నీలకంఠ దీక్షితులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నీలకంఠ దీక్షితులు 17వ శతాబ్దానికి చెందిన మధురై రాజు తిరుమలై నాయక్ ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. అతను ఆనంద సాగర స్తవం సహా అనేక పద్యాలు మఱియు సాహిత్య రచనలను రచించాడు.

జీవిత చరిత్ర[మార్చు]

మహాకవి శ్రీ నీలకంఠ దీక్షితార్ 17వ శతాబ్దం చివరలో 1684 మే 23వ తేదీన తమిళ పంచాంగంలోని జయ వర్షంలో వైశాఖ మాసంలో జన్మించారు. అతను భరద్వాజ గోత్రానికి చెందినవాడు మఱియు సామ వేదికుడు. అతను మీనాక్షి దేవికి అమితమైన భక్తుడు.  అతను గొప్ప అద్వైత సన్యాసి అప్పయ్య దీక్షిత వంశానికి చెందినవాడు. అతను అరసానపల్లి వేంకటాధ్వరికి సమకాలికుడు.

మధురై (ప్రస్తుత తమిళనాడు, భారతదేశం) రాజు తిరుమలై నాయక రాజ దర్బారులో మంత్రిగా పని చేస్తున్న సమయంలో అతని పర్యవేక్షణలో మదురై మీనాక్షి అమ్మన్ దేవాలయం వద్ద వసంత మంటపం లేదా ఇప్పుడు పుదు మండపంగా పిలువబడుతుంది కట్టించి, వండియూర్ తెప్పకులం పెద్ద చెరువును కూడా తవ్వించాడు. చెరువు కోసం త్రవ్వకాలలో ఒక వినాయగర్ విగ్రహం కనుగొనబడింది. ఇప్పుడు దీనిని మధురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో ఉంచబడిన ముక్కురుణి వినాయగర్ అని పేరు పెట్టారు. వృద్ధాప్యంలో అతను తిరునెల్వేలి జిల్లాలోని పాలమడై గ్రామంలో స్థిరపడ్డాడు. మదురైకి దక్షిణాన ఉన్నాడు. పాలమడై గ్రామాన్ని తిరుమల నాయక రాజు అతనికి బహుమతిగా ఇచ్చాడు, ఈ పురావస్తు ఆధారాలు ఆ కాలాలలో ఉపయోగించిన రాగి ఫలకాల రూపంలో ఉన్నాయి. ఇది ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వారి మధుర మాన్యువల్‌లో కూడా ప్రచురించబడింది. మంగళంకురేశ్వర సన్నిధి ముఖద్వారం గోడలో ఉత్తరాభిముఖంగా చెక్కబడి దీనిని ప్రస్తావించుట జరిగింది.. ఈ చెక్కడం యొక్క కాపీని ASI యొక్క ఎపిగ్రఫీ విభాగం నుండి పొందవచ్చు.  [1]

రచనలు[మార్చు]

ఆయన రచనలను చెన్నైలోని మహాకవి నీలకంఠ దీక్షితార్ ట్రస్ట్ క్రమం తప్పకుండా ప్రచురిస్తుంది. ఇవి కాకుండా చెన్నై నుండి ప్రచురితమైన అమ్మన్ దర్శనం వంటి ఆధ్యాత్మిక పత్రికలలో కూడా ప్రచురించబడ్డాయి. ఆయన వ్రాసిన ప్రసిద్ధ రచనలు: గంగావతారం, వైరాగ్య శతకం, నలచరిత్ర, శాంతివిలాసం, శివోక్త రసమంజరి, ముకుంద విలాసం, రఘువీరస్తవము, చండీరహస్యం, అన్యోపదేశ శతకం, నీలకంఠ విజయ కంపూరవం, శివతత్త్వ రహస్యం, శివలీలార్నవము మొదలైనవి.

ప్రస్తావనలు[మార్చు]

  1. "Scholars pay tribute to advaita acharyas". The Hindu. 5 February 2015.