తెలగపిండి కూర


పొట్టు (తొక్క) తీసిన నువ్వులను నువ్వు పప్పు అని, వాటి నుండి నూనె తీసిన తరువాత వచ్చే వ్యర్థాన్ని తెలగ పిండి అని అంటారు.
తయారీ విధానం
[మార్చు]తెల్ల నువ్వుపప్పు గానుగలో ఆడించగా వచ్చేది నువ్వుపప్పు నూనె, తెలగపిండి. నల్లనువ్వులను గానుగలో వేసి ఆడుతారు. అప్పుడు వచ్చే నూనెను మున్నువ్వుల నూనె అంటారు. ఈ నూనె ఆడగా వచ్చిన పిండిని కూడా తెలగపిండి అనే అంటారు. కాని, ఇలావచ్చిన తెలగపిండికి, తెల్ల నువ్వుపప్పు ఆడగా వచ్చిన పిండికి రుచిలో చాలా తేడా ఉంటుంది. నల్ల నువ్వులు ఆడగా వచ్చిన దానిని నువ్వుల తెలగపిండి అని కూడా అంటారు. దీనిని పశువులకు ఆహారంగా పెడతారు. ముఖ్యంగా, ఈనిన ఆవులకు, గేదెలకు తెలకపిండిని (ఒక అచ్చును) పాలు పితికిన వెంటనే పెడతారు. ఇందువలన పశువుకు పాలు బాగాపడతాయిట. నువ్వు పప్పుతో ఆడినప్పుడు వచ్చే పిండి అచ్చులను నువ్వుపప్పు తెలక పిండి అంటారు.
తెలగపిండి కూర
[మార్చు]తెలగపిండి కూర అనేది తెలగపిండి మరియు పప్పుతో తయారు చేయబడిన ఒక పోషకమైన మరియు రుచికరమైన ఆంధ్రా కూర. ఇది అన్నం, నెయ్యి మరియు పులుసుతో వడ్డించడానికి సాంప్రదాయ వంటకం. [1] ఈ తెలగపిండితో వడియాలు చేస్తారు. తెలగపిండి నువ్వుల నూనె తయారీలో ఉప ఉత్పత్తి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. బీరకాయలు తెలగపిండితో చేసే వంటకం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందినది. [2]
కావలసిన పదార్ధాలు
[మార్చు]- నువ్వు పప్పు తెలగపిండి 100 గ్రాములు,
- నూనె - 50గ్రాములు,
- పచ్చి మిర్చి - 6,
- ఎండు మిర్చి - 4,
- తొక్కతీసిన వెల్లుల్లి రెబ్బలు - 8,
- ఆవాలు - 1 చెమ్చా,
- జీలకర్ర -1 చెమ్చా,
- మినపపప్పు - 2 చెమ్చాలు,
- సెనగపప్పు - 2 చెమ్చాలు,
- కరివేపాకు - 4 రెమ్మలు,
తయారు చేయువిధం
[మార్చు]- తెలగపిండిలో నీళ్లు కలిపి ముద్దలాగా చేసుకోవాలి.
- పొయ్యి మీద కూర మూకుడు పెట్టి నూనె వేసి, కాగిన తరువాత పోపు దినుసులు వేయించాలి.
- తరువాత తడిపి ఉంచుకున్న తెలగపిండిని వేసి పొడిపొడిగా అయే వరకూ పొయ్యి మీద ఉంచాలి.
- తక్కువ మంట మీద అపుడపుడు కలుపుతూ ఉండాలి.
- ఉప్పువేసి పొయ్యి మీద నుండి దించుకోవాలి.