తెలుగు మాధ్యమాల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు మాధ్యమాల దినోత్సవం
తాపీ ధర్మారావు
తేదీ(లు)సెప్టెంబరు 19
ఫ్రీక్వెన్సీవార్షికం
ప్రదేశంఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలుగు మాధ్యమాల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 19న నిర్వహించబడుతుంది. తెలుగు మాధ్యమాలలో వాడుక భాషను విజయవంతంగా ప్రవేశపెట్టిన తాపీ ధర్మారావు గుర్తుగా ఆయన జన్మదినం రోజున ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1]

చరిత్ర[మార్చు]

ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, న్యూ మీడియా, పత్రికలు, రేడియో, టెలివిజన్, ఫేస్‌బుక్ మొదలైనవి మాధ్యమాలుగా ఉన్నాయి. దేశంలో మరే భాషలో లేనన్ని వార్తాఛానళ్లు, పత్రికలు తెలుగులో ఉన్నాయి. తెలుగు భాషా పండితుడు తాపీ ధర్మారావు ప్రజల భాషను గౌరవించి తొలిసారిగా 1936లో 'జనవాణి' పత్రికలో వాడుక భాషను ప్రవేశపెట్టాడు. ఆ తరువాత అనేకమంది సంపాదకులు ఈ విధానాన్ని కొనసాగిస్తూవచ్చారు. [2]

లక్ష్యం[మార్చు]

గ్రాంథిక భాషకాకుండా ప్రజలు ఉపయోగించే వాడుక భాషను వివిధ మాధ్యమాలలో వాడుతూ వారికి అవసరమైన విషయాలను అందించడం

కార్యక్రమాలు[మార్చు]

  1. వాడుక భాషగా తెలుగు ప్రాముఖ్యతను తెలుసుకునేలా వివిధ విద్యాసంస్థల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటుచేసి, విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం
  2. వివిధ మాధ్యమాలలో పనిచేసే పాత్రికేయులను వాడుక భాషలో వార్తలు అందించేలా ప్రోత్సహించడం

మూలాలు[మార్చు]

  1. ప్రజాశక్తి (19 September 2015). "జన మాధ్యమాలలో తెలుగు వినియోగం". www.prajasakti.com. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 19 September 2019.
  2. "తెలుగు మాధ్యమాల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 19న నిర్వహించబడుతుంది. తెలుగు మాధ్యమాలలో వాడుక భాషను విజయవంతంగా ప్రవేశపెట్టిన తాపీ ధర్మారావు గుర్తుగా ఆయన జన". te.freejournal.org. Archived from the original on 2021-09-19. Retrieved 2021-09-19.