తిరువల్లం శ్రీ పరశురామ దేవాలయం
| శ్రీ పరశురామ ఆలయం | |
|---|---|
| ప్రదేశం | తిరువల్లం, కేరళ, భారతదేశం |
| అక్షాంశ,రేఖాంశాలు | 8°26′29.8″N 76°57′18.4″E / 8.441611°N 76.955111°E |
| ఉన్నతి | 31 |
| రకం | సాంస్కృతిక |
| దేశం | |
తిరువల్లం శ్రీ పరశురామ ఆలయం (కేరళ) లో శ్రీ పరశురామ ఆలయం స్థానం | |
తిరువల్లం శ్రీ పరశురామ స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటి. ఇది కరమాన నది తీరంలో, తిరువనంతపురం సమీపంలోని తిరువల్లంలో ఉంది. ఇది కేరళలో శ్రీ పరశురాముడుకు అంకితమైన ఏకైక ఆలయం.[1]
ఇది వైష్ణవ సంప్రదాయంలోని 108 అభిమాన క్షేత్రంలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం కోవలం బీచ్ నుండి 6 కిలోమీటర్లు, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 5 కిలోమీటర్లు, తిరువనంతపురం నగరం నుండి 3 కిలోమీటర్లు, అట్టుకల్ ఆలయం నుండి 3 కిలోమీటర్లు, పఝంచిరా దేవి ఆలయం నుండి 2 కిలోమీటర్లు, శ్రీ ఆలుకాడు దేవి ఆలయం నుండి 1 కిలోమీటర్ల దూరంలో ఉంది.[2] ఈ వారసత్వ ఆలయ నిర్మాణం జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నాల జాబితాలో చేర్చబడింది. పద్మనాభస్వామి శిరస్సు ఈ ఆలయంలో దర్శనమిస్తుందని, ఆయన పాదాలు త్రిపాడపురం మహాదేవ ఆలయంలో దర్శనమిస్తాయని విశ్వాసం ఉంది. స్వామి శరీరం తిరువనంతపురం పట్టణంలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలో దర్శనమిస్తుంది. ఈ మూడు ఆలయాలను భక్తులు ఒకే యాత్రగా దర్శిస్తారు.[3][4][5]
పురాణ కథనం
[మార్చు]ఆరవ విష్ణు అవతారం అయిన, గొడ్డలి ధరించిన యోధ ఋషి పరశురాముడు సముద్రం నుండి కేరళ భూభాగాన్ని తిరిగి పొందాడని పురాణాలు చెబుతాయి. అందువల్ల హిందూ పురాణాలలో కేరళను పరశురామ క్షేత్రం (పరశురాముని భూమి) అని కూడా పిలుస్తారు.[6] పరశురాముడు తన గొడ్డలిని సముద్రంపైకి విసిరాడని, ఆ గొడ్డలి పడిన దూరం వరకు నీరు వెనక్కి తగ్గిందని కథనం. పురాణాల ప్రకారం ఈ కొత్తగా ఏర్పడిన భూమి గోకర్ణం నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది.[7] సముద్రం నుండి పైకి వచ్చిన భూమి ఉప్పుగా ఉండి నివాసయోగ్యంగా లేకపోవడంతో పరశురాముడు నాగరాజు వాసుకిని ప్రార్థించాడు. వాసుకి పవిత్ర విషాన్ని ఉమ్మి నేలను సారవంతమైన పచ్చని భూమిగా మార్చాడని నమ్మకం. ఆ తరువాత వాసుకి, నాగులు ఈ భూమికి రక్షకులుగా నియమించబడినట్లు పురాణాలు చెబుతాయి.
చరిత్ర
[మార్చు]ఈ ఆలయం చివరిసారిగా 12వ నుండి 13వ శతాబ్దాలలో పునరుద్ధరించబడిందని విశ్వసిస్తారు. కేరళ పురావస్తు శాఖ దీనిని రక్షిత స్మారక చిహ్నంగా గుర్తించింది.[8] ఈ ఆలయం బలితర్పణం (పితృదేవతలకు నివాళి) కోసం ప్రసిద్ధి చెందింది. దీనిని శ్రాద్ధం అని కూడా అంటారు. కర్కిడక వావు రోజున (మలయాళ నెల కర్కిడకంలో వచ్చే ప్రత్యేక రోజు) భక్తులు పవిత్ర జలాల్లో స్నానం చేసి, బలి అనే ఆచారంలో భాగంగా తమ పూర్వీకులకు నివాళులు అర్పిస్తారు.[9] ఈ ఆలయం ప్రధానంగా బ్రాహ్మణులు నిర్మించారని, పరశురాముడు ఈ భూములను వారికి దానంగా ఇచ్చిన కారణంగా స్వామికి అంకితంగా నిర్మించబడిందని చెబుతారు.
సూచనలు
[మార్చు]- ↑ "Parasurama Temple, Thiruvallam". Kerala Tourism Development Corporation. Archived from the original on 3 January 2011. Retrieved 22 January 2011.
- ↑ http://wikimapia.org/14431444/Parasurama-Temple-Thiruvallam [user-generated source]
- ↑ "Parasuramar Temple : Parasuramar Temple Details | Parasuramar- Thiruvallam | Tamilnadu Temple | பரசுராமர்".
- ↑ "Thiruvallam Parasurama temple bestows peace on the living and the dead".[permanent dead link]
- ↑ "Parasurama Temples in Kerala". Archived from the original on 14 January 2011.
- ↑ S.C. Bhatt, Gopal K. Bhargava (2006) "Land and People of Indian States and Union Territories: Volume 14.", p. 18
- ↑ Aiya VN (1906). The Travancore State Manual. Travancore Government Press. pp. 210–12. Retrieved 12 November 2007.
- ↑ "Thiruvallam Parasurama Temple is the only one temple dedicated to Sri Parasurama". Retrieved 22 January 2011.
- ↑ "Thousands offer bali on karkidaka vavu". The Hindu. 25 July 2006. Archived from the original on 23 May 2007. Retrieved 22 January 2011.