నంద్యాల జిల్లా
ఈ పేజీలో గతంలో ఉన్న సమాచారం స్థానే కొత్త సమాచారాన్ని చేర్చినట్లుగా తోస్తోంది. అయితే, విజ్ఞానసర్వస్వ వ్యాసాల్లో చారిత్రిక సమాచారం ముఖ్యమైనది కాబట్టి, తీసేసిన పాత సమాచారాన్ని కూడా తిరిగి చేర్చి, ఈ వ్యాసం అభివృద్ధిలో తోడ్పడండి. ఏయే సమాచారాన్ని చేర్చాలనే విషయాన్ని చర్చా పేజీలో చర్చించండి. |
నంద్యాల జిల్లా | |
|---|---|
జిల్లా | |
ఎడమనుండి కుడికి సవ్యదిశలో: ఆహోబిలం (క్రింద) గుడి, బేలుం గుహలు, కాదమల కాల్వలో శివనందీశ్వర ఆలయం, శ్రీశైలం ఆనకట్ట, యాగంటి ఉమామహేశ్వరాలయం | |
| Coordinates: 15°30′N 78°30′E / 15.5°N 78.5°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| కేంద్రం | నంద్యాల |
| పరిపాలన విభాగాలు |
|
| ప్రభుత్వం | |
| • జిల్లా కలెక్టరు | Dr. కే.శ్రీనివాసులు |
| విస్తీర్ణం | |
• మొత్తం | 9,154 కి.మీ2 (3,534 చ. మై) |
| జనాభా (2011) | |
• మొత్తం | 16,87,541 |
| • సాంద్రత | 180/కి.మీ2 (480/చ. మై.) |
| కాల మండలం | UTC+5:30 (IST) |
నంద్యాల జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022లో భాగంగా పాత కర్నూలు జిల్లాలో కొంత భూభాగంతో కొత్తగా ఏర్పడిన జిల్లా.[1] జిల్లా కేంద్రం నంద్యాల. జిల్లాలో ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన, ప్రపంచంలోకెల్లా పెద్దదైన, వన్యమృగ సంరక్షణ కేంద్రం (శ్రీశైలం - నాగార్జునసాగర్) ఉంది. శ్రీశైల క్షేత్రం, మంత్రాలయం, మహానంది అహోబిలం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ శ్రీశైలం ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది. చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు నదులు నంద్యాల జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు. నల్లమల కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి.
పేరు వ్యుత్పత్తి
[మార్చు]నంద్యాల అనే పేరు "నంది ఆలయం" అనే పదం నుండి వచ్చింది. ఇక్కడా తొమ్మిది నంది దేవాలయాలు ఉన్నాయి, వాటి ఆధారంగా నవ నందుల నంద్యాలగా పేరు వచ్చింది, కృష్ణ దేవ రాయలు కాలం నుండి ఈ దేవాలయాలకు ప్రాముఖ్యత ఉంది.
చరిత్ర
[మార్చు]పూర్వం 14వ శతాబ్దంలో నందనమాహరాజు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చుట్టు నవ నందులని నిర్మించాక ఈ స్థలానికి "నంది ఆలయం" అను పేరు వచ్చింది. కాళక్రమమైన ఈ స్థలానికి "నంద్యాల" అను వచ్చింది. జిల్లా పాత కర్నూలు జిల్లా నుండి ఏర్పడినందున కర్నూలు జిల్లా చరిత్రే దీనికి ఆధారం.
భౌగోళిక స్వరూపం
[మార్చు]నంద్యాల జిల్లా 15° 27' 49 ఉత్తర అక్షాంశాలు, 78° 28' 43 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. జిల్లా సగటు ఎత్తు సముద్ర మట్టంపై 100 అడుగులు. ఈ జిల్లాకు ఉత్తరాన కృష్ణా నది, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో వైఎస్ఆర్, అనంతపురం జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, తూర్పున ప్రకాశం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా కేంద్రం నంద్యాల నుండి రాష్ట్ర రాజధాని అమరావతి 260 కి.మీ. దూరంలో ఉంది.[2]
ఖనిజాలు
[మార్చు]బేతంచెర్ల ప్రాంతంలో సున్నపు రాయి విరివిగా లభిస్తుంది.
పశుపక్ష్యాదులు
[మార్చు]జిల్లాలోని రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంతరించిపోతున్న బట్టమేక పక్షులకు ఆవాసము.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 17.818 లక్షలు,, విస్తీర్ణం 9682 చ.కి. కి.మీ.ఉంది.
