నిజామాబాద్ నార్త్ మండలం
నిజామాబాద్ నార్త్ మండలం తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండల కేంద్రం. [1]
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నిజామాబాద్ నార్త్ అనే పేరుతో నూతన మండలం (0+2) (రెండు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇవి రెండు నిజామాబాదు నగర పరిధిలో చేరిన పట్టణ ప్రాంతాలు.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
మండలంలో దర్శించదగిన ఆలయాలు[మార్చు]
నీల కంటేశ్వరాలయం: మండలంలోని కంటేశ్వర్ లో కొండపై నీలకంటేశ్వర ఆలయం ఉంది.ఇది 16 వశతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది.[2] ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని జైనుల కోసం శాతవాహన రాజు శాతకర్ణి -2 నిర్మించాడు. ఈ నిర్మాణాం ఉత్తర భారతీయ నిర్మాణ శైలితో దగ్గరి పోలిక ఉంది. రథ సప్తమి పండుగ ఈ ఆలయంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం.మహారాష్ట్రలోని నాందేడ్ నుండి రహదారి ద్వారా ఇక్కడకి చేరుకోవచ్చు.[3]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-24.
- ↑ "SRI NEELAKANTESHWARA TEMPLE - TRAVEL INFO". Trawell.in. Retrieved 2020-01-19.
- ↑ "శ్రీ నీలకంటేశ్వర టెంపుల్, Nizamabad". telugu.nativeplanet.com. Retrieved 2020-01-19.