Jump to content

త్రిపుర (రాచరిక రాష్ట్రం)

Coordinates: 23°50′N 91°17′E / 23.833°N 91.283°E / 23.833; 91.283
వికీపీడియా నుండి
త్రిపుర రాష్ట్రం (హిల్ తిప్పేరా)

1809–1949
Flag of త్రిపుర
జండా
Coat of arms of త్రిపుర
Coat of arms
1858 నాటి బెంగాల్ ప్రెసిడెన్సీ పటం, కుడి వైపు చివరలో 'స్వతంత్ర తిప్పేరా'
1858 నాటి బెంగాల్ ప్రెసిడెన్సీ పటం, కుడి వైపు చివరలో 'స్వతంత్ర తిప్పేరా'
రాజధానిఅగర్తలా
చరిత్ర 
1809
13 ఆగస్టు 1947
9 సెప్టెంబర్ 1949
• భారత డొమినియన్‌ లో విలీనం
15 అక్టోబర్ 1949
విస్తీర్ణం
194110,660 km2 (4,120 sq mi)
జనాభా
• 1941
513,000
Preceded by
Succeeded by
ట్విప్రా రాజ్యం
త్రిపుర
1907 బెంగాల్ గెజిటీర్ లో 'హిల్ తిప్పేరా'
ఉజ్జయంత ప్యాలెస్.
నీర్మహల్ ప్యాలెస్.
మహారాణి మనమోహినితో మహారాజా బీర్ చంద్ర మాణిక్య
1900లో మహారాజా రాధా కిషోర్ తో ఠాగూర్
కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ ప్రెసిడెంట్‌గా విలీన పత్రంపై సంతకం చేసిన మహారాణి కాంచన్ ప్రభా దేవి


త్రిపుర రాష్ట్రం (దీనిని హిల్ తిప్పేరా అని కూడా పిలుస్తారు)[1] బ్రిటిష్ రాజ్ కాలంలో, బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత సుమారు రెండేళ్ల పాటు భారతదేశంలోని ఒక రాచరిక రాష్ట్రం. ఇక్కడి పాలకులు మాణిక్య రాజవంశానికి చెందినవారు, ఆగస్టు 1947 వరకు ఈ రాష్ట్రం సైన్య సహకార ఒప్పందంలో ఉండేది, 1947 భారత స్వాతంత్ర్య చట్టం ద్వారా ఆ ఒప్పందం నుండి విముక్తి పొందింది. ఈ రాష్ట్రం 13 ఆగస్టు 1947న కొత్తగా స్వతంత్రమైన భారత యూనియన్ లో చేరింది. తదనంతరం అక్టోబర్ 1949లో భారత యూనియన్‌లో పూర్తిగా విలీనమైంది.[2]

ఈ రాచరిక రాష్ట్రం ప్రస్తుత భారతీయ రాష్ట్రమైన త్రిపురలో ఉంది. ఈ రాష్ట్రంలో ఒక పట్టణం అగర్తలా, అలాగే మొత్తం 1,463 గ్రామాలు ఉన్నాయి. 1941లో ఇది 10,660 చ.కి.మీ విస్తీర్ణాన్ని, 513,000 జనాభాను కలిగి ఉంది.

చరిత్ర

[మార్చు]

త్రిపుర పూర్వ రాజ్యం సుమారు సా.శ 100లో స్థాపించబడింది. పురాణాల ప్రకారం, కప్ప నుండి పొందిన ఒక రత్నం (సంస్కృతంలో 'మణి') నుండి మాణిక్య రాజవంశం ఆ పేరును పొందింది. మాణిక్య అనే రాజ బిరుదుతో రాష్ట్రాన్ని పాలించిన మొదటి రాజు మహారాజా మహా మాణిక్య, ఇతడు 1400లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ రాజ్యం మింగ్ షిలులో డి-వు-లా గా ప్రస్తావించబడింది. ఉత్తర మయన్మార్ లేదా అసోంలో గుర్తించబడని రాష్ట్రమైన డా-గు-లా చేత ఆక్రమించబడిందని అందులో పేర్కొన్నారు.[3] త్రిపుర రాజుల చరిత్ర అయిన రాజమాల 15వ శతాబ్దంలో ఒకటవ ధర్మ మాణిక్య ఆధ్వర్యంలో బెంగాలీ పద్యంలో రాయబడింది.[4] త్రిపుర రాజ్యం 16వ శతాబ్దంలో గరిష్ట విస్తరణకు చేరుకుంది.[5]

1764లో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్‌ను నియంత్రణలోకి తీసుకున్నప్పుడు, మొఘల్ సామ్రాజ్యం క్రింద ఉన్న బెంగాల్ ప్రాంతాలను బ్రిటిష్ పరిపాలన స్వాధీనం చేసుకుంది. 1809లో, త్రిపుర ఒక బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా మారింది, 1838లో త్రిపుర రాజులను బ్రిటిష్ వారు సార్వభౌమాధికారులుగా గుర్తించారు.

1826, 1862 మధ్య తూర్పు భాగాన్ని కుకి ఆక్రమణదారులు నాశనం చేశారు. వారు గ్రామాలను దోచుకున్నారు, వారి నివాసులను ఊచకోత కోశారు.[మూలం అవసరం]

రాజకుమారులు అల్లర్లు సృష్టించడానికి కుకీల సేవలను తరచుగా ఉపయోగించినప్పుడు, త్రిపుర రాజ కుటుంబ సభ్యుల మధ్య వారసత్వంలో ప్రతిసారీ ఇబ్బందులు ఎదురయ్యేవి. 1904లో రాజకుటుంబ వారసత్వాన్ని శాశ్వతంగా నియంత్రించే ఒక సనద్ (దస్తావేజు) ను బ్రిటిష్ వారు చట్టబద్ధం చేశారు. అప్పటి నుండి వారసత్వాన్ని బ్రిటిష్ క్రౌన్‌కు ప్రాతినిధ్యం వహించే భారత వైస్రాయ్ గుర్తించవలసి ఉంటుంది.

బీర్ చంద్ర మాణిక్య (1862–1896) తన పరిపాలనను బ్రిటిష్ ఇండియా నమూనాలో తీర్చిదిద్దాడు, అగర్తల నగరపాలక సంస్థ స్థాపనతో సహా సంస్కరణలను అమలు చేశాడు.

1905లో త్రిపుర తూర్పు బెంగాల్, అస్సాం కొత్త ప్రావిన్స్‌లో భాగమైంది, దీనిని 'హిల్ తిప్పేరా' గా పేర్కొన్నారు.[6] త్రిపుర రాష్ట్రానికి అనుగుణంగా ఉండే హిల్ తిప్పేరా ప్రాంతంతో పాటు, రాజులు మైదాన ప్రాంతంలో 1476 చ.కి.మీ విస్తీర్ణం గల చక్లా రోష్నాబాద్ అని పిలువబడే సారవంతమైన ఎస్టేట్‌ను తమ వద్ద ఉంచుకున్నారు. ఇది నోఖాలీ, సిల్హెట్, తిప్పేరా జిల్లాలలో ఉంది; రెండవది ఇప్పుడు చాలా వరకు బంగ్లాదేశ్ కోమిల్లా జిల్లాలో చేర్చబడింది.[7]

భారత స్వాతంత్ర్యానికి కొద్దికాలం ముందు, మే 1947లో రాజు బీర్ బిక్రమ్ కిశోర్ దెబ్బర్మ మరణించాడు. అప్పట్లో అతని కుమారుడు కిరీట్ బిక్రమ్ కిశోర్ మైనర్. కాబట్టి, రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఏర్పడిన కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీకి మహారాణి కాంచన్ ప్రభా దేవి అధ్యక్షత వహించింది. 13 ఆగస్టు 1947న, మహారాణి విలీన పత్రంపై సంతకం చేసి భారత యూనియన్‌లో చేరింది. ఆ తర్వాతి నెలల్లో రాష్ట్రంలో గందరగోళం నెలకొంది, పరిపాలనా నిర్మాణంలో అనేక మార్పులు వేగంగా జరిగాయి. చివరగా, 9 సెప్టెంబర్ 1949న, మహారాణి భారత డొమినియన్ తో త్రిపుర విలీన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది అక్టోబర్ 15న అమల్లోకి వచ్చింది, త్రిపుర కేంద్ర పాలిత పార్ట్ సి రాష్ట్రంగా (చీఫ్ కమీషనర్ ప్రావిన్స్) మారింది.[2][8]

కిరీట్ ప్రద్యోత్ దేబ్ బర్మన్ (జ. 1978) చివరి రాజు కుమారుడు - ప్రస్తుత నామమాత్రపు పాలకుడు.

పాలకులు

[మార్చు]

త్రిపుర రాజ కుటుంబ పెద్ద 1919 నుండి 'మహారాజా' బిరుదును కలిగి ఉన్నాడు. 1897 నుండి పాలకులు బ్రిటిష్ అధికారులచే 13 తుపాకుల వందనానికి అర్హులు.[మూలం అవసరం]

రాజులు

[మార్చు]

• 1978 - **** ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మా (చివరి రాజు)

  • 1684 – 1712 రెండవ రత్న మాణిక్య (రెండవసారి) (మ. 1712)
  • 1712 – 1714 మహేంద్ర మాణిక్య
  • 1714 – 1732 రెండవ ధర్మ మాణిక్య (మొదటిసారి)
  • 1732 – 1733 జగత్ మాణిక్య
  • 1733 - రెండవ ధర్మ మాణిక్య (రెండవసారి)
  • 1733 – 1737 ముకుంద మాణిక్య (మ. 1739)
  • 1737 – 1739 రెండవ జై మాణిక్య (మొదటిసారి)
  • 1739 – 174.. రెండవ ఇంద్రస్య మాణిక్య (మొదటిసారి)
  • 17.. – 174. ఉదయ్ మాణిక్య
  • 174. – 174. రెండవ జై మాణిక్య (రెండవసారి)
  • 174. – 174. రెండవ ఇంద్రస్య మాణిక్య (రెండవసారి)
  • 174. – 1743 రెండవ జై మాణిక్య (మూడవసారి)
  • 1743 – 1760 మూడవ బిజయ మాణిక్య
  • సుమారు 1748 – సుమారు 1758 షంషేర్ గాజీ -రాజప్రతినిధి (మ. సుమారు 1758)
  • 1760 లక్ష్మణ మాణిక్య (మ. 1760)
  • 1760 – 1761 కృష్ణ మాణిక్య (మొదటిసారి) (మ. 1783)
  • 1761 – 1767 బలరాం మాణిక్య
  • 1767 – 11 జూలై 1783 కృష్ణ మాణిక్య (రెండవసారి) (పైవాడే)
  • 11 జూలై 1783 – మార్చి 1804 రెండవ రాజధర మాణిక్య (మ. 1804)
  • 11 జూలై 1783 – 1786 జాహ్నవి రాణి మహదేవాయు (మహిళ) - రాజప్రతినిధి
  • మార్చి 1804 – 18 అక్టోబర్ 1809 రామగంగ మాణిక్య (మొదటిసారి) (జ. 17.. – మ. 1826)
  • 18 అక్టోబర్ 1809 – 6 ఏప్రిల్ 1813 దుర్గా మాణిక్య (జ. 17.. – మ. 1813)
  • 6 ఏప్రిల్ 1813 – 14 నవంబర్ 1826 రామగంగ మాణిక్య (రెండవసారి) (పైవాడే)
  • 14 నవంబర్ 1826 – 19 మార్చి 1830 కాశీచంద్ర మాణిక్య (మ. 1830)
  • 19 మార్చి 1830 – 3 ఏప్రిల్ 1849 కృష్ణ కిశోర్ మాణిక్య (మ. 1849)
  • 3 ఏప్రిల్ 1849 – 31 జూలై 1862 ఇషాన్ చంద్ర మాణిక్య (జ. 1829 – మ. 1862)
  • 31 జూలై 1862 – 11 డిసెంబర్ 1896 బీర్ చంద్ర మాణిక్య (జ. 1838 – మ. 1896)
  • 31 జూలై 1862 – 9 మార్చి 1870 - రాజప్రతినిధి
  • 11 డిసెంబర్ 1896 – 12 మార్చి 1909 రాధా కిషోర్ మాణిక్య (జ. 1857 – మ. 1909)
  • 12 మార్చి 1909 – 1 జనవరి 1919 బీరేంద్ర కిశోర్ మాణిక్య (జ. 1883 – మ. 1923)

మహారాజులు

[మార్చు]
  • 1 జనవరి 1919 – 13 ఆగస్టు 1923 బీరేంద్ర కిశోర్ మాణిక్య
  • 17 ఆగస్టు 1923 – 17 మే 1947 బీర్ బిక్రమ్ కిశోర్ మాణిక్య (జననం 1908, మరణం 1947) (3 జూన్ 1935 తర్వాత సర్ బీర్ బిక్రమ్ కిశోర్ మాణిక్య అని పిలుస్తారు)
  • 17 మే 1947 – 15 అక్టోబర్ 1949 మాణిక్య కిరీట్ బిక్రమ్ కిశోర్ దేబ్ బర్మన్, మైనర్ (జననం 1933 – మరణం 2006) - మరణించే వరకు నామమాత్రపు పాలకుడిగా ఉన్నాడు, కానీ 1971 తర్వాత భారత ప్రభుత్వం గుర్తించలేదు.
  • 17 మే 1947 – 15 అక్టోబర్ 1949 మహారాణి కాంచన్ ప్రభా దేవి, రాజప్రతినిధి (జననం 1914, మరణం 1973)

దివాన్లు (ముఖ్యమంత్రులు)

[మార్చు]
  • 1850 – 1857 బలరామ్ హజారీ
  • 18.. – 18.. బ్రజా మోహన్ ఠాకూర్
  • 18.. – 1873 దీనబంధు ఠాకూర్
  • జూలై 1873 – 1877 నీల్మోని దాస్
  • 1877 – 1880 శంభు చంద్ర ముఖర్జీ
  • 1880 – 1883 గైర్హాజరు
  • 1883 యువరాజు రాధా కిశోర్ మాణిక్య
  • 1883 – 1886 ధనజయ ఠాకూర్
  • 1886 (3 నెలలు) బాబు దీననాథ్ సేన్
  • 1886 – నవంబర్ 1888 రాయ్ బహదూర్ మోహిని మోహన్ బర్ధన్
  • నవంబర్ 1888 – 1890? రాజు
  • 1890 – 1892 రాయ్ ఉమాకాంత దాస్ బహదూర్ (మొదటిసారి)
  • 1892 – 1901? దీనబంధు ఠాకూర్
  • 1901 – 1905 రాయ్ ఉమాకాంత దాస్ బహదూర్ (రెండవసారి)
  • నవంబర్ 1905 – ఫిబ్రవరి 1907 శ్రీ రమణి మోహన్ చటోపాధ్యాయ
  • ఫిబ్రవరి 1907 – డిసెంబర్ 1908 రాయ్ ఉమాకాంత దాస్ బహదూర్ (మూడవసారి)
  • డిసెంబర్ 1908 – 7 నవంబర్ 1909 సర్జుక్త బాబు అన్నద చరణ్ గుప్తా
  • నవంబర్ 1909 – 1914 నవద్విప్ చంద్ర దేబ్ బర్మా (జ. 1854 – మ. 1931)
  • 1914 – 1915 బ్రజేంద్ర కిశోర్ దేబ్ బర్మా (జ. 1880 – మ. 19..) (మొదటిసారి)
  • 1915 – 1923 శ్రీజుత్ బాబు ప్రసన్న కుమార్ దేబ్ బర్మా
  • 9 డిసెంబర్ 1923 – 19 ఆగస్టు 1927 నవద్విప్‌చంద్ర దేవ్ బర్మా (పైవాడే) (మొదటిసారి)
  • 1927 – 1929 జ్యోతిస్ చంద్ర సేన్ (మొదటిసారి)
  • 17 మే 1929 – 1931? నవద్విప్ చంద్ర దేవ్ బర్మా (పైవాడే) (రెండవసారి)
  • 1931 – 28 ఆగస్టు 1932 బి.కె. సేన్
  • 28 ఆగస్టు 1932 – 20 నవంబర్ 1932 మన్యబర రాణా బోధ్‌జంగ్ బహదూర్ (జ. 1894 – మ. 1946)
  • 20 నవంబర్ 1932 – 1939/40 జ్యోతిస్ చంద్ర సేన్ (రెండవసారి)
  • 1939/40 – 18 నవంబర్ 1946 మన్యబర రాణా బోధ్‌జంగ్ బహదూర్
  • నవంబర్ 1946 – 1947 బ్రజేంద్ర కిశోర్ దేబ్ బర్మా (పైవాడే) (రెండవసారి)
  • 1947 ఎస్.వి. ముఖర్జీ
  • 20 డిసెంబర్ 1947 – 15 అక్టోబర్ 1949 అబని భూషణ్ ఛటర్జీ

