నిశ్శంకరరావు వెంకటరత్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీ.శే.
నిశ్శంకరరావు వెంకటరత్నం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
In office
20 September 1984 – 10 January 1985
అంతకు ముందు వారుతంగి సత్యనారాయణ
తరువాత వారుజి. నారాయణరావు
వ్యక్తిగత వివరాలు
జననం17 June 1927
ఏటుకూరు, గుంటూరు జిల్లా
మరణం6 August 2004
జాతీయతభారత దేశం

నిశ్శంకరరావు వెంకటరత్నం ఏడవ శాసనసభ (1983-1984) స్పీకరుగా 1984వ సంవత్సరం సెప్టెంబరు 20వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1985వ సంవత్సరం జనవరి 10వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించాడు.[1][2]

జననం, విద్య[మార్చు]

ఈయన 1927వ సంవత్సరము జూన్ 17వ తేదీన గుంటూరు జిల్లాకు సమీపంలోని ఏటుకూరు గ్రామంలో జన్మించాడు. గుంటూరులోని ఎ.సి. కాలేజిలో బి.ఎ. డిగ్రీని, మద్రాసు లా కాలేజీ నుండి లా డిగ్రీని పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఇతను 1972వ సంవత్సరములో ఐదవ శాసనసభకు, 1983వ సంవత్సరములో ఏడవ శాసనసభకు గుంటూరు-2 నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. ఈయన 1983-1984 సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుత్వ సంస్థల కమిటీ అధ్యక్షునిగా పనిచేశాడు. 1985వ సంవత్సరములో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెనాలి నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యాడు. శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా వెంకటరత్నం రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి.

మరణం[మార్చు]

ఈయన 2004వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన మరణించాడు.

మూలాలు[మార్చు]