దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
| దుద్దిళ్ళ శ్రీధర్ బాబు | |||
ఎమ్మెల్యే | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2019 - ప్రస్తుతం | |||
| నియోజకవర్గం | మంథని నియోజకవర్గం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 9 మార్చి 1969 ధన్వాడ గ్రామం, కాటారం మండలం, జయశంకర్ జిల్లా, తెలంగాణ[1] | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
| తల్లిదండ్రులు | దుద్దిల్ల శ్రీపాద రావు, జయమ్మ | ||
| జీవిత భాగస్వామి | శైలజ రామయ్యర్ (ఐఏఎస్ అధికారిణి)[2] | ||
| సంతానం | అదిత, అనిరుద్ | ||
దుద్దిళ్ళ శ్రీధర్బాబు (జ. 1969 మే 30) భారతీయ రాజకీయ నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణా రాష్ట్ర శాసనసభ సభ్యుడు. ఆ రాష్ట్రం విభజించబడటానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా ఉన్నారు . తెలంగాణలో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంథని నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు . శ్రీధర్ బాబు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులలో ఒకరు . తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగము ఉపాధ్యక్షులలో ఒకరు.
ఆయన మంథని శాసనసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు .[3][4][5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]శ్రీధర్బాబు మార్చి 9, 1969 లో జన్మించాడు. అతని ప్రముఖ కాంగ్రెస్నేత, శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు, జయమ్మల మూడవ కుమారుడు.[6] అతను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు.[7] 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1999లో తండ్రి హత్య జరగడంతో ఆయన రాజకీయ వారసునిగా రాజకీయాల్లో అడుగుపెట్టి కొనసాగుతున్నారు. శ్రీధర్బాబు శైలజ రామయ్యర్ను వివాహం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హాండీక్రాఫ్ట్స్ దేవ్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఆమె వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
ఆ సమయంలో అతను తన తండ్రి పనిని మంథని నియోజకవర్గంలో, మరింత ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.[8][9]
విద్యార్థిగా గొప్ప క్రికెటర్ - అతను నిజాం కళాశాల, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు.- శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి శైలాజా రామయ్యర్తో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.
రాజకీయ రంగంలో
[మార్చు]దుద్దిళ్ళ శ్రీధర్బాబు తండ్రి శ్రీపాదరావును 1999లో మావోయిస్ట్ నక్సలైట్లు కాల్చిచంపారు. అతను రాజకీయ వారసునిగా శ్రీధర్బాబు 1999 శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఘనవిజయం సాధించాడు.[10]. అతను తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రుపట్ల రాంరెడ్డిని 15 వేల ఓట్ల తేడాతో ఓడించాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 2003 లో తన పాదయాత్ర చేపట్టే సమయానికి, శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్ బాబు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై 42560 ఓట్ల మెజారిటీతో గెలిచి 2004 నుండి 2009 వరకు ప్రభుత్వ చీఫ్విప్గా పని చేశాడు.[11]. అతను 2009 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజా రాజ్యం పార్టీకి అభ్యర్థి పుట్టా మధుపై 13,000 ఓట్ల మెజారిటీతో గెలిచి [12] 2009 నుండి 2010 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె. రోశయ్య మంత్రివర్గాలలో ఉన్నత విద్య, ఎన్నారై వ్యవహారాల మంత్రిగా, 2010 నుండి 2014 వరకు కిరణ్కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశాడు.[13]
శ్రీధర్ బాబు 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థిపై 16,230 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[14].[15] ప్రతిపక్ష పార్టీలను గందరగోళానికి గురిచేసే పదవీకాలానికి 8 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ సిఎం కెసిఆర్ 2018 సెప్టెంబర్లో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు.[16] ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో శ్రీధర్ బాబు ఒకడు.
