Jump to content

త్రిపుర ఉన్నత న్యాయస్థానం

వికీపీడియా నుండి
త్రిపుర హైకోర్టు
స్థాపితం2013 మార్చి 23; 13 సంవత్సరాల క్రితం (2013-03-23)
ప్రదేశంఅగర్తలా, త్రిపుర
సంవిధాన పద్ధతిభారత ప్రధాన న్యాయమూర్తి, సంబంధిత రాష్ట్ర గవర్నర్ల సలహా, సమ్మతితో భారత రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడింది.
అధికారం పొందినదిభారత రాజ్యాంగం
న్యాయమూర్తుల పదవీ కాలం62 ఏళ్లకు తప్పనిసరి పదవీ విరమణ
స్థానాల సంఖ్య4
ప్రధాన న్యాయమూర్తి
ప్రస్తుతంఎం. ఎస్. రామచంద్ర రావు
అప్పటినుండి22 జులై 2025

త్రిపుర హైకోర్టు భారతదేశంలోని త్రిపుర రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు).[1] భారత రాజ్యాంగం, ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం 1971లో తగిన సవరణలు చేసిన తర్వాత ఇది 23 మార్చి 2013న స్థాపించబడింది. హైకోర్టు ప్రధాన సీటు త్రిపుర రాజధాని అగర్తలాలో ఉంది. తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ గుప్తా (23-3-2013 నుండి 16-5-2016 వరకు) వ్యవహరించారు.[2] గతంలో ఈశాన్య భారతదేశంలోని ఇతర ఆరు రాష్ట్రాలతో పాటు త్రిపుర రాష్ట్రం కూడా గౌహతి హైకోర్టు పరిధిలో ఉండేది. త్రిపుర రాష్ట్ర ప్రాదేశిక అధికార పరిధితో 1992లో అగర్తలాలో గౌహతి హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయబడింది.

ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎం. ఎస్. రామచంద్ర రావు. ఆయన 22 ఏప్రిల్ 2025న ప్రమాణ స్వీకారం చేశారు.[3]

ప్రధాన న్యాయమూర్తులు

[మార్చు]
వరుస సంఖ్య ప్రధాన న్యాయమూర్తి మాతృ హైకోర్టు పదవి చేపట్టిన తేదీ పదవి నుండి వైదొలగిన తేదీ పదవీకాలం నియమించిన వారు
1 జస్టిస్ దీపక్ గుప్తా హిమాచల్ ప్రదేశ్ 23 మార్చి 2013 15 మే 2016 3 సంవత్సరాలు, 53 రోజులు ప్రణబ్ ముఖర్జీ
జస్టిస్ టి. వైఫేయ్ (తాత్కాలిక) గౌహతి 16 మే 2016 20 సెప్టెంబర్ 2016 127 రోజులు
2 జస్టిస్ టి. వైఫేయ్ 21 సెప్టెంబర్ 2016 28 ఫిబ్రవరి 2018 1 సంవత్సరం, 160 రోజులు
3 జస్టిస్ అజయ్ రస్తోగి రాజస్థాన్ 1 మార్చి 2018 1 నవంబర్ 2018 245 రోజులు రామ్‌నాథ్ కోవింద్
జస్టిస్ సుభాశిస్ తలపాత్ర (తాత్కాలిక) గౌహతి 2 నవంబర్ 2018 13 నవంబర్ 2018 11 రోజులు
4 జస్టిస్ సంజయ్ కరోల్ హిమాచల్ ప్రదేశ్ 14 నవంబర్ 2018 10 నవంబర్ 2019 361 రోజులు
జస్టిస్ సుభాశిస్ తలపాత్ర (తాత్కాలిక) గౌహతి 11 నవంబర్ 2019 15 నవంబర్ 2019 4 రోజులు
5 జస్టిస్ అకిల్ ఖురేషీ గుజరాత్ 16 నవంబర్ 2019 11 అక్టోబర్ 2021 1 సంవత్సరం, 329 రోజులు
6 జస్టిస్ ఇంద్రజిత్ మహంతి ఒరిస్సా 12 అక్టోబర్ 2021 10 నవంబర్ 2022 1 సంవత్సరం, 29 రోజులు
జస్టిస్ టి. అమర్‌నాథ్ గౌడ్ (తాత్కాలిక) తెలంగాణ 11 నవంబర్ 2022 14 ఫిబ్రవరి 2023 95 రోజులు ద్రౌపది ముర్ము
7 జస్టిస్ జస్వంత్ సింగ్ పంజాబ్ & హర్యానా 15 ఫిబ్రవరి 2023 22 ఫిబ్రవరి 2023 7 రోజులు
జస్టిస్ టి. అమర్‌నాథ్ గౌడ్ (తాత్కాలిక) తెలంగాణ 23 ఫిబ్రవరి 2023 16 ఏప్రిల్ 2023 52 రోజులు
8 జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జార్ఖండ్ 17 ఏప్రిల్ 2023 15 జులై 2025 2 సంవత్సరాలు, 89 రోజులు
9 జస్టిస్ ఎం. ఎస్. రామచంద్ర రావు తెలంగాణ 22 జులై 2025 ప్రస్తుతం

ప్రధాన న్యాయమూర్తులుగా ఎదిగిన వారు

[మార్చు]

ఈ విభాగంలో త్రిపుర మాతృ హైకోర్టుగా ఉంటూ ప్రధాన న్యాయమూర్తులుగా ఎదిగిన వారి జాబితా మాత్రమే ఉంది. ఇందులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే సమయంలో త్రిపుర హైకోర్టులో పని చేయని న్యాయమూర్తులు కూడా ఉండవచ్చు, కానీ త్రిపుర మాతృ హైకోర్టుగా లేని న్యాయమూర్తులు ఇందులో చేర్చబడలేదు.

మూస:Static-row-numbers

పేరు చిత్రం ఈ హైకోర్టులో సీజేగా నియమితులయ్యారు నియామక తేదీ పదవీ విరమణ తేదీ[a] పదవీకాలం
న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా న్యాయమూర్తిగా[b]
సుభాశిస్ తలపాత్ర ఒరిస్సా 2011 నవంబరు 15 2023 ఆగస్టు 8 2023 అక్టోబరు 3 57 రోజులు 11 సంవత్సరాలు, 323 రోజులు
  1. రాజీనామా, మరణం, సుప్రీంకోర్టుకు ఎలివేట్ అయిన తేదీలు కూడా ఇందులో ఉన్నాయి
  2. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న పదవీకాలాన్ని కూడా కలిగి ఉంటుంది

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  • సత్య గోపాల్ ఛటోపాధ్యాయ (జననం 1963), హైకోర్టు న్యాయమూర్తి (2020–2022)

మూలాలు

[మార్చు]
  1. "New Chief Justices for Manipur, Meghalaya & Tripura high courts". The Times of India. 24 March 2013. ఒరిజినల్ నుండి 21 April 2013 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 March 2013.
  2. "Tripura, Manipur CJs take oath". Assam Tribune. 23 March 2013. the original నుండి 1 ఫిబ్రవరి 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 March 2013.
  3. "Justice M S Ratna Sri Ramachandra Rao sworn in as Tripura High Court Chief Justice". The Indian Express (in ఇంగ్లీష్). 2025-07-22. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-05.

బయటి లింకులు

[మార్చు]