Jump to content

నిశ్శంకరరావు వెంకటరత్నం

వికీపీడియా నుండి
కీ.శే.
నిశ్శంకరరావు వెంకటరత్నం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
In office
అంతకు ముందు వారుతంగి సత్యనారాయణ
తరువాత వారుజి. నారాయణరావు
వ్యక్తిగత వివరాలు
జననం
ఏటుకూరు, గుంటూరు జిల్లా
మరణం
జాతీయతభారత దేశం

నిశ్శంకరరావు వెంకటరత్నం ఏడవ శాసనసభ (1983-1984) స్పీకరుగా 1984వ సంవత్సరం సెప్టెంబరు 20వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1985వ సంవత్సరం జనవరి 10వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించాడు.[1][2]

జననం, విద్య

[మార్చు]

ఈయన 1927వ సంవత్సరము జూన్ 17వ తేదీన గుంటూరు జిల్లాకు సమీపంలోని ఏటుకూరు గ్రామంలో జన్మించాడు. గుంటూరులోని ఎ.సి. కాలేజిలో బి.ఎ. డిగ్రీని, మద్రాసు లా కాలేజీ నుండి లా డిగ్రీని పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఇతను 1972వ సంవత్సరములో ఐదవ శాసనసభకు, 1983వ సంవత్సరములో ఏడవ శాసనసభకు గుంటూరు-2 నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. ఈయన 1983-1984 సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుత్వ సంస్థల కమిటీ అధ్యక్షునిగా పనిచేశాడు. 1985వ సంవత్సరములో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెనాలి నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యాడు. శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా వెంకటరత్నం రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి.

మరణం

[మార్చు]

ఈయన 2004వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "పూర్వ ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతుల జాబితా". Archived from the original on 2024-06-23. Retrieved 2019-04-01.
  2. "ఆంధ్రప్రదేశ్ శసనసభ జాలస్థలంలో ఎన్. వెంకటరత్నం గురించిన పరిచయం". Archived from the original on 2018-12-17. Retrieved 2019-04-01.