నిశ్శంకరరావు వెంకటరత్నం
కీ.శే. నిశ్శంకరరావు వెంకటరత్నం | |
---|---|
![]() | |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి | |
In office – | |
అంతకు ముందు వారు | తంగి సత్యనారాయణ |
తరువాత వారు | జి. నారాయణరావు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఏటుకూరు, గుంటూరు జిల్లా |
మరణం | |
జాతీయత | భారత దేశం |
నిశ్శంకరరావు వెంకటరత్నం ఏడవ శాసనసభ (1983-1984) స్పీకరుగా 1984వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1985వ సంవత్సరం జనవరి 10వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించాడు.[1][2]
జననం, విద్య[మార్చు]
ఈయన 1927వ సంవత్సరము జూన్ 17వ తేదీన గుంటూరు జిల్లాకు సమీపంలోని ఏటుకూరు గ్రామంలో జన్మించాడు. గుంటూరులోని ఎ.సి. కాలేజిలో బి.ఎ. డిగ్రీని, మద్రాసు లా కాలేజీ నుండి లా డిగ్రీని పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు.
రాజకీయ జీవితం[మార్చు]
ఇతను 1972వ సంవత్సరములో ఐదవ శాసనసభకు, 1983వ సంవత్సరములో ఏడవ శాసనసభకు గుంటూరు-2 నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. ఈయన 1983-1984 సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుత్వ సంస్థల కమిటీ అధ్యక్షునిగా పనిచేశాడు. 1985వ సంవత్సరములో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెనాలి నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యాడు. శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా వెంకటరత్నం రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి.
మరణం[మార్చు]
ఈయన 2004వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన మరణించాడు.