Coordinates: 16°04′00″N 80°42′32″E / 16.066685°N 80.708935°E / 16.066685; 80.708935

నడింపల్లి (చెరుకుపల్లి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నడింపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
నడింపల్లి is located in Andhra Pradesh
నడింపల్లి
నడింపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°04′00″N 80°42′32″E / 16.066685°N 80.708935°E / 16.066685; 80.708935
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,653
 - పురుషుల సంఖ్య 1,289
 - స్త్రీల సంఖ్య 1,364
 - గృహాల సంఖ్య 808
పిన్ కోడ్ 522259
ఎస్.టి.డి కోడ్ 08648

నడింపల్లి, బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చెరుకుపల్లి నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తెనాలి నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 808 ఇళ్లతో, 2653 జనాభాతో 520 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1289, ఆడవారి సంఖ్య 1364. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 328 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 6. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590441[1].పిన్ కోడ్: 522259. ఎస్.టి.డి.కోడ్ = 08648.

2001 వ.సంవత్సరం జనాభాా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2585.[2] ఇందులో పురుషుల సంఖ్య 1250, స్త్రీల సంఖ్య 1335,గ్రామంలో నివాస గృహాలు 777 ఉన్నాయి.

గ్రామ భౌగోళికం[మార్చు]

నడింపల్లి చెరుకుపల్లి మండలంలోని ప్రముఖ గ్రామం. ఇది రేపల్లె, తెనాలి మార్గంలో ఉంది. ఈ గ్రామం అక్షాంశ పరిధి - 80°42'38"E రేఖాంశ పరిధి16°3'59"N.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో గూడవల్లి, రాజవోలు, కనగాల, పెద్దవరం, ఆళ్ళవారిపాలెం గ్రామాలు ఉన్నాయి.

సరిహద్దులు[మార్చు]

తూర్పు - గూడవల్లి
పడమర - పొన్నపల్లి
ఉత్తరం - పాంచాలవరం
దక్షిణం - రాజోలు

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి. బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల‌లు గూడవల్లిలో ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల చెరుకుపల్లిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆరుంబాకలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ తెనాలిలోను, మేనేజిమెంటు కళాశాల పొన్నపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల గూడవల్లిలోను, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

నడింపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

నీటి శుద్ధి పథకం[మార్చు]

ఈ గ్రామంలో 2014,అక్టోబరు-2వ తేదీన ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పేరుతో ఒక నీటి శుద్ధి పథకాన్ని, నియోజకవర్గంలోనే మొదటిసారిగా ప్రారంభం చేసారు. ఈ పథకం ప్రకారం, 20 లీటర్ల శుద్ధినీటిని రెండు రూపాయలకే అందించుచున్నారు. ఈ రకంగా ఒక రోజుకు 2,000 లీటర్ల నీటిని ఈ గ్రామస్తులకేగాక, దూరప్రాంతాలవారికి గూడా సరఫరా చేయటం వలన ఈ పథకం త్వరలోనే ప్రజల అభిమానం పొందినది. ఈ గ్రామానికి చెందిన స్వర్గీయ డాక్టర్ కొడాలి వరప్రసాదరావు ఙాపకార్ధం, వారి కుమారుడు డాక్టర్ రజనీకాంత్, నాలుగు లక్షల రూపాయలతో ఆధునిక సాంకేతిక పరిఙానాన్ని ఉపయోగించి తయారుచేసిన యంత్రపరికరాలను ఈ పథకానికి విరాళంగా అందించారు. సర్పంచ్ శ్రీమతి గోగినేని వసుధ ఈ పథకానికి 50 వేల రూపాయల వ్యయంతో నాలుగు బోర్లను ఏర్పాటుచేసి, గొట్టాలను అనుసంధానం చేయడం ద్వారా రెండు రంధ్రాలతో 5,000 లీటర్ల నీటిని భూమినుండి పైకి తోడి నిలువచేసేలాగా ఏర్పాటు చేసారు. అక్కడినుండి మూడు దశలలో నీటిని శుద్ధిచేసి, నాలుగో దశలో "బ్లూ-రే" టెక్నాలజీలో మనిషి ఆరోగ్యాన్ని హానిచేసే బ్యాక్టీరియా, వైరస్ లను తొలగించి శుద్ధిచేసెదరు. ఈ నీటిని ఒక స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంకులో నిలువచేసెదరు. అక్కడి నుండి ఫిల్టర్ పాయింట్ ద్వారా. కుళాయిలద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిఙానంతో నీటిని శుద్ధిచేయుటవలన, విటమినులు మరియూ ఖనిజ లవణాలు నశించిపోకుండా జాగ్రత్త తీసుకున్నారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ నీటిశుద్ధి ఆర్.ఓ.ప్లాంట్ సరఫరా సంస్థ అయిన "హోలీ వాటర్" అను సంస్థవారు ఈ పథకానికి ఆధునిక యంత్ర పరికరాలను అందించారు. దాతలు వీటిని అందించారు. ఇప్పటివరకూ ఉన్న శుద్ధినీటి పథకాలన్నిటికన్నా ఈ పథకం ద్వారా సరఫరా అగుచున్న నీరు చాలా బాగుంటున్నదని ప్రజల అభిప్రాయం. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను పంచాయతీ వారే నిర్వహించుచున్నారు. ప్రజలకు వారు చెల్లించిన పైకానికి, పంచాయతీ వారు రసీదు గూడా ఇవ్వడం విశేషం. పంచాయతీవారు ఈ పథకం కొరకు ఇద్దరు ఉద్యోగులను నియమించారు. 20 లీటర్ల నీటికి ప్రజలు చెల్లించే రెండు రూపాయల్తోనే, ఈ పథకం నిర్వహణ, సిబ్బంది జీతాలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులు వగైరా వ్యయానికి సరిపోవుచున్నవి. [4]

