త్రిపుర లోక్భవన్ (అగర్తల)
| రాజ్భవన్ | |
|---|---|
রাজ ভবন | |
ప్రస్తుత గవర్నరు ఇంద్రసేనారెడ్డి | |
![]() Interactive map of the రాజ్భవన్ area | |
| General information | |
| Type | త్రిపుర గవర్నరు నివాసం |
| Coordinates | 23°51′13″N 91°17′05″E / 23.853524°N 91.284766°E |
| Current tenants | నల్లు ఇంద్రసేనారెడ్డి, త్రిపుర గవర్నర్ |
| Owner | త్రిపుర ప్రభుత్వం |
| Website | |
| website | |
లోక్భవన్ (రాజ్భవన్), ఇది త్రిపుర గవర్నరు అధికారిక నివాసం.[1] త్రిపుర ప్రస్తుత గవర్నరు నల్లు ఇంద్రసేనారెడ్డి నివాసం రాష్ట్ర రాజధాని అగర్తలాలో ఉంది. 2018 ఏప్రిల్లో కొత్త రాజ్భవన్ను నిర్మించి ప్రారంభించారు. మునుపటి రాజ్భవన్ 1917లో నిర్మించబడింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు దీనిని పుష్పంత ప్యాలెస్గా పిలిచేవారు. మునుపటి రాజ్భవన్ భవనం త్రిపుర రాజు బీరేంద్ర కిషోర్ మాణిక్య గౌరవార్థం దానిని మ్యూజియం, పరిశోధనా కేంద్రంగా మార్చడానికి ఉద్దేశించబడింది.
చరిత్ర
[మార్చు]అగర్తల లోని రాజ్ భవన్ త్రిపుర గవర్నర్ అధికారిక నివాసం, కార్యాలయం. ఇది అగర్తల రాజధాని నగరంలో ఉంది. 1917లో నిర్మించబడిన దీనిని పుష్పవంత్ ప్యాలెస్ అని పిలుస్తారు. ఉజ్జయంత ప్యాలెస్కు ఉత్తరాన 1.00 కిమీ దూరంలో ఉన్న కుంజబాన్లో మహారాజా బీరేంద్ర కిషోర్ మాణిక్య బహదూర్ దీనిని నిర్మించారు. రాజ్ భవన్ మొత్తం 1.76 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కనీసం ఏడు సార్లు అగర్తలాను సందర్శించారు. పుష్పబంత్ ప్యాలెస్లో ఉన్న సమయంలో ఠాగూర్ వసంత ఋతువులో ఐదు పాటలను ఆ ప్యాలెసులో స్వరపరిచారు.
ఇది కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Welcome! | Rajbhavan". rajbhavan.tripura.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-26.
