 22న సంయుక్త రాష్ట్రాలకు తిరిగి చేరుకున్న తర్వాక 74 సంవత్సరాల వయస్సులో కన్నుమూశాడు.
సూచనలు[మార్చు]
- ↑ పృథ్వింద్ర ముఖర్జీచే సాథక్ బిప్లాబీ జతింద్రేనాథ్ , [సంక్షిప్త. జతింద్రనాథ్ ], వెస్ట్ బెంగాల్ స్టేట్ బుక్ బోర్డ్, 1990, pp. 442-443
- ↑ జేమ్స్ క్యాంప్బెల్ కెర్, పొలిటికల్ ట్రబుల్ ఇన్ ఇండియా ,[సంక్షిప్త. పొలిటకల్ ], 1917, 1973, pp. 247, 251
- ↑ గాలే ఎన్సైక్లోపీడియా ఆఫ్ మల్టీకల్చరల్ అమెరికా
- ↑ కాంస్టెన్స్ బ్రిసెండన్చే ది హిస్టరీ ఆఫ్ మెట్రోపాలిటన్ వాంకౌవర్ , హార్బర్ పబ్లిషింగ్
- ↑ పొలిటకల్ , pp. 119-120, 221-222
- ↑ పొలిటకల్ , pp229-231
- ↑ ఇల్యూస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, 26 ఫిబ్రవరి 1961; హారిచ్ కె. పూరిచే గదర్ మూమెంట్:ఐడియాలజీ, ఆర్గనైజేషన్ అండ్ స్ట్రాటెజీ, గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం ప్రెస్, 1983
- ↑ ఆనందబజార్ పత్రిక , కోలకతా, 10 సెప్టెంబరు 1952)
మూలాలు[మార్చు]
- డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీలో (ఎడ్.) “దాస్, తారక్నాథ్ (డా.)” S.P. సెన్, 1972, వాల్యూ I, pp363–4
- జేమ్స్ కాంప్బెల్ కెర్చే పొలిటికల్ ట్రబుల్ ఇన్ ఇండియా: ఏ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, 1917, 1973లో మళ్లీ ముద్రించబడింది
- పృధ్వీంద్ర ముఖర్జీ, సాధక్ బిప్లాబీ జతింద్రనాథ్, వెస్ట్ బెంగాల్ స్టేట్ బుక్ బోర్డ్, 1990, pp441–469
- శాన్ ఫ్రాన్సికో ట్రయల్ రిపోర్ట్, 75 వాల్యూమ్లు; రికార్డ్ గ్రూప్స్ 49, 60, 85 & 118 (U.S. నేషనల్ ఆర్కైవ్స్, వాషింగ్టన్ D.C. & ఫెడరల్ ఆర్కైవ్స్, శాన్ బ్రూనో)
- M.N. రాయ్ లైబ్రరీ & గదార్ కలెక్షన్ (సౌత్/సౌత్ఈస్ట్ లైబ్రరీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్కెలే)
- విలియమ్ ఏ. ఎల్లీస్ రాసిన “తారక్నాథ్ దాస్”, నార్విచ్ విశ్వవిద్యాలయం1819-1911 లో, వాల్యూ. III, 1911
- సాయిలేంద్ర నాథ్ ఘోస్ రచించిన “డిపోర్టేషన్ ఆఫ్ హిందూ పాలిటిక్స్”, ది డయల్ లో, 1919 ఆగస్టు 23, pp145–7
- రోనాల్డ్ స్పెక్టార్ రచించిన “ది వెర్మోంట్ ఎడ్యుకేషన్ ఆఫ్ తారక్నాథ్ దాస్: యాన్ ఎపిసోడ్ ఇన్ బ్రిటీష్-అమెరికన్-ఇండియన్ రిలేషన్స్”, వెర్మోంట్ హిస్టరీ లో, వాల్యూ.48, నం.2, 1980 (చిత్రీకరించబడింది), pp88–95
- అకూర్ అనంతచారీ రాసిన “తారక్నాథ్ ఇన్ మద్రాస్”, సండే స్టాండర్డ్ లో, చెన్నై, 1964 మే 31
- తాపన్ కె. ముఖర్జీచే తారక్నాధ్ దాస్: లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ ఏ రివల్యూషనరీ ఇన్ ఎక్సైల్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, కోల్కత్తా, 1998, 304pp
- సంతోష్ సాహాచే ఒక సమీక్ష Op. cit.:, జర్నల్ ఆఫ్ థర్డ్ వరల్డ్ స్టడీస్లో, స్ప్రింగ్, 2000
- లియోనార్డ్ ఏ. గోర్డాన్చే ది తారక్ నాథ్ దాస్ ఫౌండేషన్ గురించి
- వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో “హిందూ” విద్యార్థులు, 1908-1915
- గూగుల్ అనువాద వ్యాసాలు
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Articles containing Bengali-language text
- All articles with unsourced statements
- Articles with unsourced statements from February 2011
- 1884 జననాలు
- 1958 మరణాలు
- అనుషిలాన్ సమితి
- హిందూ-జర్మన్ వివాదం
- గదర్ పార్టీ
- భారతీయ విద్యావేత్తలు
- భారత విప్లవకారులు
- బెంగాలీ వ్యక్తులు
- కలకత్తా, స్కాటిష్ చర్చి కళాశాల పూర్వ విద్యార్థులు
- కలకత్తా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్దులు
- అమెరికా సంయుక్తరాష్ట్రాలకు వెళ్ళి స్థిరపడిన భారతీయులు
- హిందూ కార్యకర్తలు
- కొలంబియా విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం
- న్యూయార్క్ వ్యాధి సంబంధిత మరణాలు