వాతావరణం
[మార్చు]జిల్లా వాతావరణం సాధారణంగా ఆరోగ్యకరమైనది. వర్షపాతం చాలా అరుదు, భారీ మంచుతో గాలి తేలికగా ఉంటుంది. సంవత్సరం జిల్లా సాధారణ వర్షపాతం 724.9 మి.మీ. 2019-20లో 784.1 మి.మీ వర్షపాతం నమోదైంది.[3]
నదులు
[మార్చు]జిల్లా ప్రధాన నదులు కృష్ణ, కుందేరు. కుముద్వతి అని కూడా పిలువబడే కుందేరు ఎర్రమలస్కు పశ్చిమాన పుంజుకుని కుందేరు లోయలోకి దూసుకెళ్లి దక్షిణ దిశలో ప్రవహిస్తుంది. ఇది మిడ్తూరు, గడివేముల, నంద్యాల, గోస్పాడు, కోయిలకుంట్ల, దొర్నిపాడు, చాగలమర్రి మండలాల గుండా కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది.[3]
భూమి వినియోగం
[మార్చు]జిల్లా మొత్తం భౌగోళిక వైశాల్యం 9.154 లక్షల హెక్టార్లు. 2019-20 గణాంకాల ప్రకారం అటవీ ప్రాంతం 3.017 లక్షల హెక్టార్లు. ఇది మొత్తం భౌగోళిక ప్రాంతంలో 32.95%. విత్తిన నిఖర విస్తీర్ణం 3.37 లక్షల హెక్టార్లు, ఇది మొత్తం భౌగోళిక ప్రాంతంలో 36.87%.[3]
పరిపాలన విభాగాలు
[మార్చు]రెవెన్యూ డివిజన్లు
[మార్చు]జిల్లాలో ఆత్మకూర్, నంద్యాల, డోన్ అనే మూడు రెవెన్యూ డివిజన్లున్నాయి. ఇవి 29 మండలాలుగా విభజించబడ్డాయి.
మండలాలు
[మార్చు]ఆత్మకూరు డివిజన్ లో 10 మండలాలు, డోన్ డివిజన్ లో 6 మండలాలు, నంద్యాల డివిజన్ లో 12 మండలాలున్నాయి.
- ఆత్మకూరు డివిజను
- డోన్ డివిజను
- నంద్యాల డివిజను
- నంద్యాల పట్టణ (పాత మండలానికి లింకు)
- నంద్యాల గ్రామీణ (పాత మండలానికి లింకు)
- గోస్పాడు
- శిరివెళ్ళ
- దొర్నిపాడు
- ఉయ్యాలవాడ
- చాగలమర్రి
- రుద్రవరం
- మహానంది
- ఆళ్లగడ్డ
- పాణ్యం
- గడివేముల
- బనగానపల్లె రెవెన్యూ డివిజను
నగరాలు, పట్టణాలు
[మార్చు]రాజకీయ విభాగాలు
[మార్చు]లోక్సభ నియోజకవర్గాలు
[మార్చు]- ఆళ్లగడ్డ
- డోన్
- నందికొట్కూరు
- నంద్యాల
- బనగానపల్లె
- శ్రీశైలం
- పాణ్యం (పాక్షికం) (కొంత భాగం కర్నూలు జిల్లాలో ఉంది.)
నీటిపారుదల
[మార్చు]జిల్లా స్థూల పంటల విస్తీర్ణం 1.88 లక్షల హెక్టార్లు. 2019-20లో కాలువలు, ట్యాంకులు, బావులు, ఇతర వనరుల ద్వారా సాగునీరు అందిస్తారు.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]- బెలూం గుహలు
- మంత్రాలయం
- అహోబిలం
- శ్రీశైలక్షేత్రం
- మహానంది
- యాగంటి
- రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
- కొలను భారతి సరస్వతిదేవి దేవాలయం (శివపురం)
- శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం (గడిగరేవుల)
- శ్రీ హటకేశ్వర స్వామి దేవస్థానం (హటకేశ్వరం)
- మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (బేతంచర్ల)
- చౌడేశ్వరీమాత ఆలయం (నందవరం)
చిత్రమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ Hand Book of statistics - Nandyal district (PDF). District collector, Government of Andhra Pradesh. 2022-04-04.
- ↑ 3.0 3.1 3.2 "చరిత్ర". Nadyala district, Government of Andhra pradesh. Retrieved 2022-06-03.