ఈ కేంద్రానికి, శ్రీ గోగినేని హిమాచలపతిరావు, హైమవతి దంపతుల ఙాపకార్ధం, వారి కుమారుడు శ్రీ గోగినేని వెంకటసుబ్బారావు, 20 లీటర్ల సామర్ధ్యం గల 160 నీటి డబ్బాలను విరాళంగా అందజేసినారు. వీటి విలువ 20,000 రూపాయలు.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

నడింపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

నడింపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 64 హెక్టార్లు
  • బంజరు భూమి: 8 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 446 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 23 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 432 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

నడింపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు (ప్రకాశం బ్యారేజి కాలువలు): 423 హెక్టార్లు.
  • చెరువులు - సూరమ్మ చెరువు, అంకాలమ్మ చెరువు
  • బావులు/బోరు బావులు: 8 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

నడింపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, మొక్కజొన్న

గ్రామ పంచాయితీ[మార్చు]

  1. ఈ గ్రామం పూర్వం గూడవల్లి పంచాయితీలో వుండేది. గూడవల్లితో ఈ గ్రామానికి సంబంధం ఎక్కువ.
  2. ఈ గ్రామ పంచాయితీ క్రింద అనగాని పాలెం, పులిపాలెం, శివరాంపురం మొదలైన చిన్న గ్రామాలు ఉన్నాయి.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గోగినేని వసుధ, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె తరువాత గుంటూరు జిల్లా మహిళా సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • శ్రీ శిఖరేశ్వరస్వామివారి ఆలయం
  • శ్రీరాంపురం రామమందిరం
  • గ్రామ దేవత అంకాళమ్మ ఆలయం:పులి వారి ఇలవేలుపు శ్రీ అంకమ్మ తల్లి కొలుపులు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము.

జాతీయ ఆహార పథకంలో భాగంగా, 2014-15 సంవత్సరానికి గాను, "పంటల సరళి ఆధారిత గ్రామo"గా నడింపల్లి గ్రామాన్ని గుర్తించారు. ఈ పథకం క్రింద 20 హెల్టర్లలో, 50 మంది రైతులతో ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఎంపికచేసిన రైతులకు 3% రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించెదరు. [3]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ప్రధాన వృత్తి - వ్యవసాయం

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అబ్భివృద్ధి చేయాలని, ఎలీప్ (అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నిర్ణయించింది. [4]

శ్రీ కొడాలి గోకుల్:- ఈ గ్రామానికి చెందిన శ్రీ కొడాలి శివరామకృష్ణయ్య, బి.కాం., చదివి గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు. వీరి శ్రీమతి అనసూయాదేవి ఇంటర్ వరకు చదువుకున్నారు. వీరి కుమారుడు శ్రీ గోకుల్, మద్రాస్ ఐ.ఐ.టి.లో బి.టెక్., చదివి అనంతరం సివిల్స్ లో ప్రవేశపరీక్ష వ్రాసినారు. ఇటీవల వెలువరించిన సివిల్స్ పరీక్షా ఫలితాలలో ఆయన 345వ ర్యాంక్ సాధించారు. [9]

ఈ గ్రామంలో 2017,జూన్-27 నుండి 29 వరకు, రైతులకు ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ తరగతులు నిర్వహించుచున్నారు. [11]

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-10-19.