శ్రీధర్బాబు ఆగష్టు 2023లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నియమితుడయ్యాడు. ఆయన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మంథని నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి[17], డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[18]
శ్రీధర్బాబును 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జ్గా[19], డిసెంబర్ 24న రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించారు.[20]
బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 317, 46 జీవోలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘంలో మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్గా, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ను నియమించింది.[21]
నిర్వహించిన పదవులు
[మార్చు]| ఆఫీసు | సంస్థ | పదవీకాలం |
|---|---|---|
| కార్యదర్శి, సమన్వయ కమిటీ | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | (2014-2015) |
| ఛైర్మన్, మానిఫెస్టో కమిటీ [22] | తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ | (2014-2014) |
| పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, న్యాయ వాతావరణ మంత్రి | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | (2010-2014) |
| శాసన వ్యవహారాల మంత్రి | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | (2010 - 2014) |
| ఛార్జ్ జిల్లా మంత్రి, ఛైర్మన్ DRC (జిల్లా సమీక్ష కమిటీ) [23] | రంగారెడ్డి జిల్లా, ఆంధ్రప్రదేశ్ | (2009-2014) |
| ఉన్నత విద్య, ఎన్నారై వ్యవహారాల మంత్రి | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | (2009-2010) |
| అధ్యక్షుడు | జిల్లా కాంగ్రెస్ కమిటీ, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ | (2004-2012) |
| బోర్డు సభ్యుడు | తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి), తిరుపతి, ఆంధ్రప్రదేశ్ | (2004-2006) |
| ప్రభుత్వ విప్ | 12 వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ | (2004-2009) |
| చైర్మన్ | క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలగాణ, క్యాట్ | (2014-2016) |
| ఉపాధ్యక్షుడు | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ [24] | (2016-ప్రస్తుతం) |
శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
[మార్చు]తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్(Analytics India Magazine) తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో ఆయనకు చోటు లభించింది. తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహామిస్తూ భారత్ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వ్యక్తులలో చోటు కల్పించారు.
మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నిర్వాహకులు ప్రకటించారు[25]. ‘బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. గుడ్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్ను ప్రోత్సహించేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించేందుకు చొరవ చూపారు’ అయన ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణలోనూ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో ఏఐ ఎకో సిస్టమ్ ను మరింత బలోపేతం చేసేలా 2025–26లో 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆర్ అండ్ డీ, నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్సిటీ విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు అని ప్రశంసించారు[26].
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (20 November 2023). "ఒక గ్రామం.. ఇద్దరు అభ్యర్థులు". Archived from the original on 20 November 2023. Retrieved 20 November 2023.
- ↑ The Pioneer (12 August 2023). "Dil Se: Manthani's Babu looking through the eyes of his father - The Pioneer". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
- ↑ Eenadu (4 December 2023). "పీవీ రికార్డును అధిగమించిన శ్రీధర్బాబు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "అమాత్య యోగం.. సాగాలి అభివృద్ధి యాగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ V6 Velugu (8 December 2023). "తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Sridhar Babu Official Website". sridharbabu.in/. Archived from the original on 2019-12-07. Retrieved 19 January 2020.
- ↑ Eenadu (10 December 2023). "ఆ ఇద్దరు మంత్రులూ హెచ్సీయూ పూర్వ విద్యార్థులే". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
- ↑ Ahmed, Inkeshaf (21 September 2012). "Robed minister of Kiran's team". Postnoon. Retrieved 2013-10-03.
{{cite news}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "Andhra Pradesh News : Manthani fields a Minister after PV". 26 May 2009. Archived from the original on 29 May 2009. Retrieved 19 January 2020.
- ↑ http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_1999/StatisticalReport-AP99.pdf
- ↑ http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_2004/StatisticalReports_AP_2004.pdf
- ↑ http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2009/Statistical_Report_AP2009.pdf
- ↑ Eenadu (17 November 2023). "మంత్రులు ముగ్గురు.. మాజీలు ముగ్గురు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ https://eci.gov.in/files/file/9691-telangana-general-legislative-election-2018-statistical-report/
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-13. Retrieved 2020-01-19.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-11-09. Retrieved 2020-01-19.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Namaste Telangana (8 December 2023). "12 మందితో కాంగ్రెస్ క్యాబినెట్". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Eenadu (18 December 2023). "తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జిల నియామకం". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
- ↑ Sakshi (24 December 2023). "TS: ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రుల నియామకం". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ Namasthe Telangana (25 February 2024). "జీవో-317పై మంత్రివర్గ ఉపసంఘం". Archived from the original on 26 February 2024. Retrieved 26 February 2024.
- ↑ https://www.news18.com/news/politics/congress-releases-poll-manifesto-for-telangana-680770.html
- ↑ https://www.thehindu.com/news/cities/Hyderabad/water-board-ghmc-chiefs-caught-off-guard/article2848407.ece
- ↑ https://www.thehansindia.com/posts/index/Telangana/2016-04-17/Sonia-approves-TPCC-body/222081
- ↑ Srikanth, Gantepaka (2025-08-13). "మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం.. CM రేవంత్కు క్రెడిట్". Disha daily (దిశ) | Breaking news. Retrieved 2025-08-14.
- ↑ ABN (2025-08-14). "Duddilla Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం". Andhrajyothy Telugu News. Retrieved 2025-08-14.