బ్రిటిష్ రాజకీయ ఏజెంట్లు

[మార్చు]
  • 3 జూలై 1871 – ఫిబ్రవరి 1874 ఆంబ్రోస్ విలియం బుషే పవర్ (జ. 18.. – మ. 1907)
  • 11 ఫిబ్రవరి 1874 – మే 1875 ఎడ్వర్డ్ గోర్డాన్ లిల్లింగ్‌స్టన్
  • 27 మే 1875 – ఫిబ్రవరి 1876 డబ్ల్యూ.ఎల్. శామ్యూల్స్
  • 22 ఆగస్టు 1876 – ఏప్రిల్ 1877 థామస్ ఎడ్వర్డ్ కాక్స్‌హెడ్ (జ. 1842 – మ. 1890)
  • ఫిబ్రవరి 1877 – ఏప్రిల్ 1877 జేమ్స్ ఫ్రాన్సిస్ బ్రాడ్‌బరీ (కాక్స్‌హెడ్‌కు బదులుగా)
  • 26 ఏప్రిల్ 1877 – 28 అక్టోబర్ 1878 సి.డబ్ల్యూ. బోల్టన్
  • 1878 – 1879 ఎఫ్. జోన్స్
  • 1879 – 1882 జి. టాయన్‌బీ

చిహ్నాలు

[మార్చు]

జెండా

[మార్చు]

జెండా పసుపు, ఎరుపు రంగుల నేపథ్యంలో కోట్ ఆఫ్ ఆర్మ్స్ ను కలిగి ఉంటుంది.

కోట్ ఆఫ్ ఆర్మ్స్

[మార్చు]

దీని నినాదం "బీర్ త సరమేకం" (ధైర్యం అనేది అత్యంత అవసరమైన విషయం లేదా యోధుడి కంటే మెరుగైన వారు ఎవరూ లేరు).

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ఈస్టర్న్ స్టేట్స్ ఏజెన్సీ
  • భారతదేశ రాజకీయ ఏకీకరణ
  • త్రిపుర విలీన ఒప్పందం
  • త్రిపుర బురంజి

గమనికలు

[మార్చు]
  1. "Tripura".
  2. 2.0 2.1 Nag, Sajal (2007), Making of the Indian Union: Merger of princely states and excluded areas, Akansha Pub. House, p. 321, ISBN 978-81-8370-110-5
  3. "The MSL records that the territory of this polity was in the early 15th century occupied by Da Gu-la (Tai-zong 269.3a-b), which suggests an area near Assam, There seems little doubt that it refers to Tripura, which lies south of the Brahmaputra and north of Bengal"(Wade 1994:253)
  4. Hill Tippera – History Archived 2011-06-07 at the Wayback Machine The Imperial Gazetteer of India, 1909, v. 13, p. 118.
  5. "HISTORY OF NORTH EAST INDIA (1228 TO 1947)" (PDF). Vikas publishing house. In the 16th century, there was sudden expansion of the kingdom under.[permanent dead link]
  6. Chisholm, Hugh, ed. (1911). "Hill Tippera" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 13 (11th ed.). Cambridge University Press. p. 469.
  7. "Survey and settlement of the Roshanbad estate in the districts of Tippera and Noakhali, 1892-99".
  8. Das, J. K. (2001), Human Rights and Indigenous Peoples, APH Publishing, pp. 224–225, ISBN 978-81-7648-243-1

మూలాలు

[మార్చు]
  • Wade, Geoffrey (1994). The Ming Shi-lu (Veritable Records of the Ming Dynasty) as a Source for Southeast Asian History — 14th to 17th Centuries. Hong Kong.{{cite book}}: CS1 maint: location missing publisher (link)

బయటి లింకులు

[మార్చు]

23°50′N 91°17′E / 23.833°N 91.283°E / 23.833; 91.283