Jump to content

దయానంద్ చందేలా

వికీపీడియా నుండి
దయానంద్ చందేలా

పదవీ కాలం
2008  2013
ముందు రమేష్ లాంబా
తరువాత మంజీందర్ సింగ్ సిర్సా
నియోజకవర్గం రాజౌరి గార్డెన్
పదవీ కాలం
2003  2008
ముందు మహీందర్ సింగ్ సాథి
తరువాత నియోజకవర్గం రద్దు చేయబడింది
నియోజకవర్గం విష్ణు గార్డెన్

వ్యక్తిగత వివరాలు

జననం 1954
ఖ్యాలా, న్యూఢిల్లీ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2008 వరకు)
జీవిత భాగస్వామి ధన్వతి చందేలా
బంధువులు మీనాక్షి (కోడలు)[1]
సంతానం మేఘరాజ్, ప్రియా
వృత్తి రాజకీయ నాయకుడు

దయానంద్ చందేలా (జననం 1954) ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

దయానంద్ చందేలా రాజకీయాల్లోకి రాకముందు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఇంజనీరింగ్ విభాగంలో నాన్-టెక్నికల్ సూపర్‌వైజర్‌గా పని చేసి రాజకీయాల పట్ల ఆసక్తితో 1986లో ఉద్యోగ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆయన 1993, 1998లో శాసనసభ ఎన్నికలలో విష్ణు గార్డెన్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

  • 1997లో డాక్టర్ చందేలా ఆయన భార్య ధన్వతి చందేలా ఇద్దరూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి విష్ణు నగర్ & గురునానక్ నగర్ వార్డుల నుండి స్వతంత్ర అభ్యర్థులుగా భారీ ఆధిక్యంతో గెలిచి ఒకే ఎన్నికల్లో వేర్వేరు వార్డుల నుండి గెలిచిన ఏకైక వివాహిత జంటగా వారి పేర్లు గిన్నిస్ పుస్తకంలో నమోదు చేయబడ్డాయి.
  • 2002లో వాళ్లిదరు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా టికెట్‌పై మళ్ళీ పోటీ చేసి తిరిగి ఎన్నికయ్యారు.
  • 2003లో దయానంద్ చందేలా బిజెపిలో చేరి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విష్ణు గార్డెన్ పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
  • 2004లో తన కుమారుడు మెఘ్‌రాజ్‌ వచ్చి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి టికెట్ ఆశించగా పార్టీ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.  
  • 2007లో ఆయన కుమారుడు మేఘరాజ్, కోడలు మీనాక్షి చండిలా రాజౌరి గార్డెన్ నియోజకవర్గంలో భాగమైన విష్ణు గార్డెన్& ఖ్యాలా వార్డు నుండి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా టిక్కెట్‌పై పోటీ చేసి గెలిచారు.
  • ఆయన 2008లో ఆయన బీజేపీని వీడి  కాంగ్రెస్‌లో చేరి రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
  • 2012లో ఆయన కుమారుడు మేఘరాజ్, కోడలు మీనాక్షి చండిలా రాజౌరి గార్డెన్ నియోజకవర్గంలో భాగమైన విష్ణు గార్డెన్& ఖ్యాలా వార్డు నుండి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి గెలిచారు.
  • ఆయన భార్య ధన్వతి చందేలా 2013 ఎన్నికలలో, కోడలు మీనాక్షి చందేలా 2015, 2017 రాజౌరి గార్డెన్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు.[2]
  • 2017లో ఆయన కుమార్తె ప్రియా చందేలాఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖ్యాలా వార్డ్ నుండి గెలిచింది
  • 2020లో ఆయన భార్య ధన్వతి చందేలాతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి, అతని భార్య ధన్వతి చందేలా రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

మూలాలు

[మార్చు]
  1. "Rift within Congress over MCD election tickets" (in ఇంగ్లీష్). India Today. 28 March 2012. the original నుండి 13 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 March 2025.
  2. "Rajouri Garden bypolls: We are making up for lack of leadership in the area, says Congress candidate" (in ఇంగ్లీష్). The Indian Express. 20 March 2017. the original నుండి 13 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 March